టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత గురించి చెప్పనక్కర్లేదు. తమన్, దేవిశ్రీ ప్రసాద్ ని అందరూ తీసుకోలేరు. పైగా వాళ్ళు చేస్తున్న ప్యాన్ ఇండియా సినిమాల్లో ఉన్న బిజీలో మీడియం రేంజ్ వాటి మీద దృష్టి పెట్టడం కష్టమే. మిక్కీ జె మేయర్ విదేశాల్లో ఉంటాడు. అనూప్ రూబెన్స్ ఫామ్ తగ్గిపోయింది. మణిశర్మ మేజిక్ పని చేయడం లేదు. అనిరుధ్ రవిచందర్ సరేసరి. పది కోట్లు ఇచ్చినా సులభంగా దొరికే పరిస్థితి లేదు. అందుకే పక్కబాషల నుంచి జివి ప్రకాష్ కుమార్, హరీష్ జైరాజ్, సంతోష్ నారాయణన్, హేశం అబ్దుల్ వహాబ్ లాంటి వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి టైంలో భీమ్స్ లాంటివాళ్ళు ఆశాకిరణం అవుతున్నారు.
తాజాగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాంకి అతనిచ్చిన రెండు పాటలు ఛార్ట్ బస్టర్ లు అయిపోయాయి. ఈ మధ్యకాలంలో ఇంత వేగంగా మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకున్న సాంగ్స్ ఇవే. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ లకు ఈ స్థాయి స్పందన తక్కువ టైంలో రాలేదన్నది వాస్తవం. రమణ గోగులతో గోదారి గట్టుని పాడించడం ఓ రేంజ్ లో పేలింది. మెలోడీ మాస్ మిక్స్ చేస్తూ కంపోజ్ చేసిన మీను మీను కూడా వెంటనే ఎక్కేస్తోంది. అనిల్ రావిపూడి టేకింగ్ కి తోడు వెంకీకి జంటగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి చేసిన అల్లరి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. మిగిలిన పాటలు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయని ప్రీ టాక్.
ధమాకా బ్లాక్ బస్టర్ తర్వాత భీమ్స్ ఇచ్చిన బెస్ట్ ఆల్బమ్ మ్యాడ్ ఒక్కటే. టిల్లు స్క్వేర్ కు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది. దేవకీనందన వాసుదేవ, విశ్వం లాంటివి అంతగా వర్కౌట్ కాలేదు కానీ నెక్స్ట్ రాబోయే రవితేజ మాస్ జాతర, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ టైసన్ నాయుడు, అడవి శేష్ డెకాయిట్ లాంటి పెద్ద సినిమాలు చేతిలో ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తరహా పనితనం ఇకపై కూడా కొనసాగిస్తే భీమ్స్ కు తిరుగు ఉండదు. 2012లో నువ్వా నేనాతో ఇండస్ట్రీకి వచ్చిన భీమ్స్ సిసిరోలియోకి ఇన్నేళ్లకు బ్రేక్ దొరుకుతోంది. దాన్ని నిలబెట్టుకోవడమే కావాల్సింది. అందులో భాగంగా 2025 కీలకం కానుంది.
This post was last modified on December 20, 2024 7:09 am
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…
ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…