బాక్సాఫీస్ వద్ద పన్నెండు వందల కోట్ల గ్రాస్ దాటేసి రెండో వారంలోనూ స్ట్రాంగ్ గా ఉన్న పుష్ప 2 ది రూల్ అభిమానులకు శుభవార్త వచ్చేసింది. 3D వెర్షన్ ని ఇవాళ్టి నుంచి స్క్రీనింగ్ చేయబోతున్నారు. తొలుత హైదరాబాద్ లోని కొన్ని థియేటర్లతో మొదలుపెట్టి తర్వాత దేశమంతా షోలు పెంచబోతున్నారు. ఈ మేరకు మైత్రి నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. మాములుగా కమర్షియల్ మాస్ సినిమాలకు త్రిడి అవసరం ఉండదు. ఎందుకంటే స్పెషల్ ఎఫెక్ట్స్ తక్కువ కాబట్టి. కల్కి 2898 ఏడి, ఆర్ఆర్ఆర్, దేవర లాంటివి పర్వాలేదనిపించాయి కానీ ఎక్స్ ట్రాడినరి అనుభూతిని కలిగించలేదు. కానీ పుష్ప 2 అలా ఉండదట.
ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఎఫెక్ట్స్ అబ్బురపరిచేలా ఉంటాయని ముఖ్యంగా ఫైట్లు, యాక్షన్ ఎపిసోడ్లు, జాతర, క్లైమాక్స్ లాంటి చోట బాగా ఆస్వాదించవచ్చని యూనిట్ టాక్. ఇప్పుడీ అంశం వసూళ్ల పరంగా ప్లస్ అయ్యేలా ఉంది. ఎందుకంటే థియేటర్లో రెండు మూడు సార్లు ఎక్స్ పీరియన్స్ అయినవాళ్లు మరోసారి 3డిలో చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎలాగూ మూడో వారం నుంచి సాధారణ టికెట్ రేట్లు అందుబాటులోకి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వసూళ్ల పెంపు చూడొచ్చు. ఆల్రెడీ బుక్ మై షోలో రెండో శనివారం మిలియన్ టికెట్లు అమ్మిన మరో రికార్డు సొంతం చేసుకున్న పుష్ప 2 మూడో వారాంతాన్ని కూడా కంట్రోల్ లో తీసుకుంటాడు.
హిందీలో పుష్ప 2ని ఇంకా ఎక్కువ ఆదరిస్తున్న తరుణంలో షోలను విపరీతంగా పెంచే అవకాశం ఉంది. ఇవాళ తెల్లవారుఝామున గుజరాత్, మహారాష్ట్ర లాంటి చోట్ల అర్ధరాత్రి షోలు అప్పటికప్పుడు యాడ్ చేసినా త్వరగా హౌస్ ఫుల్ అయ్యాయి. ఒక సౌత్ డబ్బింగ్ మూవీ ఈ స్థాయిలో ర్యాంపేజ్ చేయడం చూడలేదని బయ్యర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1500 కోట్ల మార్కు కూడా త్వరగా చేరుకునే అవకాశముంది. క్రిస్మస్ కి పెద్ద ఎత్తున రిలీజులు ఉన్నాయి కాబట్టి పుష్ప 2కి రాబోయే నాలుగు రోజులు కీలకం కాబోతున్నాయి. వీలైనంత రెవిన్యూ రాబట్టుకోవాలి. ఆ తర్వాత స్క్రీన్ కౌంట్ చెప్పుకోదగ్గ స్థాయిలోనే తగ్గనుంది.
This post was last modified on December 15, 2024 1:53 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…