Movie News

వర్మకు షాకిచ్చిన దిశ కుటుంబ సభ్యులు

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారటమే కాదు.. తరచూ తన వ్యాఖ్యలతో.. సినిమాలతో వార్తల్లో నిలుస్తుంటారు రాంగోపాల్ వర్మ. సంచలన పరిణామాల్ని సినిమాలుగా తీయటం.. ఏదైనా ప్రముఖ ఘటన చోటు చేసుకున్నంతనే దానికి సంబంధించిన సినిమాను ప్రకటించటం వర్మకు అలవాటే. ఇప్పటికి పలు సినిమాలు తీసిన ఆయన.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ ఉదంతాన్ని సినిమా రూపంలో తీయనున్నట్లు ప్రకటించారు వర్మ.

ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇప్పటికే ఆయన విడుదల చేశారు. దీనిపై దిశ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్ర హాన్ని అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే న్యాయస్థానంలో న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ సినిమా విడుదల కాకుండా ఆపాలని వారు కోరుతున్నారు.

ఈ ఘటనను సినిమాగా తీయాలనుకోవటం సరికాదని దిశ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. వర్మ తీస్తున్న సినిమాను కేంద్ర ప్రభుత్వం.. సెన్సార్ బోర్డు ఎందుకు నియంత్రించటం లేదో ప్రశ్నించాలని తన పిటిషన్ లో కోరారు. దీనికి వర్మ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. నిజాలు చెప్పటం కోసమే తాను సినిమాను చూస్తున్నట్లు పేర్కొన్నారు. పిటిషనర్ అభ్యర్థనను త్వరగా పరిష్కరించాలని కేంద్రాన్ని.. సెన్సార్ బోర్డును ఆదేశించారు.

ఇదిలా ఉంటే.. ఈ రోజు (ఆదివారం) ఉదయం రాంగోపాల్ వర్మ నివాసం ముందు దిశ కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. తమ కుమార్తెకి జరిగిన దారుణ ఉదంతాన్ని సినిమాగా తీయటాన్ని వారు తప్పు పట్టారు. ఈ పరిణామం ఇప్పుడు షాకింగ్ గా మారింది. మరి.. తాజా పరిణామంపై వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.

This post was last modified on October 11, 2020 12:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago