ఇటీవల నయనతారతో పాటు ఆమె భర్త విఘ్నేష్ శివన్ కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ధనుష్తో గొడవ నేపథ్యంలో వీరి గురించి చాలా చర్చ జరిగింది. ధనుష్ ఫ్యాన్స్ నుంచి ఇద్దరూ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అది చాలదని ఓ ఇంటర్వ్యూలో విఘ్నేష్ శివన్ చేసిన వ్యాఖ్యలు ట్రోల్స్కు దారి తీశాయి. తాను ‘ఎన్నై అరిందాల్’ (తెలుగులో ఎంతవాడు గాని)కు గౌతమ్ మీనన్ దగ్గర పని చేస్తున్న సమయంలో అజిత్తో మాట్లాడానని.. ఆయనకు తన సినిమా ‘నానుం రౌడీ దా’ బాగా నచ్చి, తనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారని ఆ ఇంటర్వ్యూలో విఘ్నేష్ వెల్లడించాడు.
కానీ ‘నానుం రౌడీ దా’.. ‘ఎన్నై అరిందాల్’ రిలీజైన ఆరు నెలల తర్వాతే విడుదలైంది. దీంతో రిలీజ్ కాని సినిమాను చూసి అజిత్ ఇంప్రెస్ అయ్యాడా అంటూ విఘ్నేష్ను విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు. ఈ ట్రోల్స్ విషయంలో విఘ్నేష్ బాగానే హర్టయినట్లున్నాడు. తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ.. తనను వెక్కిరించడం ఆపాలని అతను విజ్ఞప్తి చేశాడు.
‘‘ఎన్నై అరిందాల్ సమయం నుంచి నాకు అజిత్ తెలుసు. ఆ సినిమా కోసం గౌతమ్ మీనన్ పాట రాయమని అడిగితే రాసిచ్చా. అప్పుడే అజిత్తో నాకు పరిచయం జరిగింది. నేను డైరెక్ట్ చేసిన ‘నానుం రౌడీ దా’ రిలీజయ్యాక ఆయనతో మాట్లాడా. విశ్వాసం షూటింగ్ టైంలో అజిత్ హైదరాబాద్లో ఉన్నపుడు కలిశా. నానుం రౌడీ దా చూశానని, చాలా బాగుందని ఆయన అన్నారు. ఇది నిజం.
మొన్న జరిగిన ఇంటర్వ్యూలో ఇదంతా చెప్పడానికి సమయం లేకపోయింది. నేను వేరే దర్శకులతో కలిసి ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నాను. అంత మంది ఉన్నపుడు ప్రతి విషయాన్నీ పూర్తిగా వివరిస్తూ ఎక్కువ టైం తీసుకోలేం. అందుకే ఆ రోజు సరిగా, వివరంగా విషయం చెప్పలేకపోయాను. ఇకనైనా నన్ను ఎగతాళి చేయడం ఆపండి’’ అని విఘ్నేష్ అన్నాడు.
This post was last modified on December 18, 2024 2:16 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…