సామాన్యులకు తట్టని అర్థం కాని విధంగా సినిమాలు తీసినా అన్ని వర్గాలను మెప్పించడం ఉపేంద్ర స్టైల్. ‘ఏ’తో దాన్ని ముప్పై సంవత్సరాల క్రితమే ఋజువు చేయడం ఎవరూ మర్చిపోలేరు. అలాంటి విలక్షణ దర్శకుడి నుంచి కొత్త ప్యాన్ ఇండియా మూవీ యుఐ డిసెంబర్ 20న థియేటర్లలో అడుగు పెట్టనుంది. దీని ప్రమోషన్ కోసం నిన్న హైదరాబాద్ వచ్చిన ఉపేంద్ర చాలా కబుర్లు పంచుకున్నాడు కానీ ఆయన చెప్పిన విషయాలన్నీ క్రోడీకరించుకుంటే థియేటర్లో చూపించేది సినిమానా లేక ఏదైనా మెదడుకి పరీక్ష పెడతారా అనే అనుమానం కలగకమానదు. అంత లోతుగా క్లూస్ ఇచ్చారు మరి.
ప్రభాస్ కల్కి మైథలాజికల్ అయితే మాది సైకలాజికల్ అని చెబుతున్న ఉపేంద్ర టైటిల్స్ దగ్గర నుంచి క్లైమాక్స్ దాకా ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు వస్తుంటాయాని, వాటిలో డీ కోడ్ చేసుకుంటే అసలైన మజా దక్కతుందని ఊరిస్తున్నాడు. నిజానికి ప్రేక్షకుడు హాల్లోకి వచ్చాక మెదడుకి పెద్దగా పని చెప్పడు. కాలక్షేపం జరగాలని కోరుకుంటాడు. ఇచ్చిన టికెట్ డబ్బులకు న్యాయం జరిగితే చాలు. తన ఇంటెలిజెన్స్ మీద బరువు పెడితే మాత్రం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. మహేష్ బాబు 1 నేనొక్కడినేకి దర్శకుడు సుకుమార్ చేసిన పొరపాటు ఇదే. మరి ఉపేంద్ర ఎలంటి జాగ్రత్తలు తీసుకున్నారో.
2015లో ఆయన ఉప్పి 2 తీశారు. భారీ అంచనాల మధ్య ఫ్లాప్ అయ్యింది. స్క్రీన్ ప్లే అర్థం కాకపోవడం వల్లే జనం తిరస్కరించారని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. పలు ఇంటర్వ్యూలలో ఉపేంద్ర దీని గురించి వివరించే ప్రయత్నం చేశారు కానీ లాభం లేకపోయింది. అంతకన్నా టిపికల్ సబ్జెక్టుతో వస్తున్న యుఐలో చాలా షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని ఇన్ సైడ్ టాక్. కొన్ని వివాదాలకు దారి తీసే అవకాశాలు లేకపోలేదట. అవేంటో తెలియాలంటే ఇంకో నాలుగు రోజులు ఆగాల్సిందే. విజువల్స్ వీలైనంత ఎక్కువగా రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డ ఉపేంద్ర స్క్రీన్ మీద ఏమేం షాకులు ఇస్తారో.
This post was last modified on December 16, 2024 7:08 pm
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు విద్యార్థులను అనుమతిస్తున్నారు. సమావేశాలను వారు ప్రత్యక్షంగా…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…