మీడియం రేంజ్ హీరోల మల్టీస్టారర్ గా రూపొందుతున్న భైరవంని వీలైనంత వేగంగా పూర్తి చేసి క్రిస్మస్ బరిలో దింపాలని నిర్మాతలు విశ్వప్రయత్నం చేశారు కానీ ఇప్పుడది సాధ్యపడేలా లేకపోవడానికి చాలా కారణాలు అడ్డు పడుతున్నాయి. కొద్దిరోజుల క్రితమే నారా రోహిత్ కు పితృ వియోగం కలగడం వల్ల బ్యాలన్స్ ఉన్న షూటింగ్ కి బ్రేక్ పడింది. తాజాగా మంచు మనోజ్ కుటుంబ గొడవలతో పాటు శారీరకంగా గాయపడటంతో డబ్బింగ్ తో పాటు ఇతర కార్యక్రమాలను పెండింగ్ ఉంచాల్సి వస్తోంది. బెల్లకొండ సాయిశ్రీనివాస్ అందుబాటులో ఉన్నప్పటికీ మిగిలిన ఇద్దరూ రాలేని పరిస్థితితో వాయిదా తప్పలేదు.
పోనీ కాంపిటీషన్ ఉన్నా పర్వాలేదు సంక్రాంతికి వెళదామా అంటే అంత విపరీతమైన పోటీలో సరైన థియేటర్లు దొరకడమే కష్టం. తమిళ హిట్ మూవీ గరుడన్ రీమేక్ గా రూపొందుతున్న భైరవంకు విజయ్ కనకమేడల దర్శకుడు. ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే కొన్ని కీలక మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా రెడీ చేస్తున్నారు. గుడి భూముల అన్యాక్రాంతం, స్నేహం, మిత్ర ద్రోహం అంశాల చుట్టూ అల్లుకున్న ఈ కథలో మంచి ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. పుష్ప 2 జాతర అంత కాకపోయినా ఇందులోనూ ఇంటర్వెల్ ని బ్లాస్ట్ చేసే ఒక ఎపిసోడ్ చాలా బాగా వచ్చిందట. అందుకే మేకర్స్ ధీమాగా ఉన్నారు.
ఇంకొంత కాలం ఆగాల్సి వస్తే మాత్రం భైరవంకి జనవరి చివరివారం దాకా ఆగడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఒకవేళ రోహిత్, మనోజ్ కనక తమ ఇబ్బందులను పక్కనపెట్టి సహకారం అందిస్తే పనులు వేగవంతం చేసి ఫస్ట్ కాపీ రెడీ చేస్తారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ వచ్చాక ఈ సినిమా మీద బజ్ పెరిగింది. పల్లెటూరి నేపధ్యం, ముగ్గురు హీరోలు, సాయిశ్రీనివాస్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న టాలీవుడ్ ఎంట్రీ లాంటి అంశాలు క్రమంగా హైప్ తీసుకొస్తాయి. మరి చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. తమిళంలో సూరి చేసిన పాత్రను సాయిశ్రీనివాస్ చేస్తుండగా, శశికుమార్ గా రోహిత్, ఉన్నిముకుందన్ గా మనోజ్ నటించాడు.
This post was last modified on December 10, 2024 10:52 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…