బాలీవుడ్లో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా చాలా కష్టపడి ఎదిగిన హీరో అక్షయ్ కుమార్. అతను ఎప్పుడూ వివాదాల్లో తలదూర్చడు. బయట కూడా హీరో అనిపించుకునేలా ఎన్నో మంచి పనులు చేస్తుంటాడు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటాడు. గత కొన్నేళ్లలో అనేక భారీ హిట్లతో తన ఫాలోయింగ్ను, మార్కెట్ను అమాంతం పెంచుకున్నాడు అక్షయ్. అతడి కొత్త సినిమా లక్ష్మీబాంబ్ మీదా మంచి అంచనాలే ఉన్నాయి.
దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని హాట్ స్టార్ నవంబరు 9 నుంచి స్ట్రీమ్ చేయబోతోంది. దీని ట్రైలర్ తాజాగా లాంచ్ అయింది. సౌత్ బ్లాక్ బస్టర్ కాంఛనకు రీమేక్ అయిన ఈ చిత్రం ఒరిజినల్ తరహాలోనే మాస్ ప్రేక్షకులను అలరిస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఐతే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్న లక్ష్మీబాంబ్ ట్రైలర్కు యూట్యూబ్లో లైక్ కొట్టాలన్నా కొట్టలేరు. డిజ్లైక్ కూడా చేయలేరు. అలాగే కామెంట్ చేయాలన్నఆ చేయలేరు. వాటిని అక్కడ డిజేబుల్ చేసేశారు దాని మేకర్స్. ఇదంతా బాలీవుడ్ మీద జనాల్లో పెరిగిన నెగెటివిటీ తాలూకు భయమే. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానంతరం బాలీవుడ్ నెపోటిజం బ్యాచ్ మీద నెటిజన్ల కోపం అలా ఇలా లేదు.
ఆలియా భట్ సహా చాలామందిపై ఆ కోపాన్ని చూపించారు. ఆమె నటించిన సడక్-2 ట్రైలర్ను డిజ్లైక్లతో ముంచెత్తారు. అలాగే మరో స్టార్ కిడ్ అనన్య పాండే నటించిన ఖాలిపీలి పరిస్థితీ ఇంతే. అక్షయ్ మీద ఇలాంటి నెగెటివిటీ ఏమీ లేకపోయినా సరే.. ఎందుకొచ్చిన గొడవ అని లైక్స్, డిజ్ లైక్స్తో పాటు కామెంట్ల బాక్స్ డిజేబుల్ చేసి పడేశారు. ఇది అక్షయ్ అభిమానులను నిరాశ పరిచింది.
This post was last modified on October 10, 2020 8:55 am
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…