Movie News

హీరో పట్టుబట్టినా.. సంగీతం చేయనన్న దేవి!

పుష్ప-2 సినిమాకు తాను సంగీత దర్శకుడిగా ఉండగా.. ఇంకో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను బీజీఎం కోసం తీసుకోవడం పట్ల దేవిశ్రీ ప్రసాద్ ఎంత హర్టయ్యాడో రిలీజ్ ముంగిట చెన్నైలో జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్లో స్పష్టంగా తెలిసిపోయింది. ఐతే సినిమాలో చాలా వరకు తన బీజీఎంయే వాడడంతో అతను చివరికి కామ్ అయ్యాడు. ఇలా ఒకరి సినిమాలోకి ఇంకొకరు రావడాన్ని దేవి ముందు నుంచి వ్యతిరేకిస్తూనే ఉండడం గమనార్హం. గతంలో ‘అతడు’ సినిమాకు మణిశర్మను ఓసారి అనుకున్నాక తనను అడిగితే.. తాను నో చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు దేవి.

‘ఇంద్ర’లో ఓ పాటకు తనను అడిగినా కూడా అలా చేయడం కుదరదనే చెప్పినట్లు కూడా ఆ సందర్భంలో వెల్లడించాడు. తాజాగా మరో ఇంటర్వ్యూలో ఓ స్టార్ హీరో తన కోసం పట్టుబడ్డప్పటికీ తనకున్న ఎథిక్స్ వల్ల ఆ సినిమా చేయలేదని దేవి వెల్లడించాడు. తమిళ స్టార్ హీరో విక్రమ్‌తో ఏఎల్ విజయ్ చేయాల్సిన ఓ సినిమా కోసం తాను సంగీతం అందించాల్సిందని దేవి చెప్పాడు. తననే సంగీత దర్శకుడిగా తీసుకోవాలని విక్రమ్ పట్టుబట్టినట్లు తెలిపాడు.

ఐతే అప్పటిదాకా జీవీ ప్రకాష్ కుమార్.. విజయ్ సినిమాలకు వరుసగా పని చేస్తున్నాడని.. విక్రమ్‌తో చేయాల్సిన సినిమా కథను కూడా వాళ్లిద్దరూ చర్చించుకున్నారని.. జీవీతోనే మళ్లీ పని చేయాలని విజయ్ అనుకున్నాడని.. ఈ విషయం తెలిసి తాను అతడితోనే కొనసాగమని విజయ్‌కి చెప్పినట్లు దేవి చెప్పాడు. తర్వాత విక్రమ్‌కు ఫోన్ చేసి మాట్లాడానని.. విజయ్‌కి జీవీతోనే కంఫర్ట్ అని, తనతోనే కొనసాగనివ్వాలని చెబితే విక్రమ్ ఆశ్చర్యపోయాడని.. ఇలా ఒక సంగీత దర్శకుడికి ఆఫర్ ఇస్తుంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్‌తోనే వెళ్లమని చెప్పడం గొప్ప విషయమని.. ఈ సంస్కారం వల్ల నువ్వు చాలా ఎత్తుకు ఎదుగుతావు అని విక్రమ్ చెప్పాడని దేవి వెల్లడించాడు. విక్రమ్, విజయ్ కాంబినేషన్లో నాన్న, తాండవం చిత్రాలు వచ్చాయి. వీటిలో ఏదో ఒక సినిమా గురించే దేవి మాట్లాడి ఉండొచ్చు.

This post was last modified on December 6, 2024 11:41 pm

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

15 minutes ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

1 hour ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

1 hour ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

3 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

4 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

5 hours ago