బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన యానిమల్ వచ్చి ఏడాది దాటుతున్నా ఇంకా డిబేట్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇండియన్ ఐడల్ కొత్త సీజన్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు మరోసారి ప్రశ్నలు ఎదురుకునే పరిస్థితి వచ్చింది. మాములుగా ఎవరు అడిగినా, తన గురించి ట్వీట్ చేసినా పేలిపోయే సమాధానం చెప్పే ఈ విలక్షణ దర్శకుడు ఈసారి నవ్వుతూనే చురకలు వేశాడు. ముందో అమ్మాయి మాట్లాడుతూ యానిమల్ తనకు చాలా బాగా నచ్చిందని, మూడు గంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్నా మూడుసార్లు చూశానని ఆనందంగా చెప్పుకొచ్చింది.
ఇంతే మోతాదులో యానిమల్ అస్సలు నచ్చని ఫ్రెండ్ ఉందని మానుషి అనే అమ్మాయిని స్టేజి పైకి పిలిచింది. ఆమె మాట్లాడుతూ యానిమల్ తనకూ నచ్చిందని, అయితే కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఎవరైనా తనను షూ నాకమని అడిగితే తనకు వ్యక్తిగతంగా సమస్యగా మారుతుందని అన్నప్పుడు మూడు వందల మందిని చంపిన హీరోకి అనిపించిందా అంటూ పంచు వేశాడు. యానిమల్ మీద గతంలో విమర్శలు చేసిన జావేద్ అక్తర్ ప్రస్తావన కూడా ఇద్దరి మధ్య వచ్చింది. యానిమల్ లాంటి సినిమాల వల్ల సమాజం చెడిపోతుందని ఆయన చేసిన కామెంట్స్ ని గుర్తు చేసింది.
ఒకవేళ జావేద్ సాబ్ కనక స్టోరీ రైటర్, గీత రచయిత కాకపోయి ఉంటే ఆయన మాటలను సీరియస్ గా తీసుకునేవాడినని కౌంటర్ వేశారు. కబీర్ సింగ్ లో చూపించిన టాక్సిక్ రిలేషన్స్ గురించి కూడా టాపిక్ వచ్చింది. జీవిత భాగస్వామిని చాచి చెంప మీద కొట్టడం తాను స్వాగతించనని, ఒకవేళ భర్త ఆ పని చేసినా ఒప్పుకోనని ఆ అమ్మాయి చెప్పడం పట్ల అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. దానికి సందీప్ వంగా బదులిస్తూ అది ప్రేమతో చేసేది. సినిమాలు వినోదం కోసం మాత్రమే చూడమని, ఏదో మెసేజ్ కావాలని, పాఠం నేర్చుకోవాలని అద్దాలు పెట్టుకుని చూడొద్దని ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో ఇక అటుపక్క నుంచి మాట్లాడేందుకు ఏమీ లేకపోయింది.
This post was last modified on December 9, 2024 6:52 pm
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…
దర్శకుడిగా తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’తో తరుణ్ భాస్కర్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండో సినిమా ‘ఈ నగరానికి…
రాజమౌళి సినిమా అంటే ఒకప్పట్లా భారతీయ ప్రేక్షకులు మాత్రమే కాదు.. గ్లోబల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…