బాలీవుడ్ నెక్స్ట్ బిగ్ రిలీజ్ ‘బేబీ జాన్’ ట్రైలర్ వచ్చేసింది. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ చేశారు. తమిళ హిట్ మూవీ ‘తెరి’కి రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రంలో పెద్ద మార్పులేమీ చేసినట్లు లేరు. హీరోయిజం, యాక్షన్ డోస్ ఇంకా పెంచి లౌడ్గా తీసినట్లు కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తే ఇది హిందీ సినిమాయేనా అని ఆశ్చర్యం కలిగింది. సౌత్ సినిమాల ఫ్లేవరే కనిపించింది అందులో. బాలీవుడ్ ఫార్ములా సినిమాలు చాలా వరకు బోల్తా కొడుతున్న నేపథ్యంలో దర్శకుడు కలీస్ పూర్తిగా సౌత్ స్టైల్ను అనుకరించినట్లున్నాడు.
‘తెరి’ దర్శకుడు అట్లీనే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడంతో తన హ్యాండ్ కూడా సినిమాలో పడ్డట్లే ఉంది. మామూలుగా బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా కనిపించని పంచ్ డైలాగులు.. హీరో ఎలివేషన్లు.. ఊర మాస్ ఫైట్లతోనే సినిమాను నింపేసినట్లున్నారు. ‘బేబీ జాన్’ ట్రైలర్ మాస్ ప్రేక్షకులను బాగానేే ఆకట్టుకుంటోంది. ఐతే అన్నీ బాగున్నా.. హీరోయిన్ కీర్తి సురేష్ను ట్రైలర్లో ఎలివేట్ చేయకపోవడం ఆమె ఫ్యాన్స్ను నిరాశ పరుస్తోంది.
‘బేబీ జాన్’కు హైప్ పెరగడంలో కీర్తి ఇప్పటిదాకా కీలక పాత్ర పోషించింది. కెరీర్లో ఎన్నడూ లేనంత గ్లామర్ను ఈ సినిమాలోనే ఒలకబోసింది కీర్తి. ఈ సినిమా నుంచి ఈ మధ్య రిలీజ్ చేసిన ఒక పాటలో కీర్తి క్లీవేజ్ షోలతో రెచ్చిపోయింది. పాట అంతా ఆమెనే హైలైట్ అయింది. కొన్ని రోజుల పాటు కీర్తి పేరు మార్మోగింది. ట్రైలర్లో మాత్రం ఆమె మీద ఒకట్రెండు షాట్స్ పడ్డాయంతే.
అందులోనూ ట్రెడిషనల్ లుక్లో కనిపించింది. కీర్తి కోసం సౌత్ ప్రేక్షకులు ఈ సినిమా చూసేలా.. ఆమెను ట్రైలర్లో ఎలివేట్ చేయాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం హీరో ఎలివేషన్లు.. యాక్షన్ మీదే దృష్టిపెట్టారని.. రెండో హీరోయిన్ వామికా గబ్బికి ఇచ్చిన ప్రాధాన్యం.. లీడ్ హీరోయిన్ కీర్తికి ఇవ్వకపోవడం అన్యాయమని కీర్తి ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on December 10, 2024 5:38 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…