రాజమౌళి, సుకుమార్ తర్వాత ఒక సౌత్ దర్శకుడు బాలీవుడ్ లో బలమైన జెండా పాతింది అంటే అట్లీనే. షారుఖ్ ఖాన్ కు బ్లాక్ బస్టర్లు అవసరమైన టైంలో జవాన్ రూపంలో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే సక్సెస్ ఇవ్వడం తనకే చెల్లింది. ఏకంగా సల్మాన్ ఖాన్ లాంటి స్టార్లే తనతో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారంటే ఏ స్థాయిలో బ్రాండ్ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. తన నిర్మాణంలో తేరి రీమేక్ ని హిందీలో కలీస్ దర్శకత్వంలో చేయించిన అట్లీ ఇటీవలే కపిల్ శర్మ కామెడీ షోకు హీరో హీరోయిన్లతో పాటు గెస్టుగా వెళ్ళాడు. మాములుగా కపిల్ అప్పుడప్పుడు చూపించే పైత్యం మనకు తెలిసిందే. ఇక్కడా అదే జరిగింది.
ఏ ఉద్దేశంతో అడిగాడో కానీ కపిల్ శర్మ ప్రశ్న ఇలా సాగింది. ” మీరు ఇప్పుడు పెద్ద దర్శకుడిగా మారారు, మీకు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఒక స్టార్ హీరోని కలవడానికి వెళ్ళినప్పుడు ఇంతకీ అట్లీ ఎక్కడా అని ఎవరైనా అడిగారా”. ఇది సదరు కపిల్ మాటల్లోని ఒకరకమైన వెటకారం. దాన్ని అర్థం చేసుకున్న అట్లీ హుందాగా బదులు చెప్పాడు. “నేను ఏఆర్ మురుగదాస్ కి కృతజ్ఞుడై ఉంటాను. ఎందుకంటే నా రూపం, వయసు చూడకుండా మొదటి సినిమా రాజా రాణి నిర్మించింది ఆయనే. స్క్రిప్ట్ అడిగారు తప్పించి నేనెలా ఉన్నది చూడలేదు. హృదయంతో మనుషులను జడ్జ్ చేయడమంటే అది”.
అప్పటిదాకా ఈ సంభాషణను నవ్వుతూ చూస్తున్న అందరూ ఒక్కసారిగా చప్పట్లతో అట్లీకి మద్దతు తెలిపారు. కపిల్ శర్మ కావాలనే ఈ క్వశ్చన్ అడిగినా దాన్ని హ్యాండిల్ చేసిన తీరు అట్లీ మెచ్యూరిటీని చూపిస్తుంది. బేబీ జాన్ ప్రమోషన్లలో ఎడతెరిపి లేకుండా పాల్గొంటున్న ఈ యువ దర్శకుడు సినిమాకు తాను డైరెక్టర్ కాకపోయినా ప్రొడ్యూసర్ గా అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. తేరితో పోల్చుకుంటే బేబీ జాన్ లో కొన్ని కీలకమైన మార్పులు చేశారు. ముఖ్యంగా విలన్ క్యారెక్టరైజేషన్ ని మరింత లోతుగా డిజైన్ చేశారు. డిసెంబర్ 25 విడుదల కాబోతున్న ఈ మాస్ ఎంటర్ టైనర్ కీర్తి సురేష్ కి బాలీవుడ్ డెబ్యూ.
This post was last modified on December 16, 2024 12:20 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…