సినిమాల మేకింగ్ ముచ్చట్లను రిలీజ్ తర్వాత ఆన్ లైన్లో రిలీజ్ చేయడం మామూలే. చాలా వరకు యూట్యూబ్లోనే అలాంటి వీడియోలు అందుబాటులోకి వస్తుంటాయి. కానీ ఇప్పుడు మేకింగ్ ముచ్చట్లను కూడా ఒక డాక్యుమెంటరీగా మార్చి థియేటర్లలో రిలీజ్ చేసే ట్రెండ్ వస్తోంది. ‘బాహుబలి’ నుంచి సినిమా మార్కెటింగ్ను మరో స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి ఇప్పుడు ఇదే ప్రయత్నం చేస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సంచలనం రేపిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించి తెర వెనుక ముచ్చట్లతో ఆయన టీం ‘ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ రూపొందించింది.
ఇటీవలే దీని ట్రైలర్ కూడా రిలీజైంది. అది ఆసక్తికరంగానే అనిపించింది. ఐతే ఇది ఏదైనా ఓటీటీ లేదా యూట్యూబ్ ద్వారా రిలీజవుతుందేమో అనుకుంటే.. థియేట్రికల్ రిలీజ్ అని చెప్పి షాకిచ్చారు. ఇవాల్టి నుంచే ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ థియేటర్లలో ప్రదర్శితం కానుంది. బుక్ మై షోలో దీని టికెట్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. టికెట్ల ధరలు రూ.200 నుంచి 300 వరకు ఉన్నాయి. గంటా 38 నిమిషాల నిడివితో ఈ డాక్యుమెంటరీ రిలీజవుతోంది. ఐతే ఇలాంటి తెర వెనుక ముచ్చట్లను ఫ్రీగా యూట్యూబ్లో చూడమంటే ఓకే కానీ.. థియేటర్లకు వెళ్లి డబ్బులు పెట్టి మరీ చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారా అన్నది సందేహం.
ప్రతిదాన్నీ మార్కెట్ చేయాలని, క్యాష్ చేసుకోవాలని చూడడం ఎంత వరకు కరెక్ట్ అనే చర్చ జరుగుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ ఆల్రెడీ రూ.1300 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ డాక్యుమెంటరీకి బుకింగ్స్ కూడా అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. రేప్పొద్దున ఏదో ఒక ఓటీటీలో ఈ డాక్యుమెంటరీ రిలీజైనపుడు చూసుకుందాం అని జనాలు లైట్ తీసుకునే పరిస్థితే కనిపిస్తోంది.
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…