ప్రభాస్ కొత్త సినిమా ‘రాజా సాబ్’ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుండగా.. ఆ సినిమా వాయిదా అంటూ కొన్ని రోజుల కిందట మొదలైన ప్రచారం వారిని కలవర పెట్టింది. ముందు ఇది జస్ట్ రూమరే అనుకున్నారు కానీ.. ఇప్పుడు అదే నిజమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ రూపొందిస్తున్న ‘జాక్’ సినిమా కోసం ఏప్రిల్ 10నే రిలీజ్ డేట్గా ఎంచుకోవడంతో ప్రభాస్ సినిమా వాయిదాపై ఒక క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది.
‘రాజాసాబ్’ను అదే రోజు రిలీజ్ చేయబోతున్నట్లు కొన్ని నెలల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే విజువల్ ఎఫెక్ట్స్ పనుల కోసం చాలా టైం పట్టేలా ఉండడంతో ఆ డేట్ను ‘రాజా సాబ్’ అందుకోవడం కష్టమని తెలుస్తోంది. ప్రభాస్ సినిమా రావడం, రాకపోవడాన్ని బట్టి చాలా సినిమాల లెక్కలు మారిపోతాయి కాబట్టి ఇండస్ట్రీ జనాలకు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేసినట్లు కనిపిస్తోంది. మంచు విష్ణు సినిమా ‘కన్నప్ప’ను ఏప్రిల్ 25కు ఫిక్స్ చేసినపుడే ‘రాజా సాబ్’ ఆగమనంపై సందేహాలు కలిగాయి.
కేవలం రెండు వారాల గ్యాప్లో ప్రభాస్ నటించిన మరో సినిమాను పోటీలో నిలబెడతారా అనే ప్రశ్నలు తలెత్తాయి. మరోవైపు ప్రభాస్ స్నేహితులైన యువి క్రియేషన్స్ అధినేతలు ప్రొడ్యూస్ చేస్తున్న అనుష్క సినిమా ‘ఘాటి’ని ఏప్రిల్ 18కి కన్ఫమ్ చేసినపుడు ఈ సందేహాలు మరింత బలపడ్డాయి. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ సినిమాకు డేట్ ప్రకటించగానే ‘రాజా సాబ్’ వాయిదా ఖరరిపోయినట్లుగా అర్ధం అవుతుంది.
ఈ చిత్రాన్ని వేసవి చివర్లో కానీ.. లేదా ‘కల్కి’ని రిలీజ్ చేసినట్లే జూన్లో కానీ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇది హార్రర్ కామెడీ జానర్లో తెరకెక్కుతోంది.
This post was last modified on December 18, 2024 3:43 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…