ఏపీ తెలంగాణ మాత్రమే కాదు అంతకు రెండింతలు ఉత్తరాది రాష్ట్రాల్లో పుష్ప 2 ది రూల్ ఆడుతున్న వీరంగం మాములుగా లేదు. హిట్టవ్వడం అందరూ ఊహించిందే కానీ ఇంత భీభత్సమైన బాలీవుడ్ రెస్పాన్స్ మాత్రం ఊహకందనిది. హైదరాబాద్ ని మించి ముంబై, కోల్కతా లాంటి నగరాల్లో థియేటర్ల దగ్గర జన సందోహం చూస్తుంటే నిజంగా ఇది డబ్బింగ్ సినిమానా అనే అనుమానం కలగక మానదు. డిసెంబర్ 5 బాక్సాఫీస్ వద్ద పుష్ప 2కి భయపడి ఎవరూ రాకపోవడం ఆయా నిర్మాతలకు మేలే చేసింది. కట్ చేస్తే డిసెంబర్ 13న సిద్ధూ మిస్ యుతో పలకరించబోతున్నాడు. ఆల్రెడీ ఒక వారం వాయిదా పడి ఈ డేట్ ఫిక్స్ చేసుకుంది.
సరే బాగానే ఉంది కానీ అల్లు అర్జున్ సునామిని సిద్దు తట్టుకోగలడా అనేదే పెద్ద అనుమానం. ఎందుకంటే మిస్ యు మీద పెద్ద బజ్ లేదు. ట్రైలర్ కాసింత ఆసక్తి రేపినప్పటికీ ఖచ్చితంగా చూసే తీరాలన్న ఇంప్రెషన్ ఇవ్వలేదు. అయినా సరే మౌత్ టాక్ ని నమ్ముకుని టీమ్ ధైర్యం చేస్తోంది. వచ్చే వారం నుంచి చాలా ప్రాంతాల్లో పుష్ప 2 టికెట్ రేట్లు సాధారణ స్థితికి రాబోతున్నాయి. అప్పుడు సగటు మాస్ ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ బయటికి వస్తారు. వాళ్ళ ఫస్ట్ ఛాయస్ పుష్ప 2నే అవుతుంది. పైగా రిపీట్స్ వేస్తున్న జనాల సంఖ్య మాములుగా లేదు. సో ఈ తుఫాను రెండో వారం కొనసాగడం ఖాయం.
అలాంటప్పుడు ఎంత మంచి కంటెంట్ ఉన్నా మిస్ యు కి పెను సవాలే ఎదురు కాబోతోంది. అయితే ప్రస్తుతం ఇంతకన్నా ఆప్షన్ లేదు. ఎందుకంటే డిసెంబర్ 20 విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2, ఉపేంద్ర యుఐ, అల్లరి నరేష్ బచ్చల మల్లి, మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన ముఫాసా లయన్ కింగ్ దిగుతున్నాయి. డిసెంబర్ 25 నితిన్ రాబిన్ హుడ్ తో వస్తాడు. ఇవి కాకుండా మరో అయిదారు మీడియం బడ్జెట్ రిలీజులున్నాయి. సో చావో రేవో సిద్దార్థ్ కి ఇప్పుడు రావడం మినహా మరో మార్గం లేదు. నా సామిరంగా ఫేమ్ ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటించిన మిస్ యులో లవ్, రొమాన్స్ తో పాటు యాక్షన్ కూడా దట్టించారు.
This post was last modified on December 7, 2024 11:31 am
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…
ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…
ముఖ్యమంత్రుల 'బ్రాండ్స్'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. "రెండు…
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…