రుద్రమదేవి తర్వాత ఐదేళ్ల విరామం తీసుకున్నాడు సీనియర్ దర్శకుడు గుణశేఖర్. రానా దగ్గుబాటితో హిరణ్యకశ్యప లాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకున్నాడు కానీ.. అది అనుకున్న ప్రకారం పట్టాలెక్కలేదు.
అది ఆలస్యమవుతుండటంతో ఈలోపు వేరే సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన గుణశేఖర్.. ఆ సినిమా టైటిల్, ఇతర విశేషాలను వెల్లడించాడు. శకుంతలం పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇది కూడా ఒక పురాణ గాథే కావడం విశేషం. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించనుండగా.. గుణశేఖర్ సొంత సంస్థ గుణ టీమ్ వర్క్స్ బేనర్ మీద ఆయన సతీమణి నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇంతకీ ఈ శకుంతలం కథేంటి అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మహాభారతంలో ఉపకథ అయిన శకుంతల, దుష్యంత మహారాజుల ప్రేమగాథనే గుణశేఖర్ వెండి తెర మీదికి తేబోతున్నాడని అర్థమవుతోంది. అపురూపమైన సౌందర్యవతి అయిన శకుంతల కణ్వమహర్షి ఆశ్రమంలో పెరిగి పెద్దవుతుంది. ఒక రోజు జింకను వేటాడుతూ ఆ ఆశ్రమానికి వచ్చిన దుష్యంత మహారాజు ఆమె ప్రేమలో పడతాడు. ఆమెను గాంధర్వ వివాహం చేసుకొని గర్భ దానం కూడా చేస్తాడు. తన రాజ్యానికి వెళ్ళి సకల రాచ మర్యాదలతో తాను ఆహ్వానిస్తానని చెప్పి వెళ్లిన దుష్యంతుడు ఎంతకూ రాడు. ఈలోపు భర్తను తలుచుకుంటూ కణ్వ ఆశ్రమానికి వచ్చిన దూర్వాస మహర్షిని పట్టించుకోనందుకు శకుంతలను ఆయన శపిస్తాడు. ఈ శాపం వల్ల దుష్యంతుడు శకుంతలను మరిచిపోతాడు. తర్వాత శకుంతల భరతుడికి జన్మనిస్తుంది. తర్వాత అనేక పరిణామాల తర్వాత దుష్యంతుడు భార్య దగ్గరికి వస్తాడు. భరతుడిని కొడుగ్గా అంగీకరిస్తాడు. ఎక్కువగా ప్రచారంలో ఉన్న కథ ఇది కాగా.. ఇందులో రకరకాల వెర్షన్లు ఉన్నాయి. ఈ కథలో మలుపులకైతే లోటు లేదు. దాన్ని ఇప్పుడు గుణ తెరపైకి తేబోతుండటం ఆసక్తి రేకెత్తించేదే.
This post was last modified on October 10, 2020 8:57 am
ఒక హీరో వరుసగా డిజాస్టర్లు ఇచ్చినపుడు.. తన చివరి హిట్ ఎప్పుడో తన అభిమానులు కూడా మరిచిపోయినపుడు.. అతను కొత్తగా…
ఎల్లుండి విడుదల కాబోతున్న కొరియన్ కనకరాజుకి రేపు రాత్రి ప్రీమియర్లు వేయడం దాదాపు ఫిక్స్. ఇంకా టికెట్ల అమ్మకాలు మొదలుకాలేదు…
జూన్ నెలలో పెద్ది విడుదల ముందు వరకు దర్శకుడు బుచ్చిబాబు మీద మెగా ఫ్యాన్స్ ఒకటే కాదు ఇండస్ట్రీ జనాలు…
కెరీర్లో కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు మంచు మనోజ్. రీఎంట్రీలో అతను ‘మిరాయ్’ సినిమాలో విలన్…
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…