బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన యానిమల్ వచ్చి ఏడాది దాటుతున్నా ఇంకా డిబేట్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇండియన్ ఐడల్ కొత్త సీజన్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు మరోసారి ప్రశ్నలు ఎదురుకునే పరిస్థితి వచ్చింది. మాములుగా ఎవరు అడిగినా, తన గురించి ట్వీట్ చేసినా పేలిపోయే సమాధానం చెప్పే ఈ విలక్షణ దర్శకుడు ఈసారి నవ్వుతూనే చురకలు వేశాడు. ముందో అమ్మాయి మాట్లాడుతూ యానిమల్ తనకు చాలా బాగా నచ్చిందని, మూడు గంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్నా మూడుసార్లు చూశానని ఆనందంగా చెప్పుకొచ్చింది.
ఇంతే మోతాదులో యానిమల్ అస్సలు నచ్చని ఫ్రెండ్ ఉందని మానుషి అనే అమ్మాయిని స్టేజి పైకి పిలిచింది. ఆమె మాట్లాడుతూ యానిమల్ తనకూ నచ్చిందని, అయితే కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఎవరైనా తనను షూ నాకమని అడిగితే తనకు వ్యక్తిగతంగా సమస్యగా మారుతుందని అన్నప్పుడు మూడు వందల మందిని చంపిన హీరోకి అనిపించిందా అంటూ పంచు వేశాడు. యానిమల్ మీద గతంలో విమర్శలు చేసిన జావేద్ అక్తర్ ప్రస్తావన కూడా ఇద్దరి మధ్య వచ్చింది. యానిమల్ లాంటి సినిమాల వల్ల సమాజం చెడిపోతుందని ఆయన చేసిన కామెంట్స్ ని గుర్తు చేసింది.
ఒకవేళ జావేద్ సాబ్ కనక స్టోరీ రైటర్, గీత రచయిత కాకపోయి ఉంటే ఆయన మాటలను సీరియస్ గా తీసుకునేవాడినని కౌంటర్ వేశారు. కబీర్ సింగ్ లో చూపించిన టాక్సిక్ రిలేషన్స్ గురించి కూడా టాపిక్ వచ్చింది. జీవిత భాగస్వామిని చాచి చెంప మీద కొట్టడం తాను స్వాగతించనని, ఒకవేళ భర్త ఆ పని చేసినా ఒప్పుకోనని ఆ అమ్మాయి చెప్పడం పట్ల అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. దానికి సందీప్ వంగా బదులిస్తూ అది ప్రేమతో చేసేది. సినిమాలు వినోదం కోసం మాత్రమే చూడమని, ఏదో మెసేజ్ కావాలని, పాఠం నేర్చుకోవాలని అద్దాలు పెట్టుకుని చూడొద్దని ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో ఇక అటుపక్క నుంచి మాట్లాడేందుకు ఏమీ లేకపోయింది.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…