ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టయితే.. బెయిల్ దక్కుతుందా? అనే చర్చ జరుగుతోంది. ఈ నెల 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంధ్య థియేటర్కు అల్లు వచ్చారు. అయితే.. ఆ సమయంలో ఆయన రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున మూగారు.ఇది తోపులాటకు దారి తీసింది. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో సంథ్య ధియేటర్ సహా.. అనేక మందిపై కేసులు నమోదయ్యాయి.
సంధ్య ధియేటర్ యాజమాన్యం తమకు సంబంధం లేదని.. డిస్ట్రిబ్యూటర్లకు తాము ఆ రోజు షోలకు సంబంధించి సినిమా హాలును అద్దెకు ఇచ్చామని చెప్పి కోర్టులో పిటిషన్ వేసి.. కేసు కొట్టివేయాలని అభ్యర్థించింది. దీనిపై విచారణ పెండింగులో ఉంది. ఇదిలావుంటే.. తాజాగా పోలీసులు తొక్కిసలాటకు.. కారణం చెప్పాపెట్టకుండా.. అల్లు అర్జున్ ధియేటర్ వద్దకు రావడమేనని పేర్కొంటూ.. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి స్టేషన్కు తీసుకువచ్చారు.
వాస్తవానికి శుక్రవారం అల్లు నుంచి పోలీసులు స్టేట్మెంటును రికార్డు చేసుకుంటారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే.. ఆయనను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి.. అటు నుంచి ఉస్మానియాకు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించడం గమనార్హం. ఒకవేళ బన్నీ అరెస్టు చేస్తే.. ఆయనను వెంటనే రిమాండ్కు పంపాల్సి ఉంటుంది కానీ, వరుస కోర్టు సెలవుల కారణంగా.. అల్లుకు బెయిల్ వచ్చే అవకాశం లేనందున అల్లు అభ్యర్థన మేరకు పోలీసులు మరో రోజు అరెస్టు చేయొచ్చని ఆయన అభిమానులు భావించారు.
ఇదిలావుంటే.. అల్లు అర్జున్పై బీఎన్ ఎస్ సెక్షన్లు.. 105, 118 (1),రెడ్ విత్ 3/5 కింద కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. వీటి ప్రకారం అర్జున్ పై నేర నిరూపణ అయితే.. జైలుకు పంపించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి,. మరోవైపు శుక్రవారమే ఆయనపై విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేస్తే బెయిల్ వస్తుందా? లేదా? అనేది చూడాలి. ఎందుకంటే.. శనివారం, ఆదివారం రెండు రోజులు కూడా.. కోర్టుకు సెలవులు ఉన్నాయి. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 13, 2024 2:43 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…