ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టయితే.. బెయిల్ దక్కుతుందా? అనే చర్చ జరుగుతోంది. ఈ నెల 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంధ్య థియేటర్కు అల్లు వచ్చారు. అయితే.. ఆ సమయంలో ఆయన రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున మూగారు.ఇది తోపులాటకు దారి తీసింది. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో సంథ్య ధియేటర్ సహా.. అనేక మందిపై కేసులు నమోదయ్యాయి.
సంధ్య ధియేటర్ యాజమాన్యం తమకు సంబంధం లేదని.. డిస్ట్రిబ్యూటర్లకు తాము ఆ రోజు షోలకు సంబంధించి సినిమా హాలును అద్దెకు ఇచ్చామని చెప్పి కోర్టులో పిటిషన్ వేసి.. కేసు కొట్టివేయాలని అభ్యర్థించింది. దీనిపై విచారణ పెండింగులో ఉంది. ఇదిలావుంటే.. తాజాగా పోలీసులు తొక్కిసలాటకు.. కారణం చెప్పాపెట్టకుండా.. అల్లు అర్జున్ ధియేటర్ వద్దకు రావడమేనని పేర్కొంటూ.. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి స్టేషన్కు తీసుకువచ్చారు.
వాస్తవానికి శుక్రవారం అల్లు నుంచి పోలీసులు స్టేట్మెంటును రికార్డు చేసుకుంటారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే.. ఆయనను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి.. అటు నుంచి ఉస్మానియాకు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించడం గమనార్హం. ఒకవేళ బన్నీ అరెస్టు చేస్తే.. ఆయనను వెంటనే రిమాండ్కు పంపాల్సి ఉంటుంది కానీ, వరుస కోర్టు సెలవుల కారణంగా.. అల్లుకు బెయిల్ వచ్చే అవకాశం లేనందున అల్లు అభ్యర్థన మేరకు పోలీసులు మరో రోజు అరెస్టు చేయొచ్చని ఆయన అభిమానులు భావించారు.
ఇదిలావుంటే.. అల్లు అర్జున్పై బీఎన్ ఎస్ సెక్షన్లు.. 105, 118 (1),రెడ్ విత్ 3/5 కింద కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. వీటి ప్రకారం అర్జున్ పై నేర నిరూపణ అయితే.. జైలుకు పంపించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి,. మరోవైపు శుక్రవారమే ఆయనపై విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేస్తే బెయిల్ వస్తుందా? లేదా? అనేది చూడాలి. ఎందుకంటే.. శనివారం, ఆదివారం రెండు రోజులు కూడా.. కోర్టుకు సెలవులు ఉన్నాయి. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 13, 2024 2:43 pm
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…
విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…
నా అన్వేష్.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రతి ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది...! యూట్యూబర్గా అందరికీ సుపరిచితమే.…