Movie News

నా బ్రదర్ చిరంజీవికి ఇచ్చేస్తున్నా : బాలయ్య

అభిమానుల మధ్య పొరపొచ్చాలు, అపార్థాలు ఉండొచ్చేమో కానీ టాలీవుడ్ హీరోల సఖ్యత ఎన్నోసార్లు బయటపడిన దాఖలాలు బోలెడున్నాయి. ముఖ్యంగా నిన్నటి తరం లెజెండరీ సీనియర్లు చిరంజీవి, బాలకృష్ణలకు అసలు పడదేమోననే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇటీవలే జరిగిన బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు చిరు ముఖ్య అతిథిగా విచ్చేసి మల్టీస్టారర్ తీద్దామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అంతకు ముందు గౌతమీపుత్ర శాతకర్ణి ప్రమోషన్ సమయంలో ఇండస్ట్రీలో నాకున్న ఏకైక ఫ్రెండ్ చిరంజీవి అంటూ బాలయ్య చెప్పడం వైరలయ్యింది. ఇప్పుడు అన్ స్టాపబుల్ షోలో మరో సందర్భం వచ్చింది.

నవీన్ పోలిశెట్టి, శ్రీలీల గెస్టులుగా పాల్గొన్న తాజా ఎపిసోడ్ లో ఇద్దరి మధ్య బాలయ్య ఒక సరదా ఆట పెట్టారు. ఒక పాట పేరు చెప్పినప్పుడు ఎవరైతే ముందు బజర్ నొక్కి దాని హుక్ స్టెప్ వేస్తారో వారికి ఒక పాయింట్ వస్తుంది. అందులో భాగంగా ముందు అల వైకుంఠపురములో బుట్టబొమ్మ ఇస్తే శ్రీలీల గెలుచుకుంది. తర్వాత ఇంద్ర దాయి దాయి దామ్మ వంతు వచ్చింది. అయితే ఇద్దరూ సరిగా రీ క్రియేట్ చేయలేకపోయారు. దీన్ని గమనించిన బాలయ్య ఈ పాయింట్ మన ముగ్గురికి కాదు నా బ్రదర్ చిరంజీవికి ఇచ్చేస్తున్నా అని చెప్పడంతో ఒక్కసారిగా స్టూడియో చప్పట్లతో మారుమ్రోగిపోయింది.

తర్వాత కుర్చీ మడతపెట్టి, దెబ్బలు పడతాయ్ రోయ్ తదితర సాంగ్స్ తో రౌండ్ కంటిన్యూ అయ్యింది కానీ చిరుకి అలా ప్రత్యేక గౌరవం ఇవ్వడం ఇద్దరి ఫ్యాన్స్ కి నచ్చేసింది. నిజానికి ఎవరో ఒకరికి పాయింట్ ఇచ్చి టాపిక్ ముగిస్తే అయిపోయేది. కానీ అలా చేయలేదు. ఆద్యంతం సరదాగా జరిగిన ఈ టాక్ షోలో నవీన్ పోలిశెట్టి, శ్రీలీల కెరీర్ ప్రారంభంలోని జ్ఞాపకాలు, ఒడిదుడుకులతో పాటు ఎన్నో కబుర్లు పంచుకున్నారు. ఈ జోడి నిజానికి సితార బ్యానర్ లో అనగనగా ఒక రాజు సినిమా చేయాల్సింది. రెండేళ్ల క్రితం ప్రకటన వచ్చాక అర్ధాంతరంగా ఆగిపోయింది. తిరిగి ఈ కాంబో వేరే మూవీకి కలుస్తుందేమో వేచి చూడాలి.

This post was last modified on December 9, 2024 11:11 am

Share

Recent Posts

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

38 minutes ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

1 hour ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

1 hour ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

2 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

4 hours ago

చంద్రబాబు విజనరీ గ్రేట్… దక్షిణాది సీఎంల ప్రశంసలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…

5 hours ago