మూడు నాలుగు పదుల వయసున్న కొత్త జనరేషన్ స్టార్ హీరోలు ఏడాదికి ఒక్కటి రిలీజ్ చేసుకోవడమే మహా కష్టంగా ఉంది. ప్యాన్ ఇండియా మార్కెట్ లో పడి రెండేళ్లకు దర్శనమివ్వడమే మహాభాగ్యం అనేలా పరిస్థితులు మారిపోయాయి. అలాంటిది అయిదు దశాబ్దాల నటనానుభవం దాటిన బాలకృష్ణ సంవత్సరానికి రెండు తేవడమంటే గొప్ప విషయమే. బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న డాకు మహారాజ్ జనవరి 12 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అఖండ 2 డేట్ కూడా ప్రకటించేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న బాలయ్య విశ్వరూపం చూడొచ్చని పోస్టర్ వదిలారు.
సకాలంలో డేట్లు ఇచ్చి నిర్మాతల టార్గెట్ చేరుకోవడంలో బాలయ్య ప్లానింగ్ మంచి ఫలితాలు ఇస్తోంది. అఖండ మీదున్న అంచనాల దృష్ట్యా భారీ బడ్జెట్ తో దీన్ని రూపొందిస్తున్నారు. దర్శకుడు బోయపాటి శీను డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టడం ఖాయమని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. అంటే కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో మొత్తం పూర్తి చేసి ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నారు. ఇవాళే ప్రారంభమైన షెడ్యూల్ లో ఫైట్ తో చిత్రీకరణ మొదలుపెట్టారు. ప్రగ్య జైస్వాల్ తో పాటు మొదటి భాగంలో ఉన్న ప్రధాన తారాగణం అఖండ 2లోనూ కొనసాగబోతోంది.
మొత్తానికి బాలకృష్ణ వేగం చూస్తే యువ హీరోలు స్ఫూర్తి చెందాల్సింది చాలా ఉంది. నూరు సినిమాల ప్రయాణం పూర్తయినా నటించడం కొనసాగిస్తూనే హిందూపూర్ ఎమ్మెల్యే బాధ్యతలు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పనులతో పాటు మోక్షజ్ఞ డెబ్యూకి సంబంధించిన వర్క్స్ సైతం బాలయ్య చూసుకుంటున్నారు. ఇంకోవైపు అన్ స్టాపబుల్ సీజన్ 4ని మరింత వినోదాత్మకంగా మలచడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. అఖండ 2 మీదున్న హైప్ దృష్ట్యా ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అఖండని మించి ఉంటే మరోసారి రికార్డుల మోతే.
This post was last modified on December 11, 2024 7:25 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…