ఏపీ తెలంగాణ మాత్రమే కాదు అంతకు రెండింతలు ఉత్తరాది రాష్ట్రాల్లో పుష్ప 2 ది రూల్ ఆడుతున్న వీరంగం మాములుగా లేదు. హిట్టవ్వడం అందరూ ఊహించిందే కానీ ఇంత భీభత్సమైన బాలీవుడ్ రెస్పాన్స్ మాత్రం ఊహకందనిది. హైదరాబాద్ ని మించి ముంబై, కోల్కతా లాంటి నగరాల్లో థియేటర్ల దగ్గర జన సందోహం చూస్తుంటే నిజంగా ఇది డబ్బింగ్ సినిమానా అనే అనుమానం కలగక మానదు. డిసెంబర్ 5 బాక్సాఫీస్ వద్ద పుష్ప 2కి భయపడి ఎవరూ రాకపోవడం ఆయా నిర్మాతలకు మేలే చేసింది. కట్ చేస్తే డిసెంబర్ 13న సిద్ధూ మిస్ యుతో పలకరించబోతున్నాడు. ఆల్రెడీ ఒక వారం వాయిదా పడి ఈ డేట్ ఫిక్స్ చేసుకుంది.
సరే బాగానే ఉంది కానీ అల్లు అర్జున్ సునామిని సిద్దు తట్టుకోగలడా అనేదే పెద్ద అనుమానం. ఎందుకంటే మిస్ యు మీద పెద్ద బజ్ లేదు. ట్రైలర్ కాసింత ఆసక్తి రేపినప్పటికీ ఖచ్చితంగా చూసే తీరాలన్న ఇంప్రెషన్ ఇవ్వలేదు. అయినా సరే మౌత్ టాక్ ని నమ్ముకుని టీమ్ ధైర్యం చేస్తోంది. వచ్చే వారం నుంచి చాలా ప్రాంతాల్లో పుష్ప 2 టికెట్ రేట్లు సాధారణ స్థితికి రాబోతున్నాయి. అప్పుడు సగటు మాస్ ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ బయటికి వస్తారు. వాళ్ళ ఫస్ట్ ఛాయస్ పుష్ప 2నే అవుతుంది. పైగా రిపీట్స్ వేస్తున్న జనాల సంఖ్య మాములుగా లేదు. సో ఈ తుఫాను రెండో వారం కొనసాగడం ఖాయం.
అలాంటప్పుడు ఎంత మంచి కంటెంట్ ఉన్నా మిస్ యు కి పెను సవాలే ఎదురు కాబోతోంది. అయితే ప్రస్తుతం ఇంతకన్నా ఆప్షన్ లేదు. ఎందుకంటే డిసెంబర్ 20 విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2, ఉపేంద్ర యుఐ, అల్లరి నరేష్ బచ్చల మల్లి, మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన ముఫాసా లయన్ కింగ్ దిగుతున్నాయి. డిసెంబర్ 25 నితిన్ రాబిన్ హుడ్ తో వస్తాడు. ఇవి కాకుండా మరో అయిదారు మీడియం బడ్జెట్ రిలీజులున్నాయి. సో చావో రేవో సిద్దార్థ్ కి ఇప్పుడు రావడం మినహా మరో మార్గం లేదు. నా సామిరంగా ఫేమ్ ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటించిన మిస్ యులో లవ్, రొమాన్స్ తో పాటు యాక్షన్ కూడా దట్టించారు.
This post was last modified on December 7, 2024 11:31 am
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…