పవన్ కళ్యాణ్ ఓజి కోసం అభిమానుల ఎదురు చూపులు అలనాడు ఋషుల తపస్సు కన్నా తీవ్రంగా మారిపోయాయి. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు సంబంధించిన ఏ అప్డేట్ అయినా సరే వాళ్ళను విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కు గురి చేస్తోంది. వచ్చే ఏడాది ముందు రిలీజయ్యే సినిమా హరిహర వీరమల్లు అని తెలిసినా సరే ఓజి ఉద్వేగాన్ని అణుచుకోలేకపోతున్నారు. దానికి తగ్గట్టే డివివి హ్యాండిల్ క్రమం తప్పకుండా ప్రమోషన్లలో యాక్టివ్ గా ఉండటం ప్లస్ అవుతోంది. తాజాగా ఛాయాగ్రాహకులు రవి కె చంద్రన్ తన ఇన్స్ టాలో క్రేజీ న్యూస్ ఇచ్చారు.
ఓజిలో భాగం పంచుకోనున్న ఇద్దరు కీలక నటుల గురించి ఆయన పిక్స్ పోస్ట్ చేశారు. వాటిలో మొదటి వ్యక్తి వితయ పన్స్రింగార్మ్. థాయిలాండ్ కు చెందిన ఈ ప్రసిద్ధ నటుడు ఓన్లీ గాడ్ ఫర్గివ్స్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితుడు. 65 ఏళ్ళ వయసులోనూ చలాకీగా కనిపించడం వితయ ప్రత్యేకత. ముప్పై ఏళ్ళకు పైగా మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం సాధించిన ట్రాక్ రికార్డు ఉంది. 2014లో షాంగై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. అక్టోబర్ లో రిలీజైన డోంట్ కంలో మంచి క్యారెక్టర్ పోషించాడు. ఓజిలో సుజిత్ తనకు ఏం డిజైన్ చేశాడు అన్నది సస్పెన్స్.
ఇక రెండో నటుడు కజుకి కితామురా. జపాన్ కు చెందిన ఈ యాక్షన్ స్పెషలిస్ట్ ఓజిలో నెగటివ్ షేడ్స్ లో కనిపించే ఛాన్స్ ఉంది. ఇతని వయసు 55. కిల్ బిల్, గాడ్జిల్లా ఫైనల్ వార్స్, కిల్లర్స్, ప్యారాసైట్, హెల్ డాగ్స్, లెట్స్ గో కరోకే లాంటి సినిమాల ద్వారా ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. మినజుకిలో పెర్ఫార్మన్స్ కు గాను యోకోహోమా ఫిలిం ఫెస్టివల్ లో పురస్కారం దక్కించుకున్నాడు. వీళ్లిద్దరూ ఓజిలో ఉండటం చూస్తే సుజిత్ హైప్ ని పూర్తిగా హద్దులు దాటిస్తున్నాట్టే. మరికొద్ది రోజుల్లోనే పవన్ కళ్యాణ్ ఈ షెడ్యూల్ లో చేరబోతున్నారు. 2025 ద్వితీయార్థంలో విడుదలకు డివివి సంస్థ ప్లాన్ చేసుకుంటోంది.
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…