సోషల్ మీడియాలో హీరోయిన్లను మార్ఫింగ్ చేయడం, వీడియోలు సృష్టించడం, తద్వారా వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారడం గత కొంత కాలంగా చూస్తున్నాం. రష్మిక మందన్న, అలియా భట్ లాంటి వాళ్ళు వీటి బారిన పడిన సందర్భాలున్నాయి. తాజాగా ప్రగ్యా నగారా కూడా చేరింది. ఈమె ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేసిన ఒక అభ్యంతరకర వీడియో ఇటీవలే వైరలయ్యింది. అందులో అభ్యంతకరంగా అనిపించే కంటెంట్ ఉండటంతో వివిధ సామాజిక మాధ్యమాల్లో వెళ్లిపోయింది. ఇది నిజామా కదా అనే నిర్ధారణ లేకుండానే, ఎవరు సృష్టించారో తెలియకుండానే లక్షలాది మందికి గంటల నిడివిలో చేరింది .
ప్రగ్యకు ఇన్స్టాగ్రామ్ లో 1.1 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. తమిళంలో 2022 వరలరు ముక్కియంతో డెబ్యూ చేసింది. మరుసటి ఏడాది నాదికలిల్ సుందరి యమునాతో మల్లువుడ్ లో అడుగు పెట్టింది. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో వచ్చిన లగ్గం ద్వారా తెలుగు స్ట్రెయిట్ మూవీ చేసింది. సాయి రోనక్ హీరోగా నటించాడు. థియేటర్లో ఆశించిన ఫలితం అందుకోనప్పటికీ ఆహా ఓటిటిలో వచ్చాక వ్యూస్ భారీగా వచ్చాయి. హర్యానా రాష్ట్రానికి చెందిన ప్రగ్యా స్వస్థలం అంబాల. తండ్రి ఇండియా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉద్యోగి. చెన్నైలో ఉండటం వల్ల దక్షిణాది సంస్కృతి అలవాట్లు అలవడ్డాయి.
ప్రగ్యా ఎక్స్ వేదికగా దీని గురించి స్పందిస్తూ ఈ ఘటన తనను షాక్ కు గురి చేసిందని, ఒక పీడకలగా భయపెట్టిందని, సాంకేతికత ఇలాంటి వాటికి పురికొల్పడం విచారకరమని పేర్కొంది. ఈ అవమానం మరే మహిళకు జరగకూడదని ట్వీట్ చేసింది. ఏఐ టెక్నాలజీ వచ్చాక డీప్ ఫేక్ వీడియోస్ బాగా ఎక్కువయ్యాయి. రష్మికది వివాదం అయ్యాక ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవడంతో మళ్ళీ అలాంటివి కనిపించలేదు. మూలాలు ఎక్కడో, ఎవరు సృష్టించారో కనిపెట్టే సమయానికి ఇలాంటి వీడియోలు చాలా దూరం వెళ్లిపోయాయి. చట్టంలో శిక్షలు తీవ్రంగా ఉంటే తప్ప వీటిని అడ్డుకోవడం కష్టం.
This post was last modified on December 7, 2024 5:14 pm
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లే లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. భారత…
తెలుగు సినిమా చరిత్రలోనే ది బెస్ట్ లవ్ స్టోరీల లిస్ట్ తీస్తే.. అందులో ‘తొలిప్రేమ’ కచ్చితంగా ఉంటుంది. తమిళుడైన కరుణాకరన్ ఈ…
ఇంకో అయిదు రోజుల్లో ధనుష్ కర విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రమోషన్ల…
వరుణ్ తేజ్ను పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లిన లావణ్య త్రిపాఠి.. తర్వాత సినిమాలకు దాదాపుగా దూరమైనట్లే కనిపించింది. ఐతే పెళ్లి…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్` అవార్డు లభించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో శనివారం…
నాయకులు పద్ధతిగా వ్యవహరించాలని.. మర్యాదగా మెలగాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పదే పదే ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు కూడా…