Movie News

సోషల్ మీడియా ట్రోల్స్.. నయన్ భర్త హర్టు!

ఇటీవల నయనతారతో పాటు ఆమె భర్త విఘ్నేష్ శివన్ కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ధనుష్‌తో గొడవ నేపథ్యంలో వీరి గురించి చాలా చర్చ జరిగింది. ధనుష్ ఫ్యాన్స్ నుంచి ఇద్దరూ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అది చాలదని ఓ ఇంటర్వ్యూలో విఘ్నేష్ శివన్ చేసిన వ్యాఖ్యలు ట్రోల్స్‌కు దారి తీశాయి. తాను ‘ఎన్నై అరిందాల్’ (తెలుగులో ఎంతవాడు గాని)కు గౌతమ్ మీనన్ దగ్గర పని చేస్తున్న సమయంలో అజిత్‌తో మాట్లాడానని.. ఆయనకు తన సినిమా ‘నానుం రౌడీ దా’ బాగా నచ్చి, తనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారని ఆ ఇంటర్వ్యూలో విఘ్నేష్ వెల్లడించాడు.

కానీ ‘నానుం రౌడీ దా’.. ‘ఎన్నై అరిందాల్’ రిలీజైన ఆరు నెలల తర్వాతే విడుదలైంది. దీంతో రిలీజ్ కాని సినిమాను చూసి అజిత్ ఇంప్రెస్ అయ్యాడా అంటూ విఘ్నేష్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు. ఈ ట్రోల్స్‌ విషయంలో విఘ్నేష్ బాగానే హర్టయినట్లున్నాడు. తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ.. తనను వెక్కిరించడం ఆపాలని అతను విజ్ఞప్తి చేశాడు.

‘‘ఎన్నై అరిందాల్ సమయం నుంచి నాకు అజిత్ తెలుసు. ఆ సినిమా కోసం గౌతమ్ మీనన్ పాట రాయమని అడిగితే రాసిచ్చా. అప్పుడే అజిత్‌తో నాకు పరిచయం జరిగింది. నేను డైరెక్ట్ చేసిన ‘నానుం రౌడీ దా’ రిలీజయ్యాక ఆయనతో మాట్లాడా. విశ్వాసం షూటింగ్ టైంలో అజిత్ హైదరాబాద్‌లో ఉన్నపుడు కలిశా. నానుం రౌడీ దా చూశానని, చాలా బాగుందని ఆయన అన్నారు. ఇది నిజం.

మొన్న జరిగిన ఇంటర్వ్యూలో ఇదంతా చెప్పడానికి సమయం లేకపోయింది. నేను వేరే దర్శకులతో కలిసి ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నాను. అంత మంది ఉన్నపుడు ప్రతి విషయాన్నీ పూర్తిగా వివరిస్తూ ఎక్కువ టైం తీసుకోలేం. అందుకే ఆ రోజు సరిగా, వివరంగా విషయం చెప్పలేకపోయాను. ఇకనైనా నన్ను ఎగతాళి చేయడం ఆపండి’’ అని విఘ్నేష్ అన్నాడు.

This post was last modified on December 18, 2024 2:16 pm

Share

Recent Posts

`అయోధ్య‌`కు రాజ‌కీయ గ్ర‌హ‌ణం వీడిన‌ట్టేనా?!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత రామ‌జ‌న్మ‌భూమి అయోధ్యలో ఉన్న బాల‌రామ‌య్య ఆల‌యానికి రాజ‌కీయ గ్ర‌హ‌ణం వీడిన‌ట్టేనా? ఇక‌, ఆల‌యానికి రాజకీయ ప్ర‌భావం,…

3 hours ago

సూర్య ఛెప్పిన కార్తి ‘పొటాటో చిప్స్’ కథ

సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ సినీ బ్రదర్స్‌లో సూర్య-కార్తి ద్వయం ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరూ తండ్రి శివకుమార్…

3 hours ago

హీరో దర్శకత్వపు కల… అదెప్పుడు నెరవేరునో

టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…

5 hours ago

సాక్షిలో రెండో పేజీకి చేరిన రాజన్న

ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…

6 hours ago

తెలంగాణా బీజేపీలో కారు లొల్లి

తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…

7 hours ago

ఓజి యునివర్స్ ఊహించనంత పెద్దగా

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…

8 hours ago