కాలేజీలో సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేయడం పరిపాటి. ఇది అన్ని చోట్లా ఉన్నదే. అలాగే యాక్టర్స్ మధ్య కూడా ఇలాంటి సరదాలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే బయటికి కనిపించవు. అదే టీవీ షోలలో చూపిస్తే అభిమానులకో స్పెషల్ కిక్కు. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో ది రానా దగ్గుబాటి షో పేరుతో సెలబ్రిటీ టాక్ షో మొదలైన సంగతి తెలిసిందే. దీంట్లో పాల్గొనేందుకు క్రేజీ టాలీవుడ్ హీరో హీరోయిన్లను తీసుకొస్తున్నారు. అన్ స్టాపబుల్ తరహాలోనే ఉన్నప్పటికీ దీనికి యూత్ ఫ్లేవర్ బాగా అద్దటంతో యువతను ఆకట్టుకుంటోంది. తాజాగా నాగచైతన్య బావ కోసం ఈ చిట్ చాట్ కొచ్చాడు.
ఇద్దరూ కలిసి లైవ్ లో సాయిపల్లవికి కాల్ చేసి ర్యాగింగ్ చేసినంత పని చేయడం ఆకట్టుకుంది. కొన్ని తెలియని విషయాలు ఈ సందర్భంగా బయట పెట్టేశారు. మాములుగా ఇండస్ట్రీలో సాయిపల్లవి తాను యాక్ట్ చేసిన ఏ సీన్ అయినా, పాటైనా దగ్గరుండి చెక్ చేసుకుని ఏదైనా అవసరమైతే మళ్ళీ రీ షూట్ అడుగుతుందనే టాక్ ఉంది. దాని గురించి రానా నొక్కి అడిగితే అబ్బే అదేం లేదని, వాళ్లే తనను పిలుస్తారు కాబట్టి చూస్తాను తప్పించి నేనేం ఎడిటింగ్ లో తలదూర్చనని క్లారిటీ ఇచ్చింది. రానాతో తను గతంలో విరాట పర్వం చేయగా చైతుతో లవ్ స్టోరీ అయ్యాక ఇప్పుడు తండేల్ చేస్తోంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సాయిపల్లవికి ఇద్దరి హీరోల్లో చికాకు పెట్టించేది ఎవరంటే చైతునట. ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్ గా ఉండటం ఆమెకు కోపం తెప్పిస్తుందట. ట్విస్టు ఏంటంటే దానికి సమాధానం నాగచైతన్యే చెప్పాడు. తన పని కూడా ఆమె చేస్తూ టేక్ అయ్యాక మానిటర్ దగ్గరకు టింగు టింగు మంటూ పరిగెత్తుకొస్తూ ఉంటే తనకు ఆందోళన చెందాల్సిన అవసరం ఏముందని, అంతా సాయిపల్లవినే చూసుకుంటుందని చెప్పడంతో నవ్వులు విరిశాయి. మంచి హ్యూమర్ తో ఆకట్టుకునేలా సాగుతున్న రానా సిరీస్ లో ఇకపై మరింత ఫన్ ఇచ్చే యాక్టర్లయితే రాబోతున్నారు.
This post was last modified on December 7, 2024 10:46 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…