‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ చేయబోయే కొత్త సినిమా గురించి మరో పెద్ద అప్డేట్ బయటికి వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయబోతున్నారు. ఇప్పటికే దీపికా పదుకునే లాంటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఈ చిత్రానికి కథానాయికగా ఎంపికైంది. ఇప్పుడు అమితాబ్ వచ్చి చేరడంతో ఈ ప్రాజెక్టు రేంజ్ ఇంకా పెరిగింది. ఇది ట్రూ పాన్ ఇండియా సినిమా కాబోతోందన్నది స్పష్టం.
అమితాబ్ బచ్చన్ను పది మంది దర్శకులు సంప్రదిస్తే.. అందులో ఒకటి రెండుకు మించి ఆయన ఎంచుకోరు. ఇప్పటికీ అంత డిమాండ్ ఉందాయనకు. గతంలో నందమూరి బాలకృష్ణ-కృష్ణవంశీ కలయికలో ఓ సినిమాలో ఐదు నిమిషాల పాత్ర కోసం అడిగితే.. డేట్లు ఇవ్వలేకపోయారాయన. ఆయన ఆ పాత్ర చేయలేదని ఆ సినిమానే ఆపేసింది చిత్ర బృందం. దీన్ని బట్టి అమితాబ్ సినిమాల ఎంపికలో ఎంత కచ్చితంగా ఉంటారో తెలిసిందే.
గత ఏడాది చిరంజీవి మీద ఉన్న అభిమానంతో ‘సైరా’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించిన అమితాబ్.. ఇప్పుడు మాత్రం సినిమా స్కేల్, పాత్ర నచ్చే ప్రభాస్ మూవీని ఓకే చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఇంతకీ ఈ సినిమాలో అమితాబ్ పాత్ర ఏమై ఉంటుందన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘ఆదిత్య 369’ తరహా ఫాంటసీ టచ్ ఉన్న సైంటిఫిక్ థ్రిల్లర్ తీయబోతున్నట్లు నాగ్ అశ్విన్ ఇంతకుముందే సంకేతాలు ఇచ్చాడు.
‘ఆదిత్య 369’ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావును ఈ చిత్రానికి మెంటార్గా కూడా పెట్టుకున్నారు. ఆయన తయారు చేసిన ‘ఆదిత్య 999’ (369 సీక్వెల్) కథనే కొంచెం మార్చి తీయబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒరిజినల్లో టినూ ఆనంద్ పోషించిన సైంటిస్ట్ పాత్రను అమితాబ్ చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అలాంటి పాత్ర అయితే అమితాబ్కు భలేగా సెట్టయ్యే అవకాశముంది. చూద్దాం మరి బిగ్-బిని నాగ్ అశ్విన్ ఎలా ఉపయోగించుకుంటాడో?
This post was last modified on October 9, 2020 2:52 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…
మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
+ దేశ సరిహద్దులను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? నిస్సందేహంగా కేంద్ర ప్రభుత్వానిదే. + దేశ సరిహద్దుల నుంచి పెరుగుతున్న చొరబాట్లను…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…