మధ్యలో కొన్నేళ్ల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోలు లేవు. ఇది స్టార్ హీరోల అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసేది. ఐతే ఈ మధ్య పరిస్థితులు మారాయి. తెలంగాణ, ఏపీల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక బెనిఫిట్ షోలకు అనుమతులు వస్తున్నాయి. అర్ధరాత్రి నుంచే షోలు పడుతున్నాయి. ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ కూడా రెగ్యులర్గా చూస్తున్నాం.
ఐతే ఇటీవల పుష్ప-2కు హైదరాబాద్లోని సంధ్య థియేటర్లో ముందు రోజు రాత్రి వేసిన పెయిడ్ ప్రిమియర్కు హీరో అల్లు అర్జున్ హాజరు కావడం.. ఆ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని ఓ మహిళ చనిపోవడంతో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రకటనతో ఫిలిం ఇండస్ట్రీ వాళ్లతో పాటు సినీ అభిమానులు షాక్ తిన్నారు. ఇది పెద్ద సినిమాల ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
ముఖ్యంగా ఇది అగ్ర నిర్మాత దిల్ రాజుకు మింగుడు పడని విషయం.రాబోయే సంక్రాంతికి ఆయన ప్రొడక్షన్ నుంచి గేమ్ చేంజర్, సంక్రాంతికి కలుద్దాం లాంటి క్రేజీ మూవీస్ వస్తున్నాయి. బాలయ్య సినిమా డాకు మహారాజ్ను కూడా ఆయనే డిస్ట్రిబ్యూట్ చేయనున్నాడు. సంక్రాంతికి కలుద్దాం సంగతి పక్కన పెడితే మిగతా రెండు చిత్రాలకు పెద్ద ఎత్తున బెనిఫిట్ షోలు వేయాలనుకుంటున్నారు. తెలంగాణలో ఆ షోలు లేవంటే రెవెన్యూ మీద ప్రభావం పడుతుంది.
ఐతే రాజుకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో మంచి సంబంధాలున్నాయి. కోమటిరెడ్డి కూడా క్లోజే. అనుకోకుండా ఒక థియేటర్లో నిర్వహణ లోపంతో జరిగిన విషాదాన్ని కారణంగా చూపి మొత్తంగా బెనిఫిట్ షోలను క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదనే చర్చ నడుస్తోంది. బెనిఫిట్ షో అనే కాక ఏ షోకు అయినా మేనేజ్మెంట్ సరిగా లేకుంటే ఇలా జరుగుతుందని.. ఇకపై అన్ని జాగ్రత్తలు తీసుకునేలా ఎగ్జిబిటర్లకు హెచ్చరికలు జారీ చేయాలని ఇండస్ట్రీ తరఫున ఆలోచిస్తున్నారు. దీని గురించి ప్రభుత్వ పెద్దలకు వివరించి.. ఇకపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవని హామీ ఇచ్చి బెనిఫిట్ షోలకు మళ్లీ అనుమతులు లభించేలా చూడాలని రాజుతో పాటు సినీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
This post was last modified on December 7, 2024 11:04 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…