గత నెల విడుదలైన నయనతార బయోపిక్ డాక్యుమెంటరీ ‘బియాండ్ ది ఫెయిరీ టైల్స్’కు సంబంధించి ధనుష్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ఆవిడ చేసిన కామెంట్స్ మీద పెద్ద చర్చే జరిగింది. నానుమ్ రౌడీ దాన్ నుంచి క్లిప్స్ వాడుకోవడానికి అనుమతి ఇవ్వకుండా పది కోట్లు డిమాండ్ చేశాడనే అభియోగం మీద ధనుష్ మీద నయన్ సుదీర్ఘమైన లేఖను విడుదల చేయడం చూశాం. తీరా చూస్తే సదరు ఫిలింలో బిటిఎస్ ఫుటేజ్ ని వాడుకున్న వైనం కనిపించింది. దీని మీద ధనుష్ కోర్టుకు వెళ్లాడని చెన్నై మీడియాలో వచ్చింది కానీ ఆ తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రాలేదు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో నయన్ మాట్లాడుతూ విఘ్నేష్ శివన్ రాసిన నాలుగు లైన్ల కోసం మాత్రమే నానుమ్ రౌడీ తాన్ క్లిప్స్ అడిగామని, స్నేహితుడిగా ధనుష్ వెంటనే ఎస్ చెబుతాడనుకుంటే ఇలా చేయడం షాక్ ఇచ్చిందని చెప్పుకొచ్చింది. పదేళ్ల కాలంలో అంతగా ఏం మారిపోయిందో అర్థం కాలేదని అన్నది. ఇతర స్నేహితుల ద్వారా ధనుష్ ని కలిసే ప్రయత్నం చేసినా లాభం లేకపోయిందని, అందుకే షూటింగ్ జరుగుతుండగా ఫోన్లలో షూట్ చేసిన వీడియోలు వాడుకున్నామని వివరణ ఇచ్చింది. ఇది కాంట్రాక్టులోకి రాదని తేల్చి చెప్పింది. 2022లో జరిగిన పెళ్లికి ధనుష్ ని ఎందుకు పిలవలేదనేది ఫ్యాన్స్ క్వశ్చన్.
ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో పక్కనపెడితే ఇది రిపేర్ చేయలేనంత దూరం వెళ్ళిపోయిన మాట వాస్తవం. తన కెరీర్, ప్రేమ, పెళ్లి మీద తీసిన డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో సంచలనం సృష్టిస్తుందనుకుంటే దానికి భిన్నంగా ఆశించిన స్థాయిలో స్పందన దక్కించుకోకపోవడం నయన్ కు షాక్ కలిగించింది. నిర్మాతలు లేడీ సూపర్ స్టార్ అనడం ఇబ్బందిగా ఉంటుందని చెప్పిన నయనతార మరి కమల్ హాసన్, అజిత్ లాగా పబ్లిక్ గా వద్దని ఎందుకు చెప్పడం లేదో అంతు చిక్కని ప్రశ్న. ఇప్పటికీ ఆరు తమిళ, మలయాళ సినిమాలతో చాలా బిజీగా ఉన్న నయనతార తెలుగు ఆఫర్లు మాత్రం నో అంటోంది.
This post was last modified on December 12, 2024 12:57 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…