ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టయితే.. బెయిల్ దక్కుతుందా? అనే చర్చ జరుగుతోంది. ఈ నెల 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంధ్య థియేటర్కు అల్లు వచ్చారు. అయితే.. ఆ సమయంలో ఆయన రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున మూగారు.ఇది తోపులాటకు దారి తీసింది. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో సంథ్య ధియేటర్ సహా.. అనేక మందిపై కేసులు నమోదయ్యాయి.
సంధ్య ధియేటర్ యాజమాన్యం తమకు సంబంధం లేదని.. డిస్ట్రిబ్యూటర్లకు తాము ఆ రోజు షోలకు సంబంధించి సినిమా హాలును అద్దెకు ఇచ్చామని చెప్పి కోర్టులో పిటిషన్ వేసి.. కేసు కొట్టివేయాలని అభ్యర్థించింది. దీనిపై విచారణ పెండింగులో ఉంది. ఇదిలావుంటే.. తాజాగా పోలీసులు తొక్కిసలాటకు.. కారణం చెప్పాపెట్టకుండా.. అల్లు అర్జున్ ధియేటర్ వద్దకు రావడమేనని పేర్కొంటూ.. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి స్టేషన్కు తీసుకువచ్చారు.
వాస్తవానికి శుక్రవారం అల్లు నుంచి పోలీసులు స్టేట్మెంటును రికార్డు చేసుకుంటారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే.. ఆయనను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి.. అటు నుంచి ఉస్మానియాకు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించడం గమనార్హం. ఒకవేళ బన్నీ అరెస్టు చేస్తే.. ఆయనను వెంటనే రిమాండ్కు పంపాల్సి ఉంటుంది కానీ, వరుస కోర్టు సెలవుల కారణంగా.. అల్లుకు బెయిల్ వచ్చే అవకాశం లేనందున అల్లు అభ్యర్థన మేరకు పోలీసులు మరో రోజు అరెస్టు చేయొచ్చని ఆయన అభిమానులు భావించారు.
ఇదిలావుంటే.. అల్లు అర్జున్పై బీఎన్ ఎస్ సెక్షన్లు.. 105, 118 (1),రెడ్ విత్ 3/5 కింద కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. వీటి ప్రకారం అర్జున్ పై నేర నిరూపణ అయితే.. జైలుకు పంపించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి,. మరోవైపు శుక్రవారమే ఆయనపై విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేస్తే బెయిల్ వస్తుందా? లేదా? అనేది చూడాలి. ఎందుకంటే.. శనివారం, ఆదివారం రెండు రోజులు కూడా.. కోర్టుకు సెలవులు ఉన్నాయి. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 13, 2024 2:43 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…