పుష్ప 2 బెనిఫిట్ షోకి జరిగిన రాద్ధాంతం వల్ల అల్లు అర్జున్ ఏకంగా అరెస్ట్ దాకా వెళ్లడం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక మహిళ చనిపోవడం బాధాకరమే అయినా దానికి బన్నీని బాధ్యుణ్ణి చేయడం ఎవరూ హర్షించడం లేదు. ఈ నేపథ్యంలో రాబోయే ప్యాన్ ఇండియా మూవీస్ కి స్పెషల్ ప్రీమియర్లు ఉంటాయా లేదానే అనుమానాలు ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఈ లిస్టులో ముందు వచ్చేది గేమ్ ఛేంజర్. జనవరి 10 విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పక్కాగా జరుగుతున్నాయి. డిసెంబర్ 21న యుఎస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్లు పెంచబోతున్నారు.
ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్లు ఒక రోజు ముందు అంటే జనవరి 9నే ఉంటాయని అఫీషియల్ హ్యాండిల్ లో ప్రకటించడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. మాములుగా యుఎస్ షెడ్యూల్ ప్రకారమైతే ఏ సినిమాకైనా మనకన్నా డేట్ ఒక రోజు ముందు వస్తుంది. కానీ పోస్టర్ లో వరల్డ్ వైడ్ అన్నారు కాబట్టి అన్నిచోట్లా అనే అర్థం వస్తుంది. మరి ప్రభుత్వాలు అనుమతులు ఇస్తాయా అంటే సాంకేతికంగా ఛాన్స్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ముందు రోజు రాత్రి వేసే సెకండ్ షోను రెగ్యులర్ షోగా చూపించుకుంటే గవర్నమెంట్ నుంచి అభ్యంతరం ఉండదు. అలా కాకుండా అర్ధరాత్రి షో అయితే పర్మిషన్ తెచ్చుకోవాలి.
నిర్మాత దిల్ రాజు ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో చూడాలి. గేమ్ ఛేంజర్ కున్న డిమాండ్ ని బట్టి చూస్తే ప్రీమియర్లు వేయడం మంచి ఆలోచనే. కాకపోతే సంధ్య 70 ఎంఎం ఉదంతం తర్వాత తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉంది. పోలీస్ శాఖ సైతం అంత ఈజీగా పర్మిషన్లు, సెక్యూరిటీ ఇచ్చేలా లేదు. అసలే సంక్రాంతి సీజన్. వరస సెలవులు. ముందుగా రిలీజయ్యే అడ్వాంటేజ్. ఇవన్నీ వాడుకోవాలంటే గేమ్ ఛేంజర్ కు ప్రత్యేక వెసులుబాట్లు దక్కాలి. ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. టికెట్ ధరల పెంపుకు సంబంధించిన ప్రొసీజర్ కూడా యుఎస్ నుంచి రాగానే మొదలుపెడతారు.
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…