ఇటీవల నయనతారతో పాటు ఆమె భర్త విఘ్నేష్ శివన్ కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ధనుష్తో గొడవ నేపథ్యంలో వీరి గురించి చాలా చర్చ జరిగింది. ధనుష్ ఫ్యాన్స్ నుంచి ఇద్దరూ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అది చాలదని ఓ ఇంటర్వ్యూలో విఘ్నేష్ శివన్ చేసిన వ్యాఖ్యలు ట్రోల్స్కు దారి తీశాయి. తాను ‘ఎన్నై అరిందాల్’ (తెలుగులో ఎంతవాడు గాని)కు గౌతమ్ మీనన్ దగ్గర పని చేస్తున్న సమయంలో అజిత్తో మాట్లాడానని.. ఆయనకు తన సినిమా ‘నానుం రౌడీ దా’ బాగా నచ్చి, తనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారని ఆ ఇంటర్వ్యూలో విఘ్నేష్ వెల్లడించాడు.
కానీ ‘నానుం రౌడీ దా’.. ‘ఎన్నై అరిందాల్’ రిలీజైన ఆరు నెలల తర్వాతే విడుదలైంది. దీంతో రిలీజ్ కాని సినిమాను చూసి అజిత్ ఇంప్రెస్ అయ్యాడా అంటూ విఘ్నేష్ను విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు. ఈ ట్రోల్స్ విషయంలో విఘ్నేష్ బాగానే హర్టయినట్లున్నాడు. తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ.. తనను వెక్కిరించడం ఆపాలని అతను విజ్ఞప్తి చేశాడు.
‘‘ఎన్నై అరిందాల్ సమయం నుంచి నాకు అజిత్ తెలుసు. ఆ సినిమా కోసం గౌతమ్ మీనన్ పాట రాయమని అడిగితే రాసిచ్చా. అప్పుడే అజిత్తో నాకు పరిచయం జరిగింది. నేను డైరెక్ట్ చేసిన ‘నానుం రౌడీ దా’ రిలీజయ్యాక ఆయనతో మాట్లాడా. విశ్వాసం షూటింగ్ టైంలో అజిత్ హైదరాబాద్లో ఉన్నపుడు కలిశా. నానుం రౌడీ దా చూశానని, చాలా బాగుందని ఆయన అన్నారు. ఇది నిజం.
మొన్న జరిగిన ఇంటర్వ్యూలో ఇదంతా చెప్పడానికి సమయం లేకపోయింది. నేను వేరే దర్శకులతో కలిసి ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నాను. అంత మంది ఉన్నపుడు ప్రతి విషయాన్నీ పూర్తిగా వివరిస్తూ ఎక్కువ టైం తీసుకోలేం. అందుకే ఆ రోజు సరిగా, వివరంగా విషయం చెప్పలేకపోయాను. ఇకనైనా నన్ను ఎగతాళి చేయడం ఆపండి’’ అని విఘ్నేష్ అన్నాడు.
This post was last modified on December 18, 2024 2:16 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…