Movie News

రజినీ సినిమాలో ఇంకో తెలుగు హీరో : ఎవరంటే…

ఇప్పుడు భాషల మధ్య పూర్తిగా హద్దులు చెరిగిపోయి అన్ని భాషల చిత్రాలూ అన్ని చోట్లా ఆడేస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా వేర్వేరు భాషలకు వెళ్లి సినిమాలు చేస్తున్నారు. ఒక భాషలో రాబోతున్న పెద్ద సినిమాలో వేరే భాషకు చెందిన నటుడిని నటింపజేస్తే దాన్ని విశేషంగా చెప్పుకునేవాళ్లు ఒకప్పుడు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. తెలుగులోకి చాలామంది పరభాషా నటులు వస్తున్నారు. మన ఆర్టిస్టులూ వేరే భాషలకు వెళ్తున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘కూలీ’లో అక్కినేని నాగార్జున నటిస్తుండడం అమితాసక్తిని రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కన్నడ నుంచి ఉపేంద్ర, మలయాళం నుంచి సోబిన్ షాహిర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్టులోకి మరో టాలీవుడ్ నటుడు వచ్చినట్లు సమాచారం. అతనే.. సందీప్ కిషన్.‘కూలీ’లో ఇప్పటికే ప్రత్యేక పాత్రలు చాలా ఉన్నాయి. వీటికి సందీప్ క్యారెక్టర్ కూడా తోడవుతున్నట్లు కోలీవుడ్ సమాచారం.

విశేషం ఏంటంటే.. ‘కూలీ’ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తొలి చిత్రంలో సందీపే హీరోగా నటించాడు. వీరి కలయికలో వచ్చిన ‘మానగరం’ తమిళంలో పెద్ద హిట్టయింది. లోకేష్‌‌కు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ‘ఖైదీ’తో అతడి కెరీరే మారిపోయింది. ఆపై మాస్టర్, విక్రమ్, లియో లాంటి భారీ చిత్రాలు తీసిన అతను.. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘కూలీ’ తీస్తున్నాడు. ఇప్పుడు కూడా సందీప్‌ను గుర్తుంచుకుని తనకో స్పెషల్ రోల్ ఇవ్వడం విశేషమే.

ఐతే ‘కూలీ’లో స్పెషల్ రోల్స్, క్యామియోస్ ఎక్కువ అయిపోతున్నాయనే అభిప్రాయం గురించి ఇంతకుముందు లోకేష్ స్పందిస్తూ.. ఆకర్షణ పెంచడానికి ఇవన్నీ చేయట్లేదని.. రజినీ సినిమాకు ఆ అవసరం లేదని.. ప్రతి పాత్రలో ఒక విశేషం ఉంటందని, అన్నీ కథలో భాగంగానే ఉంటాయని చెప్పాడు. మరి సందీప్ ఇందులో అంత ప్రత్యేకమైన పాత్ర ఏం చేస్తున్నాడో చూడాలి.

Kumar

Recent Posts

పులిని చూసి వాత పెట్టుకోకూడదు

ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…

22 minutes ago

ఆటలు ఆడుతూనే ఉన్న జన నాయకుడు

రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…

35 minutes ago

దెయ్యాలంటే మనోళ్లకు ప్రేమ ఎక్కువే

ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…

2 hours ago

ముద్రగడ పద్మనాభం కన్నుమూత

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…

3 hours ago

అఖిల్ ఈసారి ఆ తప్పు చేయకూడదు

అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…

4 hours ago

తారక్ సినిమా లక్ష్యాలు చాలా పెద్దవి

ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…

5 hours ago