ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ ఏప్రిల్ 10 విడుదల కావడం లేదన్న ఊహాగానాలు ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా తిరుగుతున్నాయి. ఇంకా అయిదు నెలల సమయం ఉన్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్, విఎఫెక్స్ పనులు బోలెడు ఉండటంతో అప్పటికంతా పూర్తవ్వడం డౌట్ అంటున్నారు. అందుకే ఇదే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న మరో ప్యాన్ ఇండియా మూవీ మిరాయ్ రిలీజ్ ఏప్రిల్ 18 నుంచి వాయిదా వేయడం లేదన్న కామెంట్లకు బలం చేకూరుతోంది. అయితే ఇది నిజమా కాదా అనేది నిర్ధారణ కాలేదు కానీ పోస్ట్ పోన్ గురించి లీకైతే మాత్రం విశ్వసనీయంగా ఉంది.
ఒకవేళ ఇది కనక జరిగితే విశ్వంభరని దించే ఆలోచనలో యువి క్రియేషన్స్ సీరియస్ గా ఉందట. ఇప్పటికే షూట్ దాదాపు పూర్తి కావొస్తుంది. టీజర్ కొచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని దృష్టిలో ఉంచుకుని గ్రాఫిక్స్ మీద మళ్ళీ వర్క్ చేస్తున్నట్టు సమాచారం. దీన్ని ఫిబ్రవరిలోగా కొలిక్కి తేవాలని యువి టీమ్ లక్ష్యంగా పెట్టుకుందట. ఏదో ఒక నిర్ణయం సంక్రాంతి లోగా తీసుకుని పండగకు మొదటి లిరికల్ సాంగ్ వదిలితే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలిసింది. ఉన్న బజ్ తగ్గిపోయిన నేపథ్యంలో ప్రమోషన్ల పరంగా విశ్వంభరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమాలు చెప్పిన డేట్లకు రాలేని పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయి. కనీసం రెండు మూడు తేదీలు మారకుండా ఎవరూ లేరు. మరి రాజా సాబ్ అదే రూటు పడుతుందా అనేది ప్రొడక్షన్ హౌస్ మీద ఆధారపడి ఉంటుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించిన ఈ హారర్ డ్రామాకు తమన్ సంగీతం సమకూర్చాడు. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద చూడని అతి పెద్ద హారర్ గ్రాండియర్ ఇవ్వబోతున్నట్టు నిర్మాత టిజి విశ్వప్రసాద్ ప్రకటించాక అంచనాలు పెరిగాయి. మరి ఏప్రిల్ 10 రాజా సాబ్ వస్తాడో లేక విశ్వంభర ఆగమిస్తాడో చూద్దాం.
మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉంది. నిజమే.ఎవరూ కాదనలేరు. అయితే ఇవాళ వైజాగ్ లో జరిగిన…
తెలుగు సినిమాలకు ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తీసుకురావడం మామూలే. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ల విషయంలో ఎక్కువగా వేరే ఇండస్ట్రీల మీద…
అవసరమున్నా లేకపోయినా.. సీక్వెల్స్కు లీడ్ ఇవ్వడం అన్నది ఈ రోజుల్లో మామూలైపోయింది. అలా హింట్ ఇచ్చిన సినిమాల్లో సెకండ్ పార్ట్…
పెద్ది థియేటర్ రన్ ముగింపు దిశగా వెళ్తోంది. ఈ వీకెండ్ కాస్త పికపయ్యే అవకాశాలున్నాయి. పాత రీ రిలీజులు తప్ప…
ఇటీవలే సింగర్ సునీత మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్త్రీలు 'నా శరీరం నా ఇష్టం' అన్నప్పుడు అవతలి…
గత ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో ఆరుగురు సైనికులు వీరమరణం చెందినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. దాదాపు 13…