టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత గురించి చెప్పనక్కర్లేదు. తమన్, దేవిశ్రీ ప్రసాద్ ని అందరూ తీసుకోలేరు. పైగా వాళ్ళు చేస్తున్న ప్యాన్ ఇండియా సినిమాల్లో ఉన్న బిజీలో మీడియం రేంజ్ వాటి మీద దృష్టి పెట్టడం కష్టమే. మిక్కీ జె మేయర్ విదేశాల్లో ఉంటాడు. అనూప్ రూబెన్స్ ఫామ్ తగ్గిపోయింది. మణిశర్మ మేజిక్ పని చేయడం లేదు. అనిరుధ్ రవిచందర్ సరేసరి. పది కోట్లు ఇచ్చినా సులభంగా దొరికే పరిస్థితి లేదు. అందుకే పక్కబాషల నుంచి జివి ప్రకాష్ కుమార్, హరీష్ జైరాజ్, సంతోష్ నారాయణన్, హేశం అబ్దుల్ వహాబ్ లాంటి వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి టైంలో భీమ్స్ లాంటివాళ్ళు ఆశాకిరణం అవుతున్నారు.
తాజాగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాంకి అతనిచ్చిన రెండు పాటలు ఛార్ట్ బస్టర్ లు అయిపోయాయి. ఈ మధ్యకాలంలో ఇంత వేగంగా మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకున్న సాంగ్స్ ఇవే. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ లకు ఈ స్థాయి స్పందన తక్కువ టైంలో రాలేదన్నది వాస్తవం. రమణ గోగులతో గోదారి గట్టుని పాడించడం ఓ రేంజ్ లో పేలింది. మెలోడీ మాస్ మిక్స్ చేస్తూ కంపోజ్ చేసిన మీను మీను కూడా వెంటనే ఎక్కేస్తోంది. అనిల్ రావిపూడి టేకింగ్ కి తోడు వెంకీకి జంటగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి చేసిన అల్లరి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. మిగిలిన పాటలు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయని ప్రీ టాక్.
ధమాకా బ్లాక్ బస్టర్ తర్వాత భీమ్స్ ఇచ్చిన బెస్ట్ ఆల్బమ్ మ్యాడ్ ఒక్కటే. టిల్లు స్క్వేర్ కు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది. దేవకీనందన వాసుదేవ, విశ్వం లాంటివి అంతగా వర్కౌట్ కాలేదు కానీ నెక్స్ట్ రాబోయే రవితేజ మాస్ జాతర, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ టైసన్ నాయుడు, అడవి శేష్ డెకాయిట్ లాంటి పెద్ద సినిమాలు చేతిలో ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తరహా పనితనం ఇకపై కూడా కొనసాగిస్తే భీమ్స్ కు తిరుగు ఉండదు. 2012లో నువ్వా నేనాతో ఇండస్ట్రీకి వచ్చిన భీమ్స్ సిసిరోలియోకి ఇన్నేళ్లకు బ్రేక్ దొరుకుతోంది. దాన్ని నిలబెట్టుకోవడమే కావాల్సింది. అందులో భాగంగా 2025 కీలకం కానుంది.
This post was last modified on December 20, 2024 7:09 am
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…