గత ఏడాది ఏప్రిల్ లో ఏజెంట్ రిలీజయ్యాక సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న అఖిల్ అభిమానులకు తెరిపినిచ్చాడు. ఇవాళ కొత్త సినిమా షూటింగ్ హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమయ్యింది. కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణుకథతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు మురళికిషోర్ అబ్బూరు చెప్పిన కథ నచ్చడంతో నాగార్జున మనం బ్యానర్ తో పాటు సితార ఎంటర్ టైన్మెంట్స్ దీన్ని పెద్ద బడ్జెట్ తో నిర్మించనుంది. శ్రీలీల హీరోయిన్ గా నటించే ఈ తిరుపతి బ్యాక్ డ్రాప్ స్టోరీకి తమన్ సంగీతం సమకూర్చబోతున్నాడు. రెండు ఊళ్ళ మధ్య జరిగే ఇంటెన్స్ విలేజ్ డ్రామాగా కథ బాగా వచ్చిందని ఇన్ సైడ్ టాక్.
నిజానికి అఖిల్ దీని కన్నా ముందు యువి క్రియేషన్స్ తో చేయాల్సింది. అనిల్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్యాన్ ఇండియా స్థాయిలో స్క్రిప్ట్ లాక్ చేశారు. కానీ వివిధ కారణాల వల్ల దాన్ని పెండింగ్ లో ఉంచి తర్వాత అనుకున్న దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్న అఖిల్ ఇకపై వేగం పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాగార్జున సైతం దగ్గరుండి ఈ ప్రాజెక్టు తాలూకు పనులు పర్యవేక్షిస్తారని సమాచారం. ఎలాగూ నిర్మాత నాగవంశీ ప్రొడక్షన్ కాబట్టి మరీ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా టార్గెట్ పెట్టుకుని షెడ్యూల్స్ వేయబోతున్నారు.
గుంటూరు కారం తర్వాత పరీక్షల కోసం బ్రేక్ తీసుకున్న శ్రీలీల మళ్ళీ బిజీ అయిపోయింది. రాబిన్ హుడ్ వచ్చే నెల రిలీజ్ కానుండగా రవితేజ మాస్ జాతర మే 9న థియేటర్లలో అడుగు పెడుతుంది. ఇప్పుడు అఖిల్ సరసన ఛాన్స్ కొట్టేసింది. ఇటీవలే పుష్ప 2లో కిసిక్ కిసిక్ అంటూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం చాలా ప్లస్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తిరిగి మొదలైతే అందులోనూ జాయినవ్వాల్సి ఉంటుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు బ్రేక్ వేస్తూ ఎట్టకేలకు అఖిల్ కొత్త సినిమా మొదలైపోవడం శుభవార్తే. అందని ద్రాక్ష పండుగా మారిన బ్లాక్ బస్టర్ దీంతో అయినా నెరవేరాలి.
This post was last modified on December 15, 2024 1:12 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…