మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్ ఉంటాయని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో వేస్తామని తాజాగా క్లారిటీ ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికా వెళ్ళబోతున్న సందర్భంగా ఈ గుడ్ న్యూస్ పంచుకున్నారు. పుష్ప 2 ది రూల్ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటన తర్వాత ఇకపై స్పెషల్ షోలు ఉండవేమోనని ఇతర హీరోల ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. గతంలో ఎప్పుడూ జరగని ఘటన కావడంతో ఏకంగా అల్లు అర్జున్ అరెస్ట్ దాకా వ్యవహారం వెళ్ళింది.
ఒకవేళ హీరో రాకపోయి ఉంటే ఇది జరిగేది కాదనే కామెంట్ ని కొట్టిపారేయలేం. సో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ లతో పాటు సంక్రాంతికి వస్తున్నాంకు సైతం ప్రీమియర్లను ఎక్స్పె క్ట్ చేయొచ్చు. దిల్ రాజు కాబట్టి పక్కా ప్లానింగ్ తో చేసుకుంటారు. పండక్కు వస్తున్న మూడు సినిమాల్లో రెండు స్వంత బ్యానర్ వే కావడం, మూడోదానికి డిస్ట్రిబ్యూటర్ అవ్వడం వల్ల అయన మీద పెద్ద బాధ్యతలు ఉండబోతున్నాయి. పంపిణి వ్యవహారాలతో పాటు స్క్రీన్ల సర్దుబాటు తదితరాలు చాలా చూసుకోవాలి. గత సంక్రాంతిని దిల్ రాజు మిస్ అయ్యారు. గుంటూరు కారం డిస్ట్రిబ్యూట్ చేసినా భారీ లాభాలు దక్కలేదు.
సో క్లారిటీ వచ్చేసింది కాబట్టి గేమ్ ఛేంజర్ సంబరాలకు ఫ్యాన్స్ రెడీ అవ్వొచ్చు. జనవరి 10 సోలో రిలీజ్ కనక భారీ ఎత్తున స్క్రీన్ కౌంట్ దక్కనుంది. ముందు వచ్చే అడ్వాంటేజ్ ఓపెనింగ్స్ పరంగా చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. అందులోనూ వినయ విధేయ రామ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా దర్శనం ఇవ్వలేదు. ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోగా ఆచార్యలో కేవలం అతిధి పాత్రకు పరిమితం కావాల్సి వచ్చింది. అందుకే గేమ్ ఛేంజర్ కోసం ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ వచ్చాక హైప్ మాములుగా పెరగదని ఇన్ సైడ్ టాక్. ఫ్యాన్స్ కి ఇప్పుడు కావాల్సింది ఆ కిక్కేగా.
This post was last modified on December 19, 2024 7:25 pm
టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు తమన్. తెలుగులో దాదాపుగా అందరు టాప్ స్టార్లతో అతను…
ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమాలో ఒక హీరోయిన్ పాత్ర విషయంలో విపరీతమైన విమర్శలు వచ్చింది ‘పెద్ది’ సినిమాకే. ఇందులో…
ఇండియా మోస్ట్ కాస్ట్లీ మూవీగా ప్రచారం జరుపుకుంటున్న రామాయణ విడుదల తేదీ విషయంలో కొత్త ట్విస్టు బయట పడింది. ఓవర్సీస్…
బడ్జెట్ తో సంబంధం లేకుండా తన సినిమా ఏదైనా రాజమౌళి అనుసరించే పద్దతి ఒకటుంది. కథను దాచుకోరు. వీలైనంత ముందే…
కేంద్రంలోని బీజేపీతోను.. ఇటు రాష్ట్రంలోని బీజేపీతోనూ కయ్యానికి సుముఖంగా లేమని వైసీపీ స్పష్టం చేస్తోంది. నిజానికి ఆది నుంచి కూడా…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈవీవీ సత్యనారాయణ గారు అలీబాబా అరడజను దొంగలు అనే సినిమా తీశారు. రాజేంద్ర ప్రసాద్…