ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ షూటింగ్ క్రమంగా చివరి దశకు చేరుకుంటోంది. ఏ స్టేజిలో ఉందనే సమాచారం టీమ్ ఇవ్వడం లేదు కానీ ఏప్రిల్ 10 విడుదల మీద క్రమంగా అనుమానాలు ముసురుకుంటున్నాయి. అప్పటికంతా ఫస్ట్ కాపీ అవ్వకపోవచ్చని, వాయిదా దాదాపు ఖరారేననే ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ ఇదే కనక జరిగితే ఆ స్థానంలో చిరంజీవి విశ్వంభర వచ్చే అవకాశాలను రెండు వారాల క్రితమే మా సైట్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా స్పెషల్ సాంగ్ కోసం ది రాజా సాబ్ కోసం ఒక అరుదైన కలయిక పద్దెనిమిదేళ్ల తర్వాత జరగనుందని సమాచారం.
2007లో ప్రభాస్, నయనతార జంటగా యోగి చేశారు. వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ బ్లాక్ బస్టర్ రీమేక్ ఆశించిన ఫలితం అందుకోనప్పటికీ పాటలు బాగా రీచ్ అయ్యాయి. కెరీర్ ప్రారంభంలో ఉన్న నయన్ ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంది. తర్వాత ఈ కాంబో మళ్ళీ సాధ్యం కాలేదు. ఇప్పుడు ది రాజా సాబ్ కోసం కలవడమంటే విశేషమే. అయితే ఇదింకా అధికారిక ధృవీకరణ కాలేదు. నిజానికి నయన్ చాలా ఏళ్లుగా స్పెషల్ సాంగ్స్ చేయడం లేదు. లేడీ సూపర్ స్టార్ బ్రాండ్ వచ్చాక కేవలం ఫుల్ లెన్త్ రోల్స్ మాత్రమే ఒప్పుకుంటోంది. మరి ప్రభాస్ కు వెసులుబాటు ఇచ్చిందా అంటే వేచి చూడాలి.
ఒకవేళ ఎస్ అయితే మాత్రం ఇదో స్పెషల్ న్యూసే అవుతుంది. తమిళంలో పెద్ద హీరోలకే అంత త్వరగా ఎస్ చెప్పని నయనతార ఇప్పుడు ది రాజా సాబ్ లో కనిపిస్తే బజ్ పరంగానూ ఉపయోగపడుతుంది. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ హారర్ డ్రామా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటిదాకా టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ స్క్రీన్ మీద ఎప్పుడూ చూడనంత గ్రాండియర్ గా ఉంటుందని నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ ని పెంచింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించిన ది రాజా సాబ్ బడ్జెట్ మూడు వందల కోట్ల పైమాటే.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…