సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారటమే కాదు.. తరచూ తన వ్యాఖ్యలతో.. సినిమాలతో వార్తల్లో నిలుస్తుంటారు రాంగోపాల్ వర్మ. సంచలన పరిణామాల్ని సినిమాలుగా తీయటం.. ఏదైనా ప్రముఖ ఘటన చోటు చేసుకున్నంతనే దానికి సంబంధించిన సినిమాను ప్రకటించటం వర్మకు అలవాటే. ఇప్పటికి పలు సినిమాలు తీసిన ఆయన.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ ఉదంతాన్ని సినిమా రూపంలో తీయనున్నట్లు ప్రకటించారు వర్మ.
ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇప్పటికే ఆయన విడుదల చేశారు. దీనిపై దిశ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్ర హాన్ని అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే న్యాయస్థానంలో న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ సినిమా విడుదల కాకుండా ఆపాలని వారు కోరుతున్నారు.
ఈ ఘటనను సినిమాగా తీయాలనుకోవటం సరికాదని దిశ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. వర్మ తీస్తున్న సినిమాను కేంద్ర ప్రభుత్వం.. సెన్సార్ బోర్డు ఎందుకు నియంత్రించటం లేదో ప్రశ్నించాలని తన పిటిషన్ లో కోరారు. దీనికి వర్మ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. నిజాలు చెప్పటం కోసమే తాను సినిమాను చూస్తున్నట్లు పేర్కొన్నారు. పిటిషనర్ అభ్యర్థనను త్వరగా పరిష్కరించాలని కేంద్రాన్ని.. సెన్సార్ బోర్డును ఆదేశించారు.
ఇదిలా ఉంటే.. ఈ రోజు (ఆదివారం) ఉదయం రాంగోపాల్ వర్మ నివాసం ముందు దిశ కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. తమ కుమార్తెకి జరిగిన దారుణ ఉదంతాన్ని సినిమాగా తీయటాన్ని వారు తప్పు పట్టారు. ఈ పరిణామం ఇప్పుడు షాకింగ్ గా మారింది. మరి.. తాజా పరిణామంపై వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.
This post was last modified on October 11, 2020 12:09 pm
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…