రియల్ సీన్: జైల్లో పుష్ప ఎలా ఉన్నారు? ఏం చేశారు?తొక్కిసలాట కేసులో జైలుకు వెళ్లిన పుష్ప అలియాస్ అల్లు అర్జున్ ఒక రోజు జైలు జీవితాన్ని చూడాల్సి వచ్చింది. శుక్రవారం సాయంత్రం సుమారు 5-6 గంటల మధ్యలో జైలుకు వెళ్లిన ఆయన శనివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో విడుదల కావటం తెలిసిందే. నాంపల్లి కోర్టులో పద్నాలుగురోజులు రిమాండ్ విధించిన తర్వాత బన్నీ తరఫు లాయర్లు హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ ఉత్తర్వును తెచ్చుకోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రే ఆయన జైలు నుంచి బయటకు వస్తారని భావించినా.. సాంకేతిక అంశాలతో జైలు నుంచి విడుదల కాని పరిస్థితి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. జైల్లో ఉన్న పుష్ప ఎలా ఉన్నారు? ఏం చేశారు? ఆయన తీరు ఎలా ఉంది? అన్న అంశంపై ప్రత్యేకంగా ఫోకస్ చేయగా.. ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. అండర్ ట్రయల్ ఖైదీగా అల్లుఅర్జున్ కు యూటీ నెంబరు 7697ను కేటాయించారు. సెలబ్రిటీ కావటం.. వీవీఐపీ కావటంతో జైల్లో మంజీరా బ్లాక్ లో ఆయనకు గదిని కేటాయించినా.. ఆయన్ను ఒక్కరే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మిగిలిన ఖైదీలతో కలిసి ఉంచకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇక.. జైల్లో సాయంత్రం ఆరు గంటలకే డిన్నర్ ఇస్తారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కు డిన్నర్ ఆఫర్ చేయగా.. ఆయన నిరాకరించినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కొన్ని పండ్లు మాత్రమే తిన్నట్లు చెబుతున్నారు. జైల్లో ఒంటరిగా ఉన్న అల్లు అర్జున్ మౌనంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక.. అల్లు అర్జున్ బ్యారక్ లోకి తీసుకెళ్లే సమయానికే చంచలగూడ జైల్లోని ఖైదీలను వారి బ్యారక్ లోకి తీసుకెళ్లిపోయినట్లుగా సమాచారం.
మొత్తంగా జైల్లో ఉన్న కొన్ని గంటలు బన్నీ మౌనంగా.. గంభీరంగా ఉన్నట్లుగా జైలు వర్గాలు చెబుతున్నాయి. జైలు నుంచి విడుదలయ్యే సమయంలో జైలు అధికారులకు థ్యాంక్స్ చెప్పిన ఆయన తన కారులో వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు.
This post was last modified on December 14, 2024 9:02 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…