ఇది క్రెడిట్స్ కోసం పాకులాడే ప్రపంచం. మనం చేయకపోయినా పక్కోళ్ల కష్టాన్ని కూడా ఖాతాలో వేసుకునే జనాలను నిత్యం చూస్తుంటాం. అది రాజకీయం కావొచ్చు, కంపెనీ కావొచ్చు అన్ని చోట్ల ఇలాంటి మనుషులు తగులుతూ ఉంటారు. ఇక సినీ పరిశ్రమ గురించి చెప్పనక్కర్లేదు. ఒకరి కథను తీసేసుకుని డబ్బులు ఇవ్వకుండా స్వంతంగా పేరు వేసుకుని బ్లాక్ బస్టర్లు సాధించిన వాళ్ళను ఎందరినో చూశాం. కానీ ఇంత పెద్ద స్థాయికి వచ్చాక కూడా దర్శకుడు సుకుమార్ తనతో పని చేసిన వాళ్లకు ఇచ్చే గుర్తింపు, విలువ వేరే వాళ్లలో అరుదుగా కనిపిస్తుంది. ఇవాళ పుష్ప 2 ప్రెస్ మీట్ లో మరోసారది బయటపడింది.
ఈ సినిమాకు సగం దర్శకత్వం శ్రీమాన్ చేశాడని, చైల్డ్ హుడ్ ఎపిసోడ్, ట్రక్ ఫైట్, సెకండ్ యూనిట్ పర్యవేక్షణ ఇలా మొత్తం తనే చూసుకున్నాడని ఒకరకంగా చెప్పాలంటే డైరెక్షన్ కింద సుకుమార్ అండ్ శ్రీమాన్ అని వేసుండాల్సిందని సుకుమార్ చాలా పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న మీడియా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే శ్రీమాన్ కు థాంక్స్ చెప్పినా సరిపోయేది. కానీ అన్ని కెమెరాల సాక్షిగా ఇంత ఘనవిజయంలో తన అసిస్టెంట్ కు ఇంత ప్రాధాన్యం ఇవ్వడం చిన్న విషయం కాదు. ఒక్క మాటతో శ్రీమాన్ అనే కొత్త ప్రతిభ టాలీవుడ్ కు పరిచయం కాబోవడం ఖాయం.
మరో అసిస్టెంట్ మధు గురించి కూడా ఇంతే స్థాయిలో పొగడ్తల వర్షం కురిపించారు సుకుమార్. మానిటర్ ముందు తాను ఉంటే వెనుక అతను ఉంటాడని, ఎడిటింగ్ చేస్తే ఎవరూ నో అనలేనంత గొప్పగా ఉంటుందని, రప్పా రప్పా లాంటి ఐడియాలు కూడా తనవే అంటూ కితాబు ఇచ్చాడు. ఇక్కడ లేకపోవడం వల్ల కొట్టాలన్నంత కోపం వస్తోందని స్టేజి మీద తీపి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఇంత గొప్పగా తన సహాయకుల గురించి చెప్పడంలో సుకుమార్ మార్క్ మరోసారి బయటపడింది. దేశమంతా బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతున్న పుష్ప 2 ది రూల్ విజయాన్ని టీమ్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తోంది.
This post was last modified on December 7, 2024 8:20 pm
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…