అభిమానుల మధ్య పొరపొచ్చాలు, అపార్థాలు ఉండొచ్చేమో కానీ టాలీవుడ్ హీరోల సఖ్యత ఎన్నోసార్లు బయటపడిన దాఖలాలు బోలెడున్నాయి. ముఖ్యంగా నిన్నటి తరం లెజెండరీ సీనియర్లు చిరంజీవి, బాలకృష్ణలకు అసలు పడదేమోననే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇటీవలే జరిగిన బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు చిరు ముఖ్య అతిథిగా విచ్చేసి మల్టీస్టారర్ తీద్దామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అంతకు ముందు గౌతమీపుత్ర శాతకర్ణి ప్రమోషన్ సమయంలో ఇండస్ట్రీలో నాకున్న ఏకైక ఫ్రెండ్ చిరంజీవి అంటూ బాలయ్య చెప్పడం వైరలయ్యింది. ఇప్పుడు అన్ స్టాపబుల్ షోలో మరో సందర్భం వచ్చింది.
నవీన్ పోలిశెట్టి, శ్రీలీల గెస్టులుగా పాల్గొన్న తాజా ఎపిసోడ్ లో ఇద్దరి మధ్య బాలయ్య ఒక సరదా ఆట పెట్టారు. ఒక పాట పేరు చెప్పినప్పుడు ఎవరైతే ముందు బజర్ నొక్కి దాని హుక్ స్టెప్ వేస్తారో వారికి ఒక పాయింట్ వస్తుంది. అందులో భాగంగా ముందు అల వైకుంఠపురములో బుట్టబొమ్మ ఇస్తే శ్రీలీల గెలుచుకుంది. తర్వాత ఇంద్ర దాయి దాయి దామ్మ వంతు వచ్చింది. అయితే ఇద్దరూ సరిగా రీ క్రియేట్ చేయలేకపోయారు. దీన్ని గమనించిన బాలయ్య ఈ పాయింట్ మన ముగ్గురికి కాదు నా బ్రదర్ చిరంజీవికి ఇచ్చేస్తున్నా అని చెప్పడంతో ఒక్కసారిగా స్టూడియో చప్పట్లతో మారుమ్రోగిపోయింది.
తర్వాత కుర్చీ మడతపెట్టి, దెబ్బలు పడతాయ్ రోయ్ తదితర సాంగ్స్ తో రౌండ్ కంటిన్యూ అయ్యింది కానీ చిరుకి అలా ప్రత్యేక గౌరవం ఇవ్వడం ఇద్దరి ఫ్యాన్స్ కి నచ్చేసింది. నిజానికి ఎవరో ఒకరికి పాయింట్ ఇచ్చి టాపిక్ ముగిస్తే అయిపోయేది. కానీ అలా చేయలేదు. ఆద్యంతం సరదాగా జరిగిన ఈ టాక్ షోలో నవీన్ పోలిశెట్టి, శ్రీలీల కెరీర్ ప్రారంభంలోని జ్ఞాపకాలు, ఒడిదుడుకులతో పాటు ఎన్నో కబుర్లు పంచుకున్నారు. ఈ జోడి నిజానికి సితార బ్యానర్ లో అనగనగా ఒక రాజు సినిమా చేయాల్సింది. రెండేళ్ల క్రితం ప్రకటన వచ్చాక అర్ధాంతరంగా ఆగిపోయింది. తిరిగి ఈ కాంబో వేరే మూవీకి కలుస్తుందేమో వేచి చూడాలి.
This post was last modified on December 9, 2024 11:11 am
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…