సెలబ్రెటీల సాయంతో నేరాలు, ఘోరాలపై జనాల్లో అవగాహన పెంచే కార్యక్రమాల్ని హైదరాబాద్ పోలీసులు తరచుగా చేపడుతున్నారు. ఇందుకోసం టాలీవుడ్లో ఇప్పటికే పలువురు సెలబ్రెటీల సాయం తీసుకున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఓ మంచి పని కోసం హైదరాబాద్ పోలీసులతో చేతులు కలిపాడు. ఆన్ లైన్లో అపరిచితులతో స్నేహం చేయడం ఎంత ప్రమాదమో వివరిస్తూ తారక్ ఒక వీడియో చేశాడు. తారక్ వ్యాఖ్యానం కంటే ముందు ఇందులో ఒక వీడియో చూపించారు.
ఒక అమ్మాయి తన గదిలో ఏడుస్తూ ఉంటే తన స్నేహితురాలు వచ్చి ఏమైందని అడుగుతుంది. ఫేస్ బుక్లో ఒక అబ్బాయితో పరిచయం జరగడం.. ఆ తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడం.. అతను ప్రపోజ్ చేయగా.. ఆ అమ్మాయి ఓకే చెప్పడం.. తర్వాత ఆ అమ్మాయి నగ్న చిత్రాలు అడిగితే ఆమె పంపడం.. వాటిని పెట్టుకుని అతను ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం.. ఆ అమ్మాయి తీవ్ర మానసిక వేదనకు గురి కావడం.. ఇలా సాగుతుందా వీడియో.
ఇది ముగిశాక ఆన్ లైన్ స్నేహాలతో జాగ్రత్తగా ఉండాలని.. వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని.. అపరిచిత వ్యక్తులతో సన్నిహితంగా ఉండొద్దని.. అప్రమత్తంగా ఉండాలని తారక్ హితవు పలికాడు. హైదరాబాద్ సైబర్ పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇంతకుముందు రాఖీ, టెంపర్ లాంటి సినిమాల్లో అమ్మాయిలకు అండగా నిలిచే అన్నయ్య పాత్రలతో తారక్ ఆకట్టుకున్నాడు.
ఈ నేపథ్యంలో అమ్మాయిలు ఈజీగా కనెక్టవుతారని అతడితో ఈ వీడియో చేయించినట్లున్నారు పోలీసులు. లాక్ డౌన్ టైంలో ఎక్కడా పెద్దగా కనిపించని తారక్.. తన లేటెస్ట్ లుక్తో ఈ వీడియోలో కనిపించడం అభిమానులను ఆనందపరిచింది. ఈ నెల 22న ‘ఆర్ఆర్ఆర్’లో తారక్ చేస్తున్న కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్ రిలీజవబోతున్న నేపథ్యంలో అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు.
This post was last modified on October 9, 2020 8:44 am
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…