గత ఏడాది ఏప్రిల్ లో ఏజెంట్ రిలీజయ్యాక సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న అఖిల్ అభిమానులకు తెరిపినిచ్చాడు. ఇవాళ కొత్త సినిమా షూటింగ్ హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమయ్యింది. కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణుకథతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు మురళికిషోర్ అబ్బూరు చెప్పిన కథ నచ్చడంతో నాగార్జున మనం బ్యానర్ తో పాటు సితార ఎంటర్ టైన్మెంట్స్ దీన్ని పెద్ద బడ్జెట్ తో నిర్మించనుంది. శ్రీలీల హీరోయిన్ గా నటించే ఈ తిరుపతి బ్యాక్ డ్రాప్ స్టోరీకి తమన్ సంగీతం సమకూర్చబోతున్నాడు. రెండు ఊళ్ళ మధ్య జరిగే ఇంటెన్స్ విలేజ్ డ్రామాగా కథ బాగా వచ్చిందని ఇన్ సైడ్ టాక్.
నిజానికి అఖిల్ దీని కన్నా ముందు యువి క్రియేషన్స్ తో చేయాల్సింది. అనిల్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్యాన్ ఇండియా స్థాయిలో స్క్రిప్ట్ లాక్ చేశారు. కానీ వివిధ కారణాల వల్ల దాన్ని పెండింగ్ లో ఉంచి తర్వాత అనుకున్న దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్న అఖిల్ ఇకపై వేగం పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాగార్జున సైతం దగ్గరుండి ఈ ప్రాజెక్టు తాలూకు పనులు పర్యవేక్షిస్తారని సమాచారం. ఎలాగూ నిర్మాత నాగవంశీ ప్రొడక్షన్ కాబట్టి మరీ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా టార్గెట్ పెట్టుకుని షెడ్యూల్స్ వేయబోతున్నారు.
గుంటూరు కారం తర్వాత పరీక్షల కోసం బ్రేక్ తీసుకున్న శ్రీలీల మళ్ళీ బిజీ అయిపోయింది. రాబిన్ హుడ్ వచ్చే నెల రిలీజ్ కానుండగా రవితేజ మాస్ జాతర మే 9న థియేటర్లలో అడుగు పెడుతుంది. ఇప్పుడు అఖిల్ సరసన ఛాన్స్ కొట్టేసింది. ఇటీవలే పుష్ప 2లో కిసిక్ కిసిక్ అంటూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం చాలా ప్లస్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తిరిగి మొదలైతే అందులోనూ జాయినవ్వాల్సి ఉంటుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు బ్రేక్ వేస్తూ ఎట్టకేలకు అఖిల్ కొత్త సినిమా మొదలైపోవడం శుభవార్తే. అందని ద్రాక్ష పండుగా మారిన బ్లాక్ బస్టర్ దీంతో అయినా నెరవేరాలి.
This post was last modified on December 15, 2024 1:12 pm
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…