Movie News

2025 బాలయ్య డబుల్ బొనాంజా : అఖండ 2 విడుదల

మూడు నాలుగు పదుల వయసున్న కొత్త జనరేషన్ స్టార్ హీరోలు ఏడాదికి ఒక్కటి రిలీజ్ చేసుకోవడమే మహా కష్టంగా ఉంది. ప్యాన్ ఇండియా మార్కెట్ లో పడి రెండేళ్లకు దర్శనమివ్వడమే మహాభాగ్యం అనేలా పరిస్థితులు మారిపోయాయి. అలాంటిది అయిదు దశాబ్దాల నటనానుభవం దాటిన బాలకృష్ణ సంవత్సరానికి రెండు తేవడమంటే గొప్ప విషయమే. బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న డాకు మహారాజ్ జనవరి 12 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అఖండ 2 డేట్ కూడా ప్రకటించేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న బాలయ్య విశ్వరూపం చూడొచ్చని పోస్టర్ వదిలారు.

సకాలంలో డేట్లు ఇచ్చి నిర్మాతల టార్గెట్ చేరుకోవడంలో బాలయ్య ప్లానింగ్ మంచి ఫలితాలు ఇస్తోంది. అఖండ మీదున్న అంచనాల దృష్ట్యా భారీ బడ్జెట్ తో దీన్ని రూపొందిస్తున్నారు. దర్శకుడు బోయపాటి శీను డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టడం ఖాయమని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. అంటే కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో మొత్తం పూర్తి చేసి ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నారు. ఇవాళే ప్రారంభమైన షెడ్యూల్ లో ఫైట్ తో చిత్రీకరణ మొదలుపెట్టారు. ప్రగ్య జైస్వాల్ తో పాటు మొదటి భాగంలో ఉన్న ప్రధాన తారాగణం అఖండ 2లోనూ కొనసాగబోతోంది.

మొత్తానికి బాలకృష్ణ వేగం చూస్తే యువ హీరోలు స్ఫూర్తి చెందాల్సింది చాలా ఉంది. నూరు సినిమాల ప్రయాణం పూర్తయినా నటించడం కొనసాగిస్తూనే హిందూపూర్ ఎమ్మెల్యే బాధ్యతలు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పనులతో పాటు మోక్షజ్ఞ డెబ్యూకి సంబంధించిన వర్క్స్ సైతం బాలయ్య చూసుకుంటున్నారు. ఇంకోవైపు అన్ స్టాపబుల్ సీజన్ 4ని మరింత వినోదాత్మకంగా మలచడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. అఖండ 2 మీదున్న హైప్ దృష్ట్యా ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అఖండని మించి ఉంటే మరోసారి రికార్డుల మోతే.

This post was last modified on December 11, 2024 7:25 pm

Share

Recent Posts

లిక్క‌ర్ కేసు… కారుమూరితోనే క‌థ అయిపోలేదు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన 3500 కోట్ల రూపాయ‌ల లిక్క‌ర్ కుంభ‌కోణం కేసు.. అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీల‌క…

3 minutes ago

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

21 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

25 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago