మీడియం రేంజ్ హీరోల మల్టీస్టారర్ గా రూపొందుతున్న భైరవంని వీలైనంత వేగంగా పూర్తి చేసి క్రిస్మస్ బరిలో దింపాలని నిర్మాతలు విశ్వప్రయత్నం చేశారు కానీ ఇప్పుడది సాధ్యపడేలా లేకపోవడానికి చాలా కారణాలు అడ్డు పడుతున్నాయి. కొద్దిరోజుల క్రితమే నారా రోహిత్ కు పితృ వియోగం కలగడం వల్ల బ్యాలన్స్ ఉన్న షూటింగ్ కి బ్రేక్ పడింది. తాజాగా మంచు మనోజ్ కుటుంబ గొడవలతో పాటు శారీరకంగా గాయపడటంతో డబ్బింగ్ తో పాటు ఇతర కార్యక్రమాలను పెండింగ్ ఉంచాల్సి వస్తోంది. బెల్లకొండ సాయిశ్రీనివాస్ అందుబాటులో ఉన్నప్పటికీ మిగిలిన ఇద్దరూ రాలేని పరిస్థితితో వాయిదా తప్పలేదు.
పోనీ కాంపిటీషన్ ఉన్నా పర్వాలేదు సంక్రాంతికి వెళదామా అంటే అంత విపరీతమైన పోటీలో సరైన థియేటర్లు దొరకడమే కష్టం. తమిళ హిట్ మూవీ గరుడన్ రీమేక్ గా రూపొందుతున్న భైరవంకు విజయ్ కనకమేడల దర్శకుడు. ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే కొన్ని కీలక మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా రెడీ చేస్తున్నారు. గుడి భూముల అన్యాక్రాంతం, స్నేహం, మిత్ర ద్రోహం అంశాల చుట్టూ అల్లుకున్న ఈ కథలో మంచి ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. పుష్ప 2 జాతర అంత కాకపోయినా ఇందులోనూ ఇంటర్వెల్ ని బ్లాస్ట్ చేసే ఒక ఎపిసోడ్ చాలా బాగా వచ్చిందట. అందుకే మేకర్స్ ధీమాగా ఉన్నారు.
ఇంకొంత కాలం ఆగాల్సి వస్తే మాత్రం భైరవంకి జనవరి చివరివారం దాకా ఆగడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఒకవేళ రోహిత్, మనోజ్ కనక తమ ఇబ్బందులను పక్కనపెట్టి సహకారం అందిస్తే పనులు వేగవంతం చేసి ఫస్ట్ కాపీ రెడీ చేస్తారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ వచ్చాక ఈ సినిమా మీద బజ్ పెరిగింది. పల్లెటూరి నేపధ్యం, ముగ్గురు హీరోలు, సాయిశ్రీనివాస్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న టాలీవుడ్ ఎంట్రీ లాంటి అంశాలు క్రమంగా హైప్ తీసుకొస్తాయి. మరి చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. తమిళంలో సూరి చేసిన పాత్రను సాయిశ్రీనివాస్ చేస్తుండగా, శశికుమార్ గా రోహిత్, ఉన్నిముకుందన్ గా మనోజ్ నటించాడు.
This post was last modified on December 10, 2024 10:52 am
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…