Movie News

10 నిమిషాల బీజీఎంకు 3 కోట్లా…

‘పుష్ప: ది రూల్’ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో విడుదల ముంగిట ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. కొన్ని సన్నివేశాలకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం నచ్చక.. వేరే ముగ్గురు సంగీత దర్శకులను ఆశ్రయించాడు దర్శకుడు సుకుమార్. తమన్‌తో పాటు తమిళ సంగీత దర్శకుడు సామ్ సీఎస్, కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్‌లకు కొన్ని ఎపిసోడ్లు ఇచ్చి బీజీఎం చేసి ఇవ్వమన్నారు.

ముగ్గురూ ఆ బాధ్యత పూర్తి చేసి బీజీఎం ట్రాక్స్ పుష్ప టీంకు అప్పగించారు. ఐతే ఇందులో తమన్ వర్క్ అస్సలు నచ్చని సుకుమార్.. దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు. అజనీష్ వర్క్ కొంత నచ్చినా సరే.. సినిమాలో వాడలేని పరిస్థితి వచ్చింది. సామ్ సీఎస్ వర్క్‌కు మాత్రం ఇంప్రెస్ అయి.. దాన్ని సినిమాలో పెట్టారు. కానీ తన వర్క్ కూడా మొత్తం తీసుకోలేదు. ‘పుష్ప-2’కు 90 శాతం బీజీఎం తన క్రెడిట్టే అని సామ్ చెబుతున్నాడు కానీ.. అది వాస్తవం కాదన్నది టీం వర్గాల సమాచారం.

మొత్తంగా సినిమాలో ఓ పది నిమిషాల సమయం మాత్రమే సామ్ నేపథ్య సంగీతం వినిపించింది. పుష్ప పాత్రకు మంచి ఎలివేషన్ పడ్డ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్లో వినిపించిందంతా సామ్ బీజీఎంయే. ఇంకా అక్కడక్కడా చిన్న చిన్న బిట్లుగా తన వర్క్ వాడారు. క్లైమాక్సులో దేవి, సామ్‌ల్లో ఎవరి బీజీఎం వాడాలనే విషయంలో చాలా చర్చ జరిగినప్పటికీ.. చివరికి దేవికే ఓటేశాడు సుకుమార్. ఇదీ టీం నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం.

ఇదిలా ఉంటే దేవిశ్రీకి సంగీతం, నేపథ్య సంగీతానికి కలిపి ఇచ్చిన పారితోషకానికి తోడు.. బీజీఎం కోసం నిర్మాతలు అదనంగా పెట్టిన ఖర్చు రూ.3 కోట్లు కావడం గమనార్హం. తమన్, అజనీష్, సామ్‌లు ముగ్గురికీ తలో కోటి సమర్పించుకున్నారు. మిగతా ఇద్దరి ట్రాక్స్ అసలు వాడనే లేదు. సామ్‌ది మాత్రం కొంత ఉపయోగించారు. అది పది నిమిషాల నిడివి మాత్రమే. అంటే ఈ పది నిమిషాల అదనపు స్కోర్ కోసం ఏకంగా రూ.3 కోట్లు పెట్టారన్నమాట.

This post was last modified on December 6, 2024 11:52 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

12 minutes ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

37 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

39 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

1 hour ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago