పుష్ప-2 సినిమాకు తాను సంగీత దర్శకుడిగా ఉండగా.. ఇంకో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను బీజీఎం కోసం తీసుకోవడం పట్ల దేవిశ్రీ ప్రసాద్ ఎంత హర్టయ్యాడో రిలీజ్ ముంగిట చెన్నైలో జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్లో స్పష్టంగా తెలిసిపోయింది. ఐతే సినిమాలో చాలా వరకు తన బీజీఎంయే వాడడంతో అతను చివరికి కామ్ అయ్యాడు. ఇలా ఒకరి సినిమాలోకి ఇంకొకరు రావడాన్ని దేవి ముందు నుంచి వ్యతిరేకిస్తూనే ఉండడం గమనార్హం. గతంలో ‘అతడు’ సినిమాకు మణిశర్మను ఓసారి అనుకున్నాక తనను అడిగితే.. తాను నో చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు దేవి.
‘ఇంద్ర’లో ఓ పాటకు తనను అడిగినా కూడా అలా చేయడం కుదరదనే చెప్పినట్లు కూడా ఆ సందర్భంలో వెల్లడించాడు. తాజాగా మరో ఇంటర్వ్యూలో ఓ స్టార్ హీరో తన కోసం పట్టుబడ్డప్పటికీ తనకున్న ఎథిక్స్ వల్ల ఆ సినిమా చేయలేదని దేవి వెల్లడించాడు. తమిళ స్టార్ హీరో విక్రమ్తో ఏఎల్ విజయ్ చేయాల్సిన ఓ సినిమా కోసం తాను సంగీతం అందించాల్సిందని దేవి చెప్పాడు. తననే సంగీత దర్శకుడిగా తీసుకోవాలని విక్రమ్ పట్టుబట్టినట్లు తెలిపాడు.
ఐతే అప్పటిదాకా జీవీ ప్రకాష్ కుమార్.. విజయ్ సినిమాలకు వరుసగా పని చేస్తున్నాడని.. విక్రమ్తో చేయాల్సిన సినిమా కథను కూడా వాళ్లిద్దరూ చర్చించుకున్నారని.. జీవీతోనే మళ్లీ పని చేయాలని విజయ్ అనుకున్నాడని.. ఈ విషయం తెలిసి తాను అతడితోనే కొనసాగమని విజయ్కి చెప్పినట్లు దేవి చెప్పాడు. తర్వాత విక్రమ్కు ఫోన్ చేసి మాట్లాడానని.. విజయ్కి జీవీతోనే కంఫర్ట్ అని, తనతోనే కొనసాగనివ్వాలని చెబితే విక్రమ్ ఆశ్చర్యపోయాడని.. ఇలా ఒక సంగీత దర్శకుడికి ఆఫర్ ఇస్తుంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్తోనే వెళ్లమని చెప్పడం గొప్ప విషయమని.. ఈ సంస్కారం వల్ల నువ్వు చాలా ఎత్తుకు ఎదుగుతావు అని విక్రమ్ చెప్పాడని దేవి వెల్లడించాడు. విక్రమ్, విజయ్ కాంబినేషన్లో నాన్న, తాండవం చిత్రాలు వచ్చాయి. వీటిలో ఏదో ఒక సినిమా గురించే దేవి మాట్లాడి ఉండొచ్చు.
This post was last modified on December 6, 2024 11:41 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…