Movie News

సోషల్ మీడియా ట్రోల్స్.. నయన్ భర్త హర్టు!

ఇటీవల నయనతారతో పాటు ఆమె భర్త విఘ్నేష్ శివన్ కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ధనుష్‌తో గొడవ నేపథ్యంలో వీరి గురించి చాలా చర్చ జరిగింది. ధనుష్ ఫ్యాన్స్ నుంచి ఇద్దరూ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అది చాలదని ఓ ఇంటర్వ్యూలో విఘ్నేష్ శివన్ చేసిన వ్యాఖ్యలు ట్రోల్స్‌కు దారి తీశాయి. తాను ‘ఎన్నై అరిందాల్’ (తెలుగులో ఎంతవాడు గాని)కు గౌతమ్ మీనన్ దగ్గర పని చేస్తున్న సమయంలో అజిత్‌తో మాట్లాడానని.. ఆయనకు తన సినిమా ‘నానుం రౌడీ దా’ బాగా నచ్చి, తనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారని ఆ ఇంటర్వ్యూలో విఘ్నేష్ వెల్లడించాడు.

కానీ ‘నానుం రౌడీ దా’.. ‘ఎన్నై అరిందాల్’ రిలీజైన ఆరు నెలల తర్వాతే విడుదలైంది. దీంతో రిలీజ్ కాని సినిమాను చూసి అజిత్ ఇంప్రెస్ అయ్యాడా అంటూ విఘ్నేష్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు. ఈ ట్రోల్స్‌ విషయంలో విఘ్నేష్ బాగానే హర్టయినట్లున్నాడు. తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ.. తనను వెక్కిరించడం ఆపాలని అతను విజ్ఞప్తి చేశాడు.

‘‘ఎన్నై అరిందాల్ సమయం నుంచి నాకు అజిత్ తెలుసు. ఆ సినిమా కోసం గౌతమ్ మీనన్ పాట రాయమని అడిగితే రాసిచ్చా. అప్పుడే అజిత్‌తో నాకు పరిచయం జరిగింది. నేను డైరెక్ట్ చేసిన ‘నానుం రౌడీ దా’ రిలీజయ్యాక ఆయనతో మాట్లాడా. విశ్వాసం షూటింగ్ టైంలో అజిత్ హైదరాబాద్‌లో ఉన్నపుడు కలిశా. నానుం రౌడీ దా చూశానని, చాలా బాగుందని ఆయన అన్నారు. ఇది నిజం.

మొన్న జరిగిన ఇంటర్వ్యూలో ఇదంతా చెప్పడానికి సమయం లేకపోయింది. నేను వేరే దర్శకులతో కలిసి ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నాను. అంత మంది ఉన్నపుడు ప్రతి విషయాన్నీ పూర్తిగా వివరిస్తూ ఎక్కువ టైం తీసుకోలేం. అందుకే ఆ రోజు సరిగా, వివరంగా విషయం చెప్పలేకపోయాను. ఇకనైనా నన్ను ఎగతాళి చేయడం ఆపండి’’ అని విఘ్నేష్ అన్నాడు.

This post was last modified on December 18, 2024 2:16 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

2 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

5 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

6 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

7 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

7 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

7 hours ago