బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన యానిమల్ వచ్చి ఏడాది దాటుతున్నా ఇంకా డిబేట్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇండియన్ ఐడల్ కొత్త సీజన్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు మరోసారి ప్రశ్నలు ఎదురుకునే పరిస్థితి వచ్చింది. మాములుగా ఎవరు అడిగినా, తన గురించి ట్వీట్ చేసినా పేలిపోయే సమాధానం చెప్పే ఈ విలక్షణ దర్శకుడు ఈసారి నవ్వుతూనే చురకలు వేశాడు. ముందో అమ్మాయి మాట్లాడుతూ యానిమల్ తనకు చాలా బాగా నచ్చిందని, మూడు గంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్నా మూడుసార్లు చూశానని ఆనందంగా చెప్పుకొచ్చింది.
ఇంతే మోతాదులో యానిమల్ అస్సలు నచ్చని ఫ్రెండ్ ఉందని మానుషి అనే అమ్మాయిని స్టేజి పైకి పిలిచింది. ఆమె మాట్లాడుతూ యానిమల్ తనకూ నచ్చిందని, అయితే కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఎవరైనా తనను షూ నాకమని అడిగితే తనకు వ్యక్తిగతంగా సమస్యగా మారుతుందని అన్నప్పుడు మూడు వందల మందిని చంపిన హీరోకి అనిపించిందా అంటూ పంచు వేశాడు. యానిమల్ మీద గతంలో విమర్శలు చేసిన జావేద్ అక్తర్ ప్రస్తావన కూడా ఇద్దరి మధ్య వచ్చింది. యానిమల్ లాంటి సినిమాల వల్ల సమాజం చెడిపోతుందని ఆయన చేసిన కామెంట్స్ ని గుర్తు చేసింది.
ఒకవేళ జావేద్ సాబ్ కనక స్టోరీ రైటర్, గీత రచయిత కాకపోయి ఉంటే ఆయన మాటలను సీరియస్ గా తీసుకునేవాడినని కౌంటర్ వేశారు. కబీర్ సింగ్ లో చూపించిన టాక్సిక్ రిలేషన్స్ గురించి కూడా టాపిక్ వచ్చింది. జీవిత భాగస్వామిని చాచి చెంప మీద కొట్టడం తాను స్వాగతించనని, ఒకవేళ భర్త ఆ పని చేసినా ఒప్పుకోనని ఆ అమ్మాయి చెప్పడం పట్ల అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. దానికి సందీప్ వంగా బదులిస్తూ అది ప్రేమతో చేసేది. సినిమాలు వినోదం కోసం మాత్రమే చూడమని, ఏదో మెసేజ్ కావాలని, పాఠం నేర్చుకోవాలని అద్దాలు పెట్టుకుని చూడొద్దని ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో ఇక అటుపక్క నుంచి మాట్లాడేందుకు ఏమీ లేకపోయింది.
This post was last modified on December 9, 2024 6:52 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…