పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ సందర్భంగా సంధ్య 70 ఎంఎం థియేటర్లో మహిళ చనిపోయిన దుర్ఘటనకు అల్లు అర్జున్ స్పందించి ఒక వీడియో మెసేజ్ విడుదల చేశారు. తీవ్ర సంచలనంగా మారిన ఈ ఘటన గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విపరీతమైన రద్దీ ఉంటుందని తెలిసినా కూడా కొడుకు ముచ్చట తీర్చడం కోసం వచ్చిన కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. పుష్ప 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఆస్వాదించకుండా ఒక ప్రాణం సెలవు తీసుకోవడం అభిమానులను తీవ్ర కలవరానికి గురి చేసింది. సంఘటన చూసినవాళ్ళు, విన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కదిలిపోయారు. నివాళులు అర్పించారు.
అల్లు అర్జున్ వీడియో సందేశంలో మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా ఆర్టిసి క్రాస్ రోడ్స్ కి వెళ్లి ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూడటం ఆనవాయితీగా మార్చుకున్నానని, కానీ దురదృష్టవశాత్తు ఇలా జరగడంతో పుష్ప 2 టీమ్ మొత్తం షాక్ లో ఉండిపోయిందని చెప్పాడు. దర్శకుడు సుకుమార్ తో పాటు తామందరం ఈ ఘటనకు కదిలిపోయామని, ఎవరికోసమైతే ఇంత కష్టపడి సినిమా తీస్తామో వాళ్ళకే ఇలా జరిగినప్పుడు ఆ వేదన తీరలేనిదని అన్నాడు. ఇప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని చేసినా ఆ ఫ్యామిలీకి జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేమన్న అల్లు అర్జున్ పుష్ప 2 బృందం తరఫున సంతాపం ప్రకటించాడు.
తన తరఫున వ్యక్తిగతంగా 25 లక్షల రూపాయలు అందజేస్తానని, పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకి ఇది ఉపయోగపడుతుందని అన్నాడు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న అబ్బాయికి అయ్యే ఖర్చు మొత్తం ప్రకటించిన పరిహారంతో సంబంధం లేకుండా తామే భరిస్తామని సందేశంలో పేర్కొన్నాడు. తమ పరిధిలో ఎంత సహాయం కావాలో అంతా చేస్తామని, త్వరలోనే కలుసుకుంటాని హామీ ఇచ్చాడు. ఈ బాధలో వాళ్ళు ఒంటరి కాదన్న అల్లు అర్జున్ ఇకపై ఇలాంటివి జరగకూడదని కోరుకుంటూ, ఈ హఠాత్పరిణామం తమను ఎంతగా కలిచి వేసిందో వివరించాడు. ఇలాంటి సమయంలో ఈ స్వాంతన ఆ కుటుంబానికి చాలా అవసరం
This post was last modified on December 7, 2024 9:16 am
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…