ఏపీ తెలంగాణ మాత్రమే కాదు అంతకు రెండింతలు ఉత్తరాది రాష్ట్రాల్లో పుష్ప 2 ది రూల్ ఆడుతున్న వీరంగం మాములుగా లేదు. హిట్టవ్వడం అందరూ ఊహించిందే కానీ ఇంత భీభత్సమైన బాలీవుడ్ రెస్పాన్స్ మాత్రం ఊహకందనిది. హైదరాబాద్ ని మించి ముంబై, కోల్కతా లాంటి నగరాల్లో థియేటర్ల దగ్గర జన సందోహం చూస్తుంటే నిజంగా ఇది డబ్బింగ్ సినిమానా అనే అనుమానం కలగక మానదు. డిసెంబర్ 5 బాక్సాఫీస్ వద్ద పుష్ప 2కి భయపడి ఎవరూ రాకపోవడం ఆయా నిర్మాతలకు మేలే చేసింది. కట్ చేస్తే డిసెంబర్ 13న సిద్ధూ మిస్ యుతో పలకరించబోతున్నాడు. ఆల్రెడీ ఒక వారం వాయిదా పడి ఈ డేట్ ఫిక్స్ చేసుకుంది.
సరే బాగానే ఉంది కానీ అల్లు అర్జున్ సునామిని సిద్దు తట్టుకోగలడా అనేదే పెద్ద అనుమానం. ఎందుకంటే మిస్ యు మీద పెద్ద బజ్ లేదు. ట్రైలర్ కాసింత ఆసక్తి రేపినప్పటికీ ఖచ్చితంగా చూసే తీరాలన్న ఇంప్రెషన్ ఇవ్వలేదు. అయినా సరే మౌత్ టాక్ ని నమ్ముకుని టీమ్ ధైర్యం చేస్తోంది. వచ్చే వారం నుంచి చాలా ప్రాంతాల్లో పుష్ప 2 టికెట్ రేట్లు సాధారణ స్థితికి రాబోతున్నాయి. అప్పుడు సగటు మాస్ ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ బయటికి వస్తారు. వాళ్ళ ఫస్ట్ ఛాయస్ పుష్ప 2నే అవుతుంది. పైగా రిపీట్స్ వేస్తున్న జనాల సంఖ్య మాములుగా లేదు. సో ఈ తుఫాను రెండో వారం కొనసాగడం ఖాయం.
అలాంటప్పుడు ఎంత మంచి కంటెంట్ ఉన్నా మిస్ యు కి పెను సవాలే ఎదురు కాబోతోంది. అయితే ప్రస్తుతం ఇంతకన్నా ఆప్షన్ లేదు. ఎందుకంటే డిసెంబర్ 20 విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2, ఉపేంద్ర యుఐ, అల్లరి నరేష్ బచ్చల మల్లి, మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన ముఫాసా లయన్ కింగ్ దిగుతున్నాయి. డిసెంబర్ 25 నితిన్ రాబిన్ హుడ్ తో వస్తాడు. ఇవి కాకుండా మరో అయిదారు మీడియం బడ్జెట్ రిలీజులున్నాయి. సో చావో రేవో సిద్దార్థ్ కి ఇప్పుడు రావడం మినహా మరో మార్గం లేదు. నా సామిరంగా ఫేమ్ ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటించిన మిస్ యులో లవ్, రొమాన్స్ తో పాటు యాక్షన్ కూడా దట్టించారు.
This post was last modified on December 7, 2024 11:31 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…