సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారటమే కాదు.. తరచూ తన వ్యాఖ్యలతో.. సినిమాలతో వార్తల్లో నిలుస్తుంటారు రాంగోపాల్ వర్మ. సంచలన పరిణామాల్ని సినిమాలుగా తీయటం.. ఏదైనా ప్రముఖ ఘటన చోటు చేసుకున్నంతనే దానికి సంబంధించిన సినిమాను ప్రకటించటం వర్మకు అలవాటే. ఇప్పటికి పలు సినిమాలు తీసిన ఆయన.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ ఉదంతాన్ని సినిమా రూపంలో తీయనున్నట్లు ప్రకటించారు వర్మ.
ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇప్పటికే ఆయన విడుదల చేశారు. దీనిపై దిశ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్ర హాన్ని అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే న్యాయస్థానంలో న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ సినిమా విడుదల కాకుండా ఆపాలని వారు కోరుతున్నారు.
ఈ ఘటనను సినిమాగా తీయాలనుకోవటం సరికాదని దిశ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. వర్మ తీస్తున్న సినిమాను కేంద్ర ప్రభుత్వం.. సెన్సార్ బోర్డు ఎందుకు నియంత్రించటం లేదో ప్రశ్నించాలని తన పిటిషన్ లో కోరారు. దీనికి వర్మ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. నిజాలు చెప్పటం కోసమే తాను సినిమాను చూస్తున్నట్లు పేర్కొన్నారు. పిటిషనర్ అభ్యర్థనను త్వరగా పరిష్కరించాలని కేంద్రాన్ని.. సెన్సార్ బోర్డును ఆదేశించారు.
ఇదిలా ఉంటే.. ఈ రోజు (ఆదివారం) ఉదయం రాంగోపాల్ వర్మ నివాసం ముందు దిశ కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. తమ కుమార్తెకి జరిగిన దారుణ ఉదంతాన్ని సినిమాగా తీయటాన్ని వారు తప్పు పట్టారు. ఈ పరిణామం ఇప్పుడు షాకింగ్ గా మారింది. మరి.. తాజా పరిణామంపై వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.
This post was last modified on October 11, 2020 12:09 pm
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…