Movie News

గేమ్ ఛేంజర్ అతిథిగా పుష్ప సృష్టికర్త?

డిసెంబర్ 21 అమెరికాలో నిర్వహించబోయే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రంగం సిద్ధమవుతోంది. యుఎస్ లో మొదటిసారి ఇలాంటి వేడుక జరుగుతుండటంతో దీని కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా అంచనాల విషయంలో కొంచెం అటుఇటు ఊగుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి బజ్ పెంచే భారం దీని మీదే ఉంది. ఇందులో భాగంగానే నాలుగో లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తారని తెలిసింది. రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, ఎస్జె సూర్య తదితర కీలక తారాగణంతో పాటు దిల్ రాజు, శంకర్ ఇలా మొత్తం టీమ్ పాల్గొనబోతోంది. అయితే ఇక్కడితో అట్రాక్షన్లు ఆగడం లేదు.

స్పెషల్ గెస్టుగా పుష్ప సృష్టికర్త సుకుమార్ వెళ్ళబోతున్నారని సమాచారం. రంగస్థలంతో ఈ కాంబో సృష్టించిన రికార్డులు అందరికీ గుర్తే. వింటేజ్ విలేజ్ జానర్ నే ఒక్క కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది ఈ బ్లాక్ బస్టరే. సుకుమార్ వెళ్లేందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి రామ్ చరణ్ 17 ఆయనదే. వచ్చే ఏడాది వేసవిలో సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. కేవలం అనౌన్స్ మెంట్ నుంచే అంచనాలు పెరిగాయి. రెండోది పుష్ప 2 విజయోత్సవాన్ని ఎన్ఆర్ఐలతో పంచుకునే సందర్భం దొరకడం. త్వరలో బన్నీ, రష్మిక మందన్న సక్సెస్ మీట్ కోసం అక్కడికి వెళ్లనున్నారనే వార్తల నేపధ్యంలో ఈ అప్డేట్ రావడం గమనార్హం.

యుఎస్ లో ఈవెంట్ అయ్యాక డిసెంబర్ 28 ట్రైలర్ లాంచ్ హైదరాబాద్ లో చేసేలా ప్రణాళిక వేస్తున్నారు. జనవరి 10 ఎంతో దూరం లేదు. ఇంకో నెల రోజులు మాత్రమే ఉంది. ఇంత పెద్ద గ్రాండియర్ కి పబ్లిసిటీ చాలా అవసరం. లక్నోలో చేసిన ఈవెంట్ సక్సెస్ అయినప్పటికీ పాట్నాలో పుష్ప 2కి వచ్చిన స్పందన ముందు తేలిపోయింది. సో సంథింగ్ బిగ్ అనేది జరగాలి. ఆ దిశగానే ఎస్విసి టీమ్ ప్లాన్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ మినహాయిస్తే సోలో హీరోగా రామ్ చరణ్ సినిమా చేసి ఏళ్ళు గడిచిపోవడంతో మెగా ఫ్యాన్స్ మంచి ఆకలి మీదున్నారు. అంచనాలు అందుకుంటే మాత్రం రికార్డుల మోత ఖాయం.

Kumar

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

5 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

6 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

8 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

9 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

10 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

11 hours ago