ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే మూడు పాటలు రిలీజైనప్పటికీ బజ్ పరంగా వెనుకబడి ఉందనే మెగా ఫ్యాన్స్ అసంతృప్తికి అనుగుణంగా స్పీడ్ పెంచబోతున్నారు. డిసెంబర్ 21 యుఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోబోతున్న మొదటి ఇండియన్ మూవీగా నిర్మాత దిల్ రాజు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి అభిమానుల కోసం హైదరాబాద్ లో ఇదే నెల 28 ట్రైలర్ లాంచ్ జరగబోతోంది. వీటికి పునాదిగా అన్నట్టు నిన్న బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా వెళ్లడం ఆసక్తి రేపింది.
ఇందులో చరణ్ కొన్ని ముఖ్యమైన సంగతులు పంచుకున్నాడు. ఆర్ఆర్ఆర్ చివరి షెడ్యూల్ జరుగుతున్నప్పుడు దర్శకుడు శంకర్ నుంచి ఫోన్ వచ్చింది. రాజమౌళి తర్వాత ఎవరితో చేయాలనే ఆలోచనలో ఉన్న మెగా పవర్ స్టార్ కు ఒక్కసారిగా ఆనందం రెట్టింపైపోయి ఇంకేం ఆలోచించకుండా ఓకే చెప్పేశాడు. ఒకప్పటి వింటేజ్ శంకర్ పొలిటికల్ మూవీస్ లో చూసిన ఎమోషన్స్, ఎలివేషన్స్ అన్నీ ఇందులో ఉంటాయని, ఖచ్చితంగా నిరాశ పరచమని రామ్ చరణ్ గట్టి హామీ ఇవ్వడంతో ప్రాంగణం చప్పట్లతో హోరెత్తిపోయింది. సో గేమ్ ఛేంజర్ కు ఫౌండేషన్ రాజమౌళి షూటింగ్ లో పడిందన్న మాట.
ఇదింకా ప్రారంభమే కాబట్టి రాబోయే రోజుల్లో గేమ్ ఛేంజర్ కు సంబంధించి మరిన్ని విశేషాలు పంచుకోబోతున్నారు. ఇదే సమయంలో మరోచోట జరుగుతున్న ఉపేంద్ర యువి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆర్సి 16 దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ ఇప్పుడే షూటింగ్ నుంచి వస్తున్నానని, చరణ్ చితక్కొడుతున్నాడని చెప్పిన వీడియో వైరలవుతోంది. మొత్తానికి ఒకే సాయంత్రం రెండు క్రేజీ న్యూస్ తో మెగా ఫ్యాన్స్ హ్యాపీనే. ఉదయం చిరంజీవిని మధ్యాహ్నం నాగబాబుని అల్లు అర్జున్ కలిసిన కాసేపటికే గేమ్ ఛేంజర్, ఆర్సి 16 తాలూకు అప్డేట్స్ వాళ్ళను సంతోషపరిచాయి. త్వరలోనే ఇంటర్వ్యూలు ఉండబోతున్నాయి.
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…