Movie News

2025 బాలయ్య డబుల్ బొనాంజా : అఖండ 2 విడుదల

మూడు నాలుగు పదుల వయసున్న కొత్త జనరేషన్ స్టార్ హీరోలు ఏడాదికి ఒక్కటి రిలీజ్ చేసుకోవడమే మహా కష్టంగా ఉంది. ప్యాన్ ఇండియా మార్కెట్ లో పడి రెండేళ్లకు దర్శనమివ్వడమే మహాభాగ్యం అనేలా పరిస్థితులు మారిపోయాయి. అలాంటిది అయిదు దశాబ్దాల నటనానుభవం దాటిన బాలకృష్ణ సంవత్సరానికి రెండు తేవడమంటే గొప్ప విషయమే. బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న డాకు మహారాజ్ జనవరి 12 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అఖండ 2 డేట్ కూడా ప్రకటించేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న బాలయ్య విశ్వరూపం చూడొచ్చని పోస్టర్ వదిలారు.

సకాలంలో డేట్లు ఇచ్చి నిర్మాతల టార్గెట్ చేరుకోవడంలో బాలయ్య ప్లానింగ్ మంచి ఫలితాలు ఇస్తోంది. అఖండ మీదున్న అంచనాల దృష్ట్యా భారీ బడ్జెట్ తో దీన్ని రూపొందిస్తున్నారు. దర్శకుడు బోయపాటి శీను డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టడం ఖాయమని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. అంటే కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో మొత్తం పూర్తి చేసి ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నారు. ఇవాళే ప్రారంభమైన షెడ్యూల్ లో ఫైట్ తో చిత్రీకరణ మొదలుపెట్టారు. ప్రగ్య జైస్వాల్ తో పాటు మొదటి భాగంలో ఉన్న ప్రధాన తారాగణం అఖండ 2లోనూ కొనసాగబోతోంది.

మొత్తానికి బాలకృష్ణ వేగం చూస్తే యువ హీరోలు స్ఫూర్తి చెందాల్సింది చాలా ఉంది. నూరు సినిమాల ప్రయాణం పూర్తయినా నటించడం కొనసాగిస్తూనే హిందూపూర్ ఎమ్మెల్యే బాధ్యతలు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పనులతో పాటు మోక్షజ్ఞ డెబ్యూకి సంబంధించిన వర్క్స్ సైతం బాలయ్య చూసుకుంటున్నారు. ఇంకోవైపు అన్ స్టాపబుల్ సీజన్ 4ని మరింత వినోదాత్మకంగా మలచడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. అఖండ 2 మీదున్న హైప్ దృష్ట్యా ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అఖండని మించి ఉంటే మరోసారి రికార్డుల మోతే.

This post was last modified on December 11, 2024 7:25 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

14 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago