ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే మూడు పాటలు రిలీజైనప్పటికీ బజ్ పరంగా వెనుకబడి ఉందనే మెగా ఫ్యాన్స్ అసంతృప్తికి అనుగుణంగా స్పీడ్ పెంచబోతున్నారు. డిసెంబర్ 21 యుఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోబోతున్న మొదటి ఇండియన్ మూవీగా నిర్మాత దిల్ రాజు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి అభిమానుల కోసం హైదరాబాద్ లో ఇదే నెల 28 ట్రైలర్ లాంచ్ జరగబోతోంది. వీటికి పునాదిగా అన్నట్టు నిన్న బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా వెళ్లడం ఆసక్తి రేపింది.
ఇందులో చరణ్ కొన్ని ముఖ్యమైన సంగతులు పంచుకున్నాడు. ఆర్ఆర్ఆర్ చివరి షెడ్యూల్ జరుగుతున్నప్పుడు దర్శకుడు శంకర్ నుంచి ఫోన్ వచ్చింది. రాజమౌళి తర్వాత ఎవరితో చేయాలనే ఆలోచనలో ఉన్న మెగా పవర్ స్టార్ కు ఒక్కసారిగా ఆనందం రెట్టింపైపోయి ఇంకేం ఆలోచించకుండా ఓకే చెప్పేశాడు. ఒకప్పటి వింటేజ్ శంకర్ పొలిటికల్ మూవీస్ లో చూసిన ఎమోషన్స్, ఎలివేషన్స్ అన్నీ ఇందులో ఉంటాయని, ఖచ్చితంగా నిరాశ పరచమని రామ్ చరణ్ గట్టి హామీ ఇవ్వడంతో ప్రాంగణం చప్పట్లతో హోరెత్తిపోయింది. సో గేమ్ ఛేంజర్ కు ఫౌండేషన్ రాజమౌళి షూటింగ్ లో పడిందన్న మాట.
ఇదింకా ప్రారంభమే కాబట్టి రాబోయే రోజుల్లో గేమ్ ఛేంజర్ కు సంబంధించి మరిన్ని విశేషాలు పంచుకోబోతున్నారు. ఇదే సమయంలో మరోచోట జరుగుతున్న ఉపేంద్ర యువి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆర్సి 16 దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ ఇప్పుడే షూటింగ్ నుంచి వస్తున్నానని, చరణ్ చితక్కొడుతున్నాడని చెప్పిన వీడియో వైరలవుతోంది. మొత్తానికి ఒకే సాయంత్రం రెండు క్రేజీ న్యూస్ తో మెగా ఫ్యాన్స్ హ్యాపీనే. ఉదయం చిరంజీవిని మధ్యాహ్నం నాగబాబుని అల్లు అర్జున్ కలిసిన కాసేపటికే గేమ్ ఛేంజర్, ఆర్సి 16 తాలూకు అప్డేట్స్ వాళ్ళను సంతోషపరిచాయి. త్వరలోనే ఇంటర్వ్యూలు ఉండబోతున్నాయి.
This post was last modified on December 16, 2024 11:30 am
రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం…
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…
వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…
గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…
కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…
2027 సంక్రాంతి పందెం క్రమంగా వేడెక్కుతోంది. శర్వానంద్ - శ్రీను వైట్ల కాంబో ' జార్జ్ క్రిష్' జనవరి 14…