గత పది పదిహేనేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో వందల కొద్దీ కొత్తగా మల్టీప్లెక్స్ స్క్రీన్లు వచ్చాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా మల్టీప్లెక్సులు చూస్తున్నాం. ఐతే తెలుగు రాష్ట్రాలకు తొలిసారిగా మల్టీప్లెక్స్ వినోదాన్ని పరిచయం చేసిన ఘనత ప్రసాద్స్కే దక్కుతుంది. హైదరాబాద్కు పర్యాటకులు వస్తే కచ్చితంగా సందర్శించాల్సిన మాన్యుమెంట్ లాగా మారింది ప్రసాద్స్. నగరంలో పదుల సంఖ్యలో మల్టీప్లెక్సులు వచ్చినా.. ప్రసాద్స్ ప్రత్యేకత ప్రసాద్స్దే. కొత్త సినిమాకు ఫస్ట్ షో అక్కడే పడాలి.
ఫిలిం సెలబ్రెటీలు, మీడియాతో పాటు రెగ్యులర్ ఫిలిం గోయర్స్ అంతా అక్కడే సినిమా చూడాలి. అలాంటి కల్ట్ స్టేటస్ సంపాదించుకుంది ప్రసాద్స్. అలాంటి స్పెషల్ మల్టీప్లెక్సులో ‘పుష్ప-2’ లాంటి భారీ సినిమా ప్రదర్శనకు నోచుకోని పరిస్థితి తలెత్తడం హైదరాబాద్ సినీ ప్రియులను షాక్కు గురి చేస్తోంది. రెవెన్యూ షేరింగ్ విషయంలో ‘పుష్ప-2’ నిర్మాతలకు, ప్రసాద్స్ యాజమాన్యానికి మధ్య తలెత్తిన వివాదం వల్ల.. బుధవారం 9 గంటల ప్రాంతంలో కూడా ప్రసాద్స్లో ‘పుష్ప-2’ ఒక్క షోకు కూడా బుకింగ్ మొదలు కాలేదు.
గురువారం నుంచి ఏ రోజుకూ అడ్వాన్స్ బుకింగ్స్ లేవు. ‘పుష్ప-2’ కోసమని అన్ని స్క్రీన్లనూ అట్టి పెట్టుకుని ఉన్నారు కానీ.. ఈ వివాదం ఎంతకీ తేలకపోవడంతో బుకింగ్సే ఓపెన్ కాలేదు. మామూలుగా అయితే ముందు రోజు 9.30కి షెడ్యూల్ చేసిన పెయిడ్ ప్రిమియర్స్ ప్రసాద్స్లో కచ్చితంగా పడేవి. కానీ ఈ వివాదం వల్ల ప్రసాద్స్ బోసిపోయి ఉంది. ఇంత పెద్ద సినిమా రిలీజవుతుంటే.. జనాలతో కళకళలాడాల్సిన ప్రసాద్స్ ప్రాంగణం ఖాళీగా కనిపిస్తుండడం సినీ ప్రియులకు ఎంతమాత్రం రుచించేది కాదు.
This post was last modified on December 5, 2024 7:52 am
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…