గత దశాబ్ద కాలంలో ఇండియాలో అత్యుత్తమ నటుల్లో ఒకడిగా ఎదిగిన ఆర్టిస్ట్.. ఫాహద్ ఫాజిల్. లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ తనయుడైన ఫాహద్.. ముందు మామూలు సినిమాలే చేశాడు. ‘బెంగళూరు డేస్’ లాంటి పెద్ద హిట్టయిన సినిమాలో కూడా అతడి క్యారెక్టర్, నటన సింపుల్గానే అనిపిస్తాయి. కానీ తర్వాత ‘కుంబలంగి నైట్స్’ లాంటి చిత్రాల్లో అతను నటుడిగా విజృంభించాడు. ఇక గత ఐదారేళ్లలో ఫాహద్ చేసిన సినిమాలు, పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే.
కేవలం అతడి నటన చూడ్డానికే ఎంతోమంది థియేటర్లకు వెళ్తారు. తన మాతృభాష మలయాళంలోనే కాక వేరే భాషల్లోనూ అద్భుతమైన పాత్రలతో మెప్పించాడు ఫాహద్. తెలుగులో కూడా తన డెబ్యూ మూవీ ‘పుష్ప’ తన ప్రత్యేకతను చాటి చెప్పింది. అందులో మిగతా సినిమా అంతా ఒకెత్తయితే.. ఫాహద్ కనిపించే చివరి 20 నిమిషాలు మరో ఎత్తు. సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్లడంలో ఫాహద్ పాత్ర, తన నటన కీలక పాత్ర పోషించాయి.‘పుష్ప-1’లో ఫాహద్ పాత్రను పరిచయం చేసిన తీరు చూసి.. రెండో భాగంలో అతడి పాత్ర వేరే లెవెల్లో ఉంటుందని, పెర్ఫామెన్స్ అదిరిపోతుందని అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.
కానీ తీరా సినిమా చూసిన దగ్గర్నుంచి అందరూ పెదవి విరుస్తున్నారు. హీరోను విపరీతంగా ఎలివేట్ చేయడమే పనిగా పెట్టుకున్న సుకుమార్.. మిగతా పాత్రల మీద పెద్దగా ఫోకస్ చేయలేదని.. విలన్ పాత్రలు వీకైపోవడం మైనస్ అయిందని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఫాహద్ పాత్ర మొదట్లో బాగానే అనిపించినా.. రాను రాను వీక్ అయిపోయిందని.. చివరికి అతనొక జోకర్ లాగా తయారయ్యాడని అంటున్నారు.
ఇంటర్వెల్ ముంగిట పుష్ప-షెకావత్ ఫేసాఫ్ చూసి ఎంతో ఊహించుకుంటే.. ద్వితీయార్ధంలో వారి మధ్య పోరు హోరాహోరీగా సాగలేదని.. హీరో ముందు విలన్ పాత్ర డంగైపోయిందని.. ఫాహద్ పాత్రను ముగించిన తీరు కూడా అంత బాగా లేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. విలన్ పాత్ర ఎంత బాగుంటే హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుందని సుకుమార్కు తెలియంది కాదని.. అయినా ఆయన ఈ విషయాన్ని విస్మరించారని ఫాహద్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on December 6, 2024 7:24 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…