సంధ్య థియేటర్ దుర్ఘటనకు సంబంధించి కోర్టు కేసు ఎదురుకుని బెయిల్ మీద బయటికి వచ్చిన అల్లు అర్జున్ నిన్నంతా తన ఇంట్లోనే టాలీవుడ్ సెలబ్రిటీల రాకతో యమా బిజీగా గడిపేశాడు. ఉదయం నుంచి మొదలుకుని రాత్రి పొద్దుపోయే దాకా సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా వందలాది ఆర్టిస్టులు, దర్శకులు, నిర్మాతలు క్యూ కట్టడంతో వాళ్ళను రిసీవ్ చేసుకోవడం, మాట్లాడ్డంతోనే సమయం గడిచిపోయింది. అయితే అభిమానులు ఎదురు చూసిన ప్రత్యేక కలయికలు వేరే ఉన్నాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవిది ఒకటి. అది ఇవాళ జరిగింది. ఫ్యాన్స్ కోరుకున్న క్షణం కళ్లెదురు వచ్చేసింది.
మధ్యాన్నం 12 గంటలకు కుటుంబంతో పాటు స్వయంగా కారు నడుపుకుంటూ చిరంజీవి ఇంటికి వెళ్లిన బన్నీకి సాదర స్వాగతం లభించింది. మొన్న అరెస్ట్ విషయం తెలియగానే విశ్వంభర షూటింగ్ అప్పటికప్పుడు రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి తొలుత వెళ్ళింది మెగాస్టారే. నిన్న సతీమణి, బన్నీ మేనత్త సురేఖ వచ్చి వెళ్లడం, అల్లుడిని చూసి ఎమోషన్ కావడం సోషల్ మీడియాలో వైరలయ్యింది. అప్పటి నుంచి మెగా అల్లు కాంబో కోసం అందరూ వెయిట్ చేశారు. సుమారు గంటకు పైగా అక్కడ ఉన్న అల్లు అర్జున్ తర్వాత వెళ్లిపోయారు. భార్య స్నేహ, పిల్లలు కూడా తనతోనే ఉన్నారు.
గత కొన్ని నెలలుగా మెగా వర్సెస్ అల్లుగా మారిపోయిన ఫ్యాన్స్ ఆన్ లైన్ యుద్ధం ఇప్పుడీ ములాఖత్ తో తగ్గే అవకాశాలు లేకపోలేదు. నంద్యాల పర్యటన నుంచి బన్నీ మీద మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. దీన్ని తేలికపరిచే సందర్భం తర్వాత ఎప్పుడూ రాలేదు. పుష్ప 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న టైంలో స్పీడ్ బ్రేకర్ లా వచ్చి పడ్డ సంధ్య ఉదంతం నుంచి ఇంకా పూర్తి రిలీఫ్ దక్కలేదు. ప్రస్తుతం దొరికింది నాలుగు వారాల బెయిలే కాబట్టి తీర్పు లేదా పరిష్కారం దొరికే దాకా చిక్కులు తప్పవు. ఈ కారణంగానే ప్లాన్ చేసుకున్న మరికొన్ని సక్సెస్ మీట్లు వాయిదా వేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్.
This post was last modified on December 15, 2024 2:17 pm
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఇద్దరూ నాలుగు దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్నారు. కానీ ఇన్నేళ్లలో ఎప్పుడూ కలిసి సినిమా చేసింది…
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుకోకుండా జరిగిన చిన్న ప్రమాదం వల్ల గ్యాప్ తీసుకున్న నవీన్ పోలిశెట్టి ఈసారి…
రెగ్యులర్ గా ప్రమోషనల్ కంటెంట్ వస్తున్నా మన శంకరవరప్రసాద్ గారు నుంచి ఇంకేదో మిస్సవుతుందనే ఫీలింగ్ లో ఉన్న అభిమానులకు…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ జిఓ త్వరగా వచ్చేయడంతో 1000 రూపాయల ఫ్లాట్ రేట్…
సినిమాల ప్రమోషన్స్ అంటే ఒకప్పుడు యాంకర్లతో ప్రశ్నలు అడిగించడం లేదా స్టేజ్ మీద హడావిడి చేయడం మాత్రమే ఉండేవి. కానీ…
సభకు రాలేదు.. కానీ సంతకాలు మాత్రం ఉన్నాయి.. అదెలా..? ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల తీరు ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.…