Movie News

రాజా సాబ్ రానంటే విశ్వంభర వస్తాడు!

ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ ఏప్రిల్ 10 విడుదల కావడం లేదన్న ఊహాగానాలు ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా తిరుగుతున్నాయి. ఇంకా అయిదు నెలల సమయం ఉన్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్, విఎఫెక్స్ పనులు బోలెడు ఉండటంతో అప్పటికంతా పూర్తవ్వడం డౌట్ అంటున్నారు. అందుకే ఇదే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న మరో ప్యాన్ ఇండియా మూవీ మిరాయ్ రిలీజ్ ఏప్రిల్ 18 నుంచి వాయిదా వేయడం లేదన్న కామెంట్లకు బలం చేకూరుతోంది. అయితే ఇది నిజమా కాదా అనేది నిర్ధారణ కాలేదు కానీ పోస్ట్ పోన్ గురించి లీకైతే మాత్రం విశ్వసనీయంగా ఉంది.

ఒకవేళ ఇది కనక జరిగితే విశ్వంభరని దించే ఆలోచనలో యువి క్రియేషన్స్ సీరియస్ గా ఉందట. ఇప్పటికే షూట్ దాదాపు పూర్తి కావొస్తుంది. టీజర్ కొచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని దృష్టిలో ఉంచుకుని గ్రాఫిక్స్ మీద మళ్ళీ వర్క్ చేస్తున్నట్టు సమాచారం. దీన్ని ఫిబ్రవరిలోగా కొలిక్కి తేవాలని యువి టీమ్ లక్ష్యంగా పెట్టుకుందట. ఏదో ఒక నిర్ణయం సంక్రాంతి లోగా తీసుకుని పండగకు మొదటి లిరికల్ సాంగ్ వదిలితే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలిసింది. ఉన్న బజ్ తగ్గిపోయిన నేపథ్యంలో ప్రమోషన్ల పరంగా విశ్వంభరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమాలు చెప్పిన డేట్లకు రాలేని పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయి. కనీసం రెండు మూడు తేదీలు మారకుండా ఎవరూ లేరు. మరి రాజా సాబ్ అదే రూటు పడుతుందా అనేది ప్రొడక్షన్ హౌస్ మీద ఆధారపడి ఉంటుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించిన ఈ హారర్ డ్రామాకు తమన్ సంగీతం సమకూర్చాడు. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద చూడని అతి పెద్ద హారర్ గ్రాండియర్ ఇవ్వబోతున్నట్టు నిర్మాత టిజి విశ్వప్రసాద్ ప్రకటించాక అంచనాలు పెరిగాయి. మరి ఏప్రిల్ 10 రాజా సాబ్ వస్తాడో లేక విశ్వంభర ఆగమిస్తాడో చూద్దాం.

This post was last modified on December 6, 2024 7:20 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

16 minutes ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

1 hour ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

2 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

4 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

4 hours ago

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

4 hours ago