Movie News

శంకర్ మార్క్ మాస్ చూస్తారు : రామ్ చరణ్ !

ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే మూడు పాటలు రిలీజైనప్పటికీ బజ్ పరంగా వెనుకబడి ఉందనే మెగా ఫ్యాన్స్ అసంతృప్తికి అనుగుణంగా స్పీడ్ పెంచబోతున్నారు. డిసెంబర్ 21 యుఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోబోతున్న మొదటి ఇండియన్ మూవీగా నిర్మాత దిల్ రాజు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి అభిమానుల కోసం హైదరాబాద్ లో ఇదే నెల 28 ట్రైలర్ లాంచ్ జరగబోతోంది. వీటికి పునాదిగా అన్నట్టు నిన్న బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా వెళ్లడం ఆసక్తి రేపింది.

ఇందులో చరణ్ కొన్ని ముఖ్యమైన సంగతులు పంచుకున్నాడు. ఆర్ఆర్ఆర్ చివరి షెడ్యూల్ జరుగుతున్నప్పుడు దర్శకుడు శంకర్ నుంచి ఫోన్ వచ్చింది. రాజమౌళి తర్వాత ఎవరితో చేయాలనే ఆలోచనలో ఉన్న మెగా పవర్ స్టార్ కు ఒక్కసారిగా ఆనందం రెట్టింపైపోయి ఇంకేం ఆలోచించకుండా ఓకే చెప్పేశాడు. ఒకప్పటి వింటేజ్ శంకర్ పొలిటికల్ మూవీస్ లో చూసిన ఎమోషన్స్, ఎలివేషన్స్ అన్నీ ఇందులో ఉంటాయని, ఖచ్చితంగా నిరాశ పరచమని రామ్ చరణ్ గట్టి హామీ ఇవ్వడంతో ప్రాంగణం చప్పట్లతో హోరెత్తిపోయింది. సో గేమ్ ఛేంజర్ కు ఫౌండేషన్ రాజమౌళి షూటింగ్ లో పడిందన్న మాట.

ఇదింకా ప్రారంభమే కాబట్టి రాబోయే రోజుల్లో గేమ్ ఛేంజర్ కు సంబంధించి మరిన్ని విశేషాలు పంచుకోబోతున్నారు. ఇదే సమయంలో మరోచోట జరుగుతున్న ఉపేంద్ర యువి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆర్సి 16 దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ ఇప్పుడే షూటింగ్ నుంచి వస్తున్నానని, చరణ్ చితక్కొడుతున్నాడని చెప్పిన వీడియో వైరలవుతోంది. మొత్తానికి ఒకే సాయంత్రం రెండు క్రేజీ న్యూస్ తో మెగా ఫ్యాన్స్ హ్యాపీనే. ఉదయం చిరంజీవిని మధ్యాహ్నం నాగబాబుని అల్లు అర్జున్ కలిసిన కాసేపటికే గేమ్ ఛేంజర్, ఆర్సి 16 తాలూకు అప్డేట్స్ వాళ్ళను సంతోషపరిచాయి. త్వరలోనే ఇంటర్వ్యూలు ఉండబోతున్నాయి.

This post was last modified on December 16, 2024 11:30 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

36 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

1 hour ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago