మూడు నెలల క్రితం హైదరాబాద్ లో జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేసినప్పుడు అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి చెలరేగింది. నిజానికి రభస టైంలో ఒక అభిమాని రద్దీలో చనిపోవడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ అప్పటి నుంచి ఓపెన్ గ్రౌండ్స్ వేడుకలకు దూరంగా ఉంటున్నాడు. తాను నటించని బయటివాటికి గెస్టుగా వెళ్ళాడు తప్పించి హీరోగా చేసిన సినిమాలకు మాత్రం నో అవుట్ డోర్ సూత్రం పాటించాడు. అందులో భాగంగానే నోవాటెల్ లో క్యాన్సిలయ్యింది బయట వేరే ఊరిలో ఎక్కడైనా పెట్టమని ఫ్యాన్స్ ఎంత ఒత్తిడి చేసినా ససేమిరా ఒప్పుకోలేదు. కొందరైతే ట్విట్టర్ లో కళ్యాణ్ రామ్ ని నిందించారు.
కట్ చేస్తే తోపులాట తాలూకు పరిణామాల్లో ఏ చిన్న దుర్ఘటన జరిగినా వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో పుష్ప 2 నిరూపించింది. ఫ్యాన్స్ ఉత్సాహాన్ని ప్రత్యక్షంగా చూడాలని తీసుకున్న నిర్ణయం జైలు మెట్లు ఎక్కిస్తుందని బన్నీ కల్లో కూడా ఊహించి ఉండడు. కానీ దురదృష్టవశాత్తు జరిగింది. దేవరకొచ్చిన జనసందోహాన్ని చూశాక ఒకవేళ అలాగే ఇరుగ్గా ఈవెంట్ చేసి ఉంటే ఏదైనా జరగొచ్చనే భయమే తారక్ ని కఠిన నిర్ణయం తీసుకునేలా చేసింది. ఆ తర్వాత పుష్ప 2 అంతకన్నా పెద్ద ఈవెంట్లు చేసింది కానీ ఒక్క శాతం రిస్క్ కూడా వద్దనుకునే జూనియర్ ఎన్టీఆర్ ఆలోచన ఇకపై మారబోదని చెప్పొచ్చు.
థియేటర్లకు లైవ్ గా వెళ్లి అందరికి తెలిసేలా సినిమాలు చూసేందుకు కూడా తారక్ వ్యతిరేకం. ఆర్ఆర్ఆర్ ఇంటర్వ్యూలో స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఇప్పటిదాకా ఏదీ చూడలేదని రాజమౌళితో చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా జరిగిన పరిణామాల వల్ల మొత్తం టాలీవుడ్ ఈవెంట్లన్నీ ఆగిపోతాయని కాదు కానీ భవిష్యత్తులో పోలీసులు, నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్న తారక్ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సెట్స్ లో జాయినవుతాడు. దేవర 2 ఎప్పటి నుంచి ఉంటుందనే సంకేతం మాత్రం ప్రస్తుతానికి ఇవ్వడం లేదు. అది చెప్పాల్సింది కొరటాల శివనే.
This post was last modified on December 14, 2024 11:18 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…