తెలుగువాడైనప్పటికీ.. తమిళంలో హీరోగా మంచి స్థాయి అందుకున్న నటుడు విశాల్. హీరోగానే కాక నిర్మాతగానూ అతను విజయవంతమయ్యాడు. కోలీవుడ్ బిగ్ షాట్లలో ఒకడిగా ఎదిగాడు. అక్కడ నడిగర్ సంఘం కార్యదర్శిగా, నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కూడా విశాల్ హవా సాగించాడు. ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు. ఐతే ఈ పేరుతో పాటే విశాల్కు వివాదాలూ మామూలే.
తరచుగా ఏదో ఒక కాంట్రవర్శీలో అతను భాగమవుతుంటాడు. ఇటీవల రవీంద్రన్ అనే నిర్మాతతో అతడికి గొడవ మొదలైంది. విశాల్ చివరి సినిమా ‘యాక్షన్’ను నిర్మించింది ఆ నిర్మాతే. ఐతే ఈ సినిమా డిజాస్టర్ అయి ఆ నిర్మాతను ముంచేసింది. దీంతో రవీంద్రన్ కోర్టును ఆశ్రయించాడు. విశాల్ తనకు మాట ఇచ్చి తప్పినందుకు పరిహారం చెల్లించాలని పిటిషన్ వేశాడు.
‘యాక్షన్’ సినిమాను రవీంద్రన్ పరిమిత బడ్జెట్లో నిర్మించాలని అనుకున్నారట. కానీ సినిమా బడ్జెట్ పెంచమని, ఇది కనీసం రూ.20 కోట్లు వసూలు చేస్తుందని, అలా కాని పక్షంలో నష్టం భరించడానికి తాను సిద్ధమని, లేకుంటే తన తర్వాతి సినిమాను అదే బేనర్లో చేస్తానని విశాల్ హామీ ఇచ్చాడట. ఐతే ‘యాక్షన్’ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. తమిళనాట రూ.8 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్ల మేర వసూళ్లు రాబట్టి నిర్మాతకు రూ.8 కోట్లకు పైగా నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఐతే ముందు ఇచ్చిన హామీని విశాల్ నెరవేర్చలేదు. పరిహారం ఇవ్వలేదు. తన తర్వాతి సినిమాను ఆ బేనర్లోనూ చేయలేదు. ‘చక్ర’ సినిమా విశాల్ సొంత బేనర్లో తెరకెక్కిన సంగతి తెలిసిందే.
దీంతో రవీంద్రన్ కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు రవీంద్రన్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అతడికి విశాల్ రూ.8.29 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఇప్పుడు విశాల్ చిక్కుల్లో పడ్డాడు.
This post was last modified on October 10, 2020 5:34 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…