రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకు సంబంధించి అయినా, తన వ్యక్తిగత విషయాల మీదైనా దేశవ్యాప్తంగా అభిమానుల్లో అమితాసక్తి ఉంటుంది. ఇటీవల ప్రభాస్ షూటింగ్లో గాయపడ్డట్లు వార్తలు వచ్చాయి. అవి జస్ట్ రూమర్లని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ స్వయంగా గాయం గురించి ధ్రువీకరించడంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. మామూలుగా ఇలాంటి విషయాల్లో ప్రభాస్ అప్డేట్స్ ఏమీ ఇవ్వడు. కానీ వచ్చే నెలలో జపాన్లో కల్కి సినిమా భారీగా రిలీజవుతున్న నేపథ్యంలో అక్కడికి టీంతో వెళ్లి ప్రమోట్ చేయాలని ప్రభాస్ అనుకున్నాడు.
కానీ గాయం వల్ల వెళ్లలేని పరిస్థితి. దీంతో జపాన్లో తన కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు సారీ చెబుతూ.. తాను అక్కడికి రాలేకపోతున్న విషయాన్ని వెల్లడించాడు. షూట్లో చిన్న గాయం కావడం వల్ల తాను రాలేకపోతున్నట్లు వెల్లడించాడు. ఐతే జపాన్ పర్యటనను రద్దు చేసుకునేంత పెద్ద గాయం అయిందా అని అభిమానులు కలవరపడుతున్నారు. ఐతే ప్రభాస్ టీం చెబుతున్న దాని ప్రకారం జరిగింది చిన్న ప్రమాదమే, కాలికి అయిన గాయం కూడా చిన్నదే. కానీ కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరం.
దీంతో ఎక్కడికీ వెళ్లలేని పరస్థితి. ఒక రెండు వారాలైనా విశ్రాంతి తీసుకోక తప్పదట. దీంతో ఈ నెలలో జరగాల్సిన ఫౌజీ (వర్కింగ్ టైటిల్) షెడ్యూల్కు బ్రేక్ పడింది. ఈ సినిమా షూట్ ఇప్పటికే ఒక షెడ్యూల్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా రాజా సాబ్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు ప్రభాస్. ఆ సినిమా షూట్ చివరి దశకు వచ్చింది.
ప్రస్తుత బ్రేక్ వల్ల రాజాసాబ్ కూడా కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. మే నెలాఖరుకు వాయిదాపడొచ్చని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. రాజాసాబ్ డేట్ ప్రకటించాక కూడా కన్నప్ప, ఘాటి చిత్రాలను దగ్గర్లో రిలీజ్కు సిద్ధం చేయడం చూస్తేనే రాజాసాబ్ అనుకున్న డేట్కు రాదనే సంకేతాలు వచ్చేశాయి.
This post was last modified on December 17, 2024 10:52 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…