డిసెంబర్ 21 అమెరికాలో నిర్వహించబోయే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రంగం సిద్ధమవుతోంది. యుఎస్ లో మొదటిసారి ఇలాంటి వేడుక జరుగుతుండటంతో దీని కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా అంచనాల విషయంలో కొంచెం అటుఇటు ఊగుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి బజ్ పెంచే భారం దీని మీదే ఉంది. ఇందులో భాగంగానే నాలుగో లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తారని తెలిసింది. రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, ఎస్జె సూర్య తదితర కీలక తారాగణంతో పాటు దిల్ రాజు, శంకర్ ఇలా మొత్తం టీమ్ పాల్గొనబోతోంది. అయితే ఇక్కడితో అట్రాక్షన్లు ఆగడం లేదు.
స్పెషల్ గెస్టుగా పుష్ప సృష్టికర్త సుకుమార్ వెళ్ళబోతున్నారని సమాచారం. రంగస్థలంతో ఈ కాంబో సృష్టించిన రికార్డులు అందరికీ గుర్తే. వింటేజ్ విలేజ్ జానర్ నే ఒక్క కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది ఈ బ్లాక్ బస్టరే. సుకుమార్ వెళ్లేందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి రామ్ చరణ్ 17 ఆయనదే. వచ్చే ఏడాది వేసవిలో సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. కేవలం అనౌన్స్ మెంట్ నుంచే అంచనాలు పెరిగాయి. రెండోది పుష్ప 2 విజయోత్సవాన్ని ఎన్ఆర్ఐలతో పంచుకునే సందర్భం దొరకడం. త్వరలో బన్నీ, రష్మిక మందన్న సక్సెస్ మీట్ కోసం అక్కడికి వెళ్లనున్నారనే వార్తల నేపధ్యంలో ఈ అప్డేట్ రావడం గమనార్హం.
యుఎస్ లో ఈవెంట్ అయ్యాక డిసెంబర్ 28 ట్రైలర్ లాంచ్ హైదరాబాద్ లో చేసేలా ప్రణాళిక వేస్తున్నారు. జనవరి 10 ఎంతో దూరం లేదు. ఇంకో నెల రోజులు మాత్రమే ఉంది. ఇంత పెద్ద గ్రాండియర్ కి పబ్లిసిటీ చాలా అవసరం. లక్నోలో చేసిన ఈవెంట్ సక్సెస్ అయినప్పటికీ పాట్నాలో పుష్ప 2కి వచ్చిన స్పందన ముందు తేలిపోయింది. సో సంథింగ్ బిగ్ అనేది జరగాలి. ఆ దిశగానే ఎస్విసి టీమ్ ప్లాన్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ మినహాయిస్తే సోలో హీరోగా రామ్ చరణ్ సినిమా చేసి ఏళ్ళు గడిచిపోవడంతో మెగా ఫ్యాన్స్ మంచి ఆకలి మీదున్నారు. అంచనాలు అందుకుంటే మాత్రం రికార్డుల మోత ఖాయం.
This post was last modified on December 10, 2024 1:35 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…