‘పుష్ప-2’ విడుదల సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన ఘటన సంచలనం రేపింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదు కాగా..ఈ రోజు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
“చట్టం తనపని తాను చేసుకుపోతుందని” రేవంత్ చెప్పారు. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో తన జోక్యం ఏమీ ఉండదని ఆయన అన్నారు. చట్టం ముందు అంతా సమానమే అని రేవంత్ వ్యాఖ్యానించారు. మరోవైపు, అల్లు అర్జున్ కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగిశాయి. ఆయనను నాంపల్లి కోర్టుకు భారీ భద్రత మధ్య పోలీసులు తరలిస్తున్నారు.
మరోవైపు, అల్లు అర్జున్ అరెస్టుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. జాతీయ అవార్డు అందుకున్న స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ను కేటీఆర్ ఖండించారు పాలకుల అభద్రతాభావానికి పరాకాష్ట ఈ అరెస్ట్ అని కేటీఆర్ విమర్శించారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనకు అల్లు అర్జున్ బాధ్యుడు కాడని, అయినప్పటికీ అతడిని సాధారణ నేరస్థుడిగా ట్రీట్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నానని అన్నారు. ఇక, హైడ్రా కూల్చివేతల వల్ల రేవంత్ రెడ్డి కూడా ఇద్దరి చావుకు బాధ్యుడని, అదే లాజిక్తో ఆయనను అరెస్ట్ ఎందుకు చేయరని కేటీఆర్ ప్రశ్నించారు.
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…