‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ చేయబోయే కొత్త సినిమా గురించి మరో పెద్ద అప్డేట్ బయటికి వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయబోతున్నారు. ఇప్పటికే దీపికా పదుకునే లాంటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఈ చిత్రానికి కథానాయికగా ఎంపికైంది. ఇప్పుడు అమితాబ్ వచ్చి చేరడంతో ఈ ప్రాజెక్టు రేంజ్ ఇంకా పెరిగింది. ఇది ట్రూ పాన్ ఇండియా సినిమా కాబోతోందన్నది స్పష్టం.
అమితాబ్ బచ్చన్ను పది మంది దర్శకులు సంప్రదిస్తే.. అందులో ఒకటి రెండుకు మించి ఆయన ఎంచుకోరు. ఇప్పటికీ అంత డిమాండ్ ఉందాయనకు. గతంలో నందమూరి బాలకృష్ణ-కృష్ణవంశీ కలయికలో ఓ సినిమాలో ఐదు నిమిషాల పాత్ర కోసం అడిగితే.. డేట్లు ఇవ్వలేకపోయారాయన. ఆయన ఆ పాత్ర చేయలేదని ఆ సినిమానే ఆపేసింది చిత్ర బృందం. దీన్ని బట్టి అమితాబ్ సినిమాల ఎంపికలో ఎంత కచ్చితంగా ఉంటారో తెలిసిందే.
గత ఏడాది చిరంజీవి మీద ఉన్న అభిమానంతో ‘సైరా’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించిన అమితాబ్.. ఇప్పుడు మాత్రం సినిమా స్కేల్, పాత్ర నచ్చే ప్రభాస్ మూవీని ఓకే చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఇంతకీ ఈ సినిమాలో అమితాబ్ పాత్ర ఏమై ఉంటుందన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘ఆదిత్య 369’ తరహా ఫాంటసీ టచ్ ఉన్న సైంటిఫిక్ థ్రిల్లర్ తీయబోతున్నట్లు నాగ్ అశ్విన్ ఇంతకుముందే సంకేతాలు ఇచ్చాడు.
‘ఆదిత్య 369’ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావును ఈ చిత్రానికి మెంటార్గా కూడా పెట్టుకున్నారు. ఆయన తయారు చేసిన ‘ఆదిత్య 999’ (369 సీక్వెల్) కథనే కొంచెం మార్చి తీయబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒరిజినల్లో టినూ ఆనంద్ పోషించిన సైంటిస్ట్ పాత్రను అమితాబ్ చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అలాంటి పాత్ర అయితే అమితాబ్కు భలేగా సెట్టయ్యే అవకాశముంది. చూద్దాం మరి బిగ్-బిని నాగ్ అశ్విన్ ఎలా ఉపయోగించుకుంటాడో?
This post was last modified on October 9, 2020 2:52 pm
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…