ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ను టాలీవుడ్ కు చెందిన పలువురు అగ్రహీరోలు, నిర్మాతలు, దర్శకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. అల్లు అర్జున్ కు చంద్రబాబు ధైర్యం చెప్పారు.
నిన్న అల్లు అరవింద్ కు కూడా చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించిన సంగతి తెలిసిందే. సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు ఆరా తీశారని తెలుస్తోంది. కేసు వివరాల గురించి కూడా అల్లు అర్జున్, అల్లు అరవింద్ లను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారనీ వార్తలు వచ్చాయి కానీ అందులో నిజమెంతో తేలలేదు.
మరోవైపు, అల్లు అర్జున్ ను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం స్వయంగా అల్లు అర్జున్ నివాసానికి వచ్చిన గంటా..అల్లు అర్జున్ తో మాట్లాడి సంఘీభావం ప్రకటించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ను మాజీ మంత్రి, వైసీపీ మాజీ నేత అవంతి శ్రీనివాస్ కూడా కలిసి పరామర్శించారు.
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…