పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్న సౌత్ దర్శకుల్లో అట్లీ ఒకడు. రాజా రాణి, తెరి, మెర్శల్, బిగిల్ లాంటి బ్లాక్ బస్టర్లతో సౌత్లో జెండా పాతిన అతను.. షారుఖ్ ఖాన్ మూవీ ‘జవాన్’తో దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ చిత్రం ఏకంగా 1200 కోట్ల వసూళ్లు రాబట్టడంతో అట్లీ పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. దీని తర్వాత అతను చేసే సినిమా మీద చాన్నాళ్ల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్లతో సినిమా గురించి వార్తలు వచ్చాయి కానీ.. అవేవీ నిజం కాలేదు.
మరోవైపు షారుఖ్ ఖాన్ మళ్లీ అట్లీతో ఇంకో సినిమా చేస్తాడన్నారు కానీ.. అది ఇప్పుడే కాదని తెలుస్తోంది. మరి అట్లీ తర్వాతి సినిమాలో హీరో ఎవరు.. ఈసారి అతను సౌత్ సినిమా చేస్తాడా.. పాన్ ఇండియా స్టైల్లోనే ప్రాజెక్టు సెట్ చేస్తాడా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఐతే తన కొత్త చిత్రానికి స్క్రిప్టు పూర్తయినట్లు వెల్లడించిన అట్లీ.. ఈ సినిమాకు పని చేసే నటీనటుల విషయంలో ప్రేక్షకులకు షాకవుతారని పేర్కొన్నాడు.
‘‘నా ఆరో సినిమా స్క్రిప్టు పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇది ఔట్ ఆఫ్ ద వరల్డ్ కథగా ఉంటుంది. కచ్చితంగా ఇందులో నటీనటులను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఎవరి ఊహలకూ అందని విధంగా ఈ ప్రాజెక్టు ఉంటుంది. ఈ సినిమా చూసి దేశం గర్విస్తుంది. నటీనటుల ఎంపిక చివరి దశలో ఉంది. త్వరలోనే కాస్టింగ్ గురించి ప్రకటనలో సర్ప్రైజ్ చేస్తాను.
మీ అందరి అభిమానం, ఆశీర్వాదంతో మంచి సినిమాతో మిమ్మల్ని అలరించడానికి సిద్ధమవుతున్నా’’ అని అట్లీ తన కొత్త ప్రాజెక్టు గురించి హైప్ ఇచ్చాడు. ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని అంటున్నాడంటే ఇప్పటిదాకా పని చేయని, వేరేే స్టార్తోనే అతను సినిమా చేయబోతున్నాడని అర్థమవుతోంది. మరి ఆ హీరో ఎవరో.. ఈ కథలో అంత ప్రత్యేకత ఏముందో చూడాలి.
This post was last modified on December 18, 2024 4:27 pm
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…
వైసీపీలో మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి శకం ప్రారంభం అవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్..…