ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ను టాలీవుడ్ కు చెందిన పలువురు అగ్రహీరోలు, నిర్మాతలు, దర్శకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. అల్లు అర్జున్ కు చంద్రబాబు ధైర్యం చెప్పారు.
నిన్న అల్లు అరవింద్ కు కూడా చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించిన సంగతి తెలిసిందే. సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు ఆరా తీశారని తెలుస్తోంది. కేసు వివరాల గురించి కూడా అల్లు అర్జున్, అల్లు అరవింద్ లను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారనీ వార్తలు వచ్చాయి కానీ అందులో నిజమెంతో తేలలేదు.
మరోవైపు, అల్లు అర్జున్ ను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం స్వయంగా అల్లు అర్జున్ నివాసానికి వచ్చిన గంటా..అల్లు అర్జున్ తో మాట్లాడి సంఘీభావం ప్రకటించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ను మాజీ మంత్రి, వైసీపీ మాజీ నేత అవంతి శ్రీనివాస్ కూడా కలిసి పరామర్శించారు.
This post was last modified on December 15, 2024 5:47 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…