Movie News

భైరవం…వచ్చి పడింది ఇరకాటం

మీడియం రేంజ్ హీరోల మల్టీస్టారర్ గా రూపొందుతున్న భైరవంని వీలైనంత వేగంగా పూర్తి చేసి క్రిస్మస్ బరిలో దింపాలని నిర్మాతలు విశ్వప్రయత్నం చేశారు కానీ ఇప్పుడది సాధ్యపడేలా లేకపోవడానికి చాలా కారణాలు అడ్డు పడుతున్నాయి. కొద్దిరోజుల క్రితమే నారా రోహిత్ కు పితృ వియోగం కలగడం వల్ల బ్యాలన్స్ ఉన్న షూటింగ్ కి బ్రేక్ పడింది. తాజాగా మంచు మనోజ్ కుటుంబ గొడవలతో పాటు శారీరకంగా గాయపడటంతో డబ్బింగ్ తో పాటు ఇతర కార్యక్రమాలను పెండింగ్ ఉంచాల్సి వస్తోంది. బెల్లకొండ సాయిశ్రీనివాస్ అందుబాటులో ఉన్నప్పటికీ మిగిలిన ఇద్దరూ రాలేని పరిస్థితితో వాయిదా తప్పలేదు.

పోనీ కాంపిటీషన్ ఉన్నా పర్వాలేదు సంక్రాంతికి వెళదామా అంటే అంత విపరీతమైన పోటీలో సరైన థియేటర్లు దొరకడమే కష్టం. తమిళ హిట్ మూవీ గరుడన్ రీమేక్ గా రూపొందుతున్న భైరవంకు విజయ్ కనకమేడల దర్శకుడు. ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే కొన్ని కీలక మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా రెడీ చేస్తున్నారు. గుడి భూముల అన్యాక్రాంతం, స్నేహం, మిత్ర ద్రోహం అంశాల చుట్టూ అల్లుకున్న ఈ కథలో మంచి ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. పుష్ప 2 జాతర అంత కాకపోయినా ఇందులోనూ ఇంటర్వెల్ ని బ్లాస్ట్ చేసే ఒక ఎపిసోడ్ చాలా బాగా వచ్చిందట. అందుకే మేకర్స్ ధీమాగా ఉన్నారు.

ఇంకొంత కాలం ఆగాల్సి వస్తే మాత్రం భైరవంకి జనవరి చివరివారం దాకా ఆగడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఒకవేళ రోహిత్, మనోజ్ కనక తమ ఇబ్బందులను పక్కనపెట్టి సహకారం అందిస్తే పనులు వేగవంతం చేసి ఫస్ట్ కాపీ రెడీ చేస్తారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ వచ్చాక ఈ సినిమా మీద బజ్ పెరిగింది. పల్లెటూరి నేపధ్యం, ముగ్గురు హీరోలు, సాయిశ్రీనివాస్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న టాలీవుడ్ ఎంట్రీ లాంటి అంశాలు క్రమంగా హైప్ తీసుకొస్తాయి. మరి చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. తమిళంలో సూరి చేసిన పాత్రను సాయిశ్రీనివాస్ చేస్తుండగా, శశికుమార్ గా రోహిత్, ఉన్నిముకుందన్ గా మనోజ్ నటించాడు.

This post was last modified on December 10, 2024 10:52 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

24 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago