Movie News

షాకింగ్ : ప్రసాద్ మల్టిప్లెక్స్ కి రావట్లేదా పుష్పా…

గత పది పదిహేనేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో వందల కొద్దీ కొత్తగా మల్టీప్లెక్స్ స్క్రీన్లు వచ్చాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా మల్టీప్లెక్సులు చూస్తున్నాం. ఐతే తెలుగు రాష్ట్రాలకు తొలిసారిగా మల్టీప్లెక్స్ వినోదాన్ని పరిచయం చేసిన ఘనత ప్రసాద్స్‌కే దక్కుతుంది. హైదరాబాద్‌కు పర్యాటకులు వస్తే కచ్చితంగా సందర్శించాల్సిన మాన్యుమెంట్ లాగా మారింది ప్రసాద్స్. నగరంలో పదుల సంఖ్యలో మల్టీప్లెక్సులు వచ్చినా.. ప్రసాద్స్ ప్రత్యేకత ప్రసాద్స్‌దే. కొత్త సినిమాకు ఫస్ట్ షో అక్కడే పడాలి.

ఫిలిం సెలబ్రెటీలు, మీడియాతో పాటు రెగ్యులర్ ఫిలిం గోయర్స్ అంతా అక్కడే సినిమా చూడాలి. అలాంటి కల్ట్ స్టేటస్ సంపాదించుకుంది ప్రసాద్స్. అలాంటి స్పెషల్ మల్టీప్లెక్సులో ‘పుష్ప-2’ లాంటి భారీ సినిమా ప్రదర్శనకు నోచుకోని పరిస్థితి తలెత్తడం హైదరాబాద్ సినీ ప్రియులను షాక్‌కు గురి చేస్తోంది. రెవెన్యూ షేరింగ్ విషయంలో ‘పుష్ప-2’ నిర్మాతలకు, ప్రసాద్స్ యాజమాన్యానికి మధ్య తలెత్తిన వివాదం వల్ల.. బుధవారం 9 గంటల ప్రాంతంలో కూడా ప్రసాద్స్‌లో ‘పుష్ప-2’ ఒక్క షోకు కూడా బుకింగ్ మొదలు కాలేదు.

గురువారం నుంచి ఏ రోజుకూ అడ్వాన్స్ బుకింగ్స్ లేవు. ‘పుష్ప-2’ కోసమని అన్ని స్క్రీన్లనూ అట్టి పెట్టుకుని ఉన్నారు కానీ.. ఈ వివాదం ఎంతకీ తేలకపోవడంతో బుకింగ్సే ఓపెన్ కాలేదు. మామూలుగా అయితే ముందు రోజు 9.30కి షెడ్యూల్ చేసిన పెయిడ్ ప్రిమియర్స్ ప్రసాద్స్‌లో కచ్చితంగా పడేవి. కానీ ఈ వివాదం వల్ల ప్రసాద్స్ బోసిపోయి ఉంది. ఇంత పెద్ద సినిమా రిలీజవుతుంటే.. జనాలతో కళకళలాడాల్సిన ప్రసాద్స్ ప్రాంగణం ఖాళీగా కనిపిస్తుండడం సినీ ప్రియులకు ఎంతమాత్రం రుచించేది కాదు.

This post was last modified on December 5, 2024 7:52 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

4 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

4 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

4 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

6 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

7 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

7 hours ago