బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన యానిమల్ వచ్చి ఏడాది దాటుతున్నా ఇంకా డిబేట్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇండియన్ ఐడల్ కొత్త సీజన్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు మరోసారి ప్రశ్నలు ఎదురుకునే పరిస్థితి వచ్చింది. మాములుగా ఎవరు అడిగినా, తన గురించి ట్వీట్ చేసినా పేలిపోయే సమాధానం చెప్పే ఈ విలక్షణ దర్శకుడు ఈసారి నవ్వుతూనే చురకలు వేశాడు. ముందో అమ్మాయి మాట్లాడుతూ యానిమల్ తనకు చాలా బాగా నచ్చిందని, మూడు గంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్నా మూడుసార్లు చూశానని ఆనందంగా చెప్పుకొచ్చింది.
ఇంతే మోతాదులో యానిమల్ అస్సలు నచ్చని ఫ్రెండ్ ఉందని మానుషి అనే అమ్మాయిని స్టేజి పైకి పిలిచింది. ఆమె మాట్లాడుతూ యానిమల్ తనకూ నచ్చిందని, అయితే కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఎవరైనా తనను షూ నాకమని అడిగితే తనకు వ్యక్తిగతంగా సమస్యగా మారుతుందని అన్నప్పుడు మూడు వందల మందిని చంపిన హీరోకి అనిపించిందా అంటూ పంచు వేశాడు. యానిమల్ మీద గతంలో విమర్శలు చేసిన జావేద్ అక్తర్ ప్రస్తావన కూడా ఇద్దరి మధ్య వచ్చింది. యానిమల్ లాంటి సినిమాల వల్ల సమాజం చెడిపోతుందని ఆయన చేసిన కామెంట్స్ ని గుర్తు చేసింది.
ఒకవేళ జావేద్ సాబ్ కనక స్టోరీ రైటర్, గీత రచయిత కాకపోయి ఉంటే ఆయన మాటలను సీరియస్ గా తీసుకునేవాడినని కౌంటర్ వేశారు. కబీర్ సింగ్ లో చూపించిన టాక్సిక్ రిలేషన్స్ గురించి కూడా టాపిక్ వచ్చింది. జీవిత భాగస్వామిని చాచి చెంప మీద కొట్టడం తాను స్వాగతించనని, ఒకవేళ భర్త ఆ పని చేసినా ఒప్పుకోనని ఆ అమ్మాయి చెప్పడం పట్ల అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. దానికి సందీప్ వంగా బదులిస్తూ అది ప్రేమతో చేసేది. సినిమాలు వినోదం కోసం మాత్రమే చూడమని, ఏదో మెసేజ్ కావాలని, పాఠం నేర్చుకోవాలని అద్దాలు పెట్టుకుని చూడొద్దని ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో ఇక అటుపక్క నుంచి మాట్లాడేందుకు ఏమీ లేకపోయింది.
This post was last modified on December 9, 2024 6:52 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…