పుష్ప-2 సినిమాకు తాను సంగీత దర్శకుడిగా ఉండగా.. ఇంకో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను బీజీఎం కోసం తీసుకోవడం పట్ల దేవిశ్రీ ప్రసాద్ ఎంత హర్టయ్యాడో రిలీజ్ ముంగిట చెన్నైలో జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్లో స్పష్టంగా తెలిసిపోయింది. ఐతే సినిమాలో చాలా వరకు తన బీజీఎంయే వాడడంతో అతను చివరికి కామ్ అయ్యాడు. ఇలా ఒకరి సినిమాలోకి ఇంకొకరు రావడాన్ని దేవి ముందు నుంచి వ్యతిరేకిస్తూనే ఉండడం గమనార్హం. గతంలో ‘అతడు’ సినిమాకు మణిశర్మను ఓసారి అనుకున్నాక తనను అడిగితే.. తాను నో చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు దేవి.
‘ఇంద్ర’లో ఓ పాటకు తనను అడిగినా కూడా అలా చేయడం కుదరదనే చెప్పినట్లు కూడా ఆ సందర్భంలో వెల్లడించాడు. తాజాగా మరో ఇంటర్వ్యూలో ఓ స్టార్ హీరో తన కోసం పట్టుబడ్డప్పటికీ తనకున్న ఎథిక్స్ వల్ల ఆ సినిమా చేయలేదని దేవి వెల్లడించాడు. తమిళ స్టార్ హీరో విక్రమ్తో ఏఎల్ విజయ్ చేయాల్సిన ఓ సినిమా కోసం తాను సంగీతం అందించాల్సిందని దేవి చెప్పాడు. తననే సంగీత దర్శకుడిగా తీసుకోవాలని విక్రమ్ పట్టుబట్టినట్లు తెలిపాడు.
ఐతే అప్పటిదాకా జీవీ ప్రకాష్ కుమార్.. విజయ్ సినిమాలకు వరుసగా పని చేస్తున్నాడని.. విక్రమ్తో చేయాల్సిన సినిమా కథను కూడా వాళ్లిద్దరూ చర్చించుకున్నారని.. జీవీతోనే మళ్లీ పని చేయాలని విజయ్ అనుకున్నాడని.. ఈ విషయం తెలిసి తాను అతడితోనే కొనసాగమని విజయ్కి చెప్పినట్లు దేవి చెప్పాడు. తర్వాత విక్రమ్కు ఫోన్ చేసి మాట్లాడానని.. విజయ్కి జీవీతోనే కంఫర్ట్ అని, తనతోనే కొనసాగనివ్వాలని చెబితే విక్రమ్ ఆశ్చర్యపోయాడని.. ఇలా ఒక సంగీత దర్శకుడికి ఆఫర్ ఇస్తుంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్తోనే వెళ్లమని చెప్పడం గొప్ప విషయమని.. ఈ సంస్కారం వల్ల నువ్వు చాలా ఎత్తుకు ఎదుగుతావు అని విక్రమ్ చెప్పాడని దేవి వెల్లడించాడు. విక్రమ్, విజయ్ కాంబినేషన్లో నాన్న, తాండవం చిత్రాలు వచ్చాయి. వీటిలో ఏదో ఒక సినిమా గురించే దేవి మాట్లాడి ఉండొచ్చు.
This post was last modified on December 6, 2024 11:41 pm
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది.…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాన్ని గత నెలలోనే ప్రారంభించిన…
సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు…
గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్…