Movie News

నా సినిమా ఎవ్వరూ చూడలేదు-బాలీవుడ్ లెజెండ్!

బాలీవుడ్లో గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్స్ కమ్ డైరెక్టర్లలో విధు వినోద్ చోప్రా ఒకడు. మున్నాభాయ్ సిరీస్, 3 ఇడియట్స్ లాంటి గొప్ప చిత్రాలకు ఆయన నిర్మాత. వాటి స్క్రిప్టులో కూడా ఆయన కృషి ఉంది. దర్శకుడిగా కూడా కొన్ని మంచి సినిమాలు తీశారు. ఆయన దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన ‘ట్వల్త్ ఫెయిల్’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో.. దానికి ఎన్ని పురస్కారాలు దక్కాయో తెలిసిందే. అయితే ఆయన్నుంచి తాజాగా వచ్చిన డాక్యుమెంటరీ ఫిలిం ‘రీస్టార్ట్ ఫ్రమ్ జీరో’ మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది.

థియేటర్లలో ఈ చిత్రానికి కనీస స్పందన కూడా కరవైంది. ఐతే ఈ విషయాన్ని నిజాయితీగా అంగీకరించడానికి తనకేమీ నామోషీగా లేదని అంటున్నాడు విధు వినోద్ చోప్రా. బాలీవుడ్లో ఫేక్ కలెక్షన్లతో ఆడని సినిమాను హిట్ అని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయిందంటూ ఈ సందర్భంగా ఆయన అసహనం వ్యక్తం చేశారు.

‘‘’సినిమా మార్కెటింగ్ మొత్తం అబద్ధాల మీద నడుస్తోంది. ఈ రోజుల్లో ఆడని సినిమా ఆడలేదని ఎవ్వరూ చెప్పుకోవట్లేదు. ఫేక్ కలెక్షన్లు చూపించి హిట్ అని చెప్పుకుంటున్నారు. వీళ్లే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెర్స్‌కు డబ్బులు ఇచ్చి సినిమా గురించి గొప్పలు చెప్పించుకుంటారు. కలెక్షన్లు లేని సినిమాకు హౌస్ ఫుల్స్ పడుతున్నట్లు చూపిస్తారు. కానీ థియేటర్లలో మాత్రం జనం ఉండదు. ఇటీవల నా సినిమా ‘రీస్టార్ట్ ఫ్రమ్ జీరో’ విడుదలైంది.

కానీ దాన్ని థియేటర్లకు వచ్చి ఎవ్వరూ చూడలేదు. ఆ విషయం నేను నిజాయితీగా అంగీకరిస్తున్నా. తమ సినిమాను ప్రేక్షకులు చూడలేదని ఎవ్వరూ నిజాయితీగా చెప్పరు. విదేశాల్లో చదువుకుంటున్న నా కూతురికి ఫోన్ చేసి నా సినిమాను జనం చూడట్లేదని చెబితే.. నేనలా చెప్పినందుకు ఆమె షాకైంది’’ అని విధు వినోద్ తెలిపారు. ‘రీస్టార్ట్ ఫ్రమ్ జీరో’.. ‘ట్వల్త్ ఫెయిల్’ వెనుక బ్యాగ్రౌండ్ గురించి తీసిన డాక్యుమెంటరీ ఫిలిం కావడం విశేషం.

This post was last modified on December 20, 2024 10:27 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

5 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

8 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

8 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

9 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

9 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

11 hours ago