మధ్యలో కొన్నేళ్ల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోలు లేవు. ఇది స్టార్ హీరోల అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసేది. ఐతే ఈ మధ్య పరిస్థితులు మారాయి. తెలంగాణ, ఏపీల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక బెనిఫిట్ షోలకు అనుమతులు వస్తున్నాయి. అర్ధరాత్రి నుంచే షోలు పడుతున్నాయి. ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ కూడా రెగ్యులర్గా చూస్తున్నాం.
ఐతే ఇటీవల పుష్ప-2కు హైదరాబాద్లోని సంధ్య థియేటర్లో ముందు రోజు రాత్రి వేసిన పెయిడ్ ప్రిమియర్కు హీరో అల్లు అర్జున్ హాజరు కావడం.. ఆ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని ఓ మహిళ చనిపోవడంతో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రకటనతో ఫిలిం ఇండస్ట్రీ వాళ్లతో పాటు సినీ అభిమానులు షాక్ తిన్నారు. ఇది పెద్ద సినిమాల ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
ముఖ్యంగా ఇది అగ్ర నిర్మాత దిల్ రాజుకు మింగుడు పడని విషయం.రాబోయే సంక్రాంతికి ఆయన ప్రొడక్షన్ నుంచి గేమ్ చేంజర్, సంక్రాంతికి కలుద్దాం లాంటి క్రేజీ మూవీస్ వస్తున్నాయి. బాలయ్య సినిమా డాకు మహారాజ్ను కూడా ఆయనే డిస్ట్రిబ్యూట్ చేయనున్నాడు. సంక్రాంతికి కలుద్దాం సంగతి పక్కన పెడితే మిగతా రెండు చిత్రాలకు పెద్ద ఎత్తున బెనిఫిట్ షోలు వేయాలనుకుంటున్నారు. తెలంగాణలో ఆ షోలు లేవంటే రెవెన్యూ మీద ప్రభావం పడుతుంది.
ఐతే రాజుకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో మంచి సంబంధాలున్నాయి. కోమటిరెడ్డి కూడా క్లోజే. అనుకోకుండా ఒక థియేటర్లో నిర్వహణ లోపంతో జరిగిన విషాదాన్ని కారణంగా చూపి మొత్తంగా బెనిఫిట్ షోలను క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదనే చర్చ నడుస్తోంది. బెనిఫిట్ షో అనే కాక ఏ షోకు అయినా మేనేజ్మెంట్ సరిగా లేకుంటే ఇలా జరుగుతుందని.. ఇకపై అన్ని జాగ్రత్తలు తీసుకునేలా ఎగ్జిబిటర్లకు హెచ్చరికలు జారీ చేయాలని ఇండస్ట్రీ తరఫున ఆలోచిస్తున్నారు. దీని గురించి ప్రభుత్వ పెద్దలకు వివరించి.. ఇకపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవని హామీ ఇచ్చి బెనిఫిట్ షోలకు మళ్లీ అనుమతులు లభించేలా చూడాలని రాజుతో పాటు సినీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…