మధ్యలో కొన్నేళ్ల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోలు లేవు. ఇది స్టార్ హీరోల అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసేది. ఐతే ఈ మధ్య పరిస్థితులు మారాయి. తెలంగాణ, ఏపీల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక బెనిఫిట్ షోలకు అనుమతులు వస్తున్నాయి. అర్ధరాత్రి నుంచే షోలు పడుతున్నాయి. ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ కూడా రెగ్యులర్గా చూస్తున్నాం.
ఐతే ఇటీవల పుష్ప-2కు హైదరాబాద్లోని సంధ్య థియేటర్లో ముందు రోజు రాత్రి వేసిన పెయిడ్ ప్రిమియర్కు హీరో అల్లు అర్జున్ హాజరు కావడం.. ఆ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని ఓ మహిళ చనిపోవడంతో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రకటనతో ఫిలిం ఇండస్ట్రీ వాళ్లతో పాటు సినీ అభిమానులు షాక్ తిన్నారు. ఇది పెద్ద సినిమాల ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
ముఖ్యంగా ఇది అగ్ర నిర్మాత దిల్ రాజుకు మింగుడు పడని విషయం.రాబోయే సంక్రాంతికి ఆయన ప్రొడక్షన్ నుంచి గేమ్ చేంజర్, సంక్రాంతికి కలుద్దాం లాంటి క్రేజీ మూవీస్ వస్తున్నాయి. బాలయ్య సినిమా డాకు మహారాజ్ను కూడా ఆయనే డిస్ట్రిబ్యూట్ చేయనున్నాడు. సంక్రాంతికి కలుద్దాం సంగతి పక్కన పెడితే మిగతా రెండు చిత్రాలకు పెద్ద ఎత్తున బెనిఫిట్ షోలు వేయాలనుకుంటున్నారు. తెలంగాణలో ఆ షోలు లేవంటే రెవెన్యూ మీద ప్రభావం పడుతుంది.
ఐతే రాజుకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో మంచి సంబంధాలున్నాయి. కోమటిరెడ్డి కూడా క్లోజే. అనుకోకుండా ఒక థియేటర్లో నిర్వహణ లోపంతో జరిగిన విషాదాన్ని కారణంగా చూపి మొత్తంగా బెనిఫిట్ షోలను క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదనే చర్చ నడుస్తోంది. బెనిఫిట్ షో అనే కాక ఏ షోకు అయినా మేనేజ్మెంట్ సరిగా లేకుంటే ఇలా జరుగుతుందని.. ఇకపై అన్ని జాగ్రత్తలు తీసుకునేలా ఎగ్జిబిటర్లకు హెచ్చరికలు జారీ చేయాలని ఇండస్ట్రీ తరఫున ఆలోచిస్తున్నారు. దీని గురించి ప్రభుత్వ పెద్దలకు వివరించి.. ఇకపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవని హామీ ఇచ్చి బెనిఫిట్ షోలకు మళ్లీ అనుమతులు లభించేలా చూడాలని రాజుతో పాటు సినీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
This post was last modified on December 7, 2024 11:04 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…