మరికొద్ది గంటల్లో ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్లు మొదలుకాబోతున్న తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు ఒక ట్వీట్ చేయడం ఫ్యాన్స్ మధ్య చర్చకు దారి తీస్తోంది. వందలాది టెక్నీషియన్లు, 24 క్రాఫ్ట్స్ కలిసి పని చేసి వేలాది మందికి ఉపాధి కలిగిచే సినిమాను విజయవంతం చేయాల్సిన బాధ్యత సినీ ప్రియులు, అభిమానుల మీద ఉందని ఎక్స్ వేదికగా ట్వీట్ వేయడం ఈ డిస్కషన్ కు కారణం. అందులో ఆయన ఎక్కడా అల్లు అర్జున్ ని ట్యాగ్ చేయడం, పుష్ప 2 పేరు ప్రస్తావించడం కానీ చేయలేదు. నిర్మాణ సంస్థ, దర్శకుడు, సాంకేతిక నిపుణులు ఎవరిని మెన్షన్ చేయకుండా కేవలం ఆదరించమని కోరారు.
ఇలా చేయడం వెనుక కారణం లేకపోలేదు. ఎన్నికల ప్రచారంలో వైసిపి స్నేహితుడి కోసం బన్నీ నంద్యాల వెళ్లినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ తన మీద గుర్రుగా ఉన్నారు. ఈ విభేదాలు ఆన్ లైన్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. రిలీజ్ దగ్గరలో కలెక్షన్లు, టికెట్ రేట్ల గురించి డిబేట్లు హాట్ గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2ని చూడకూడదని, బెనిఫిట్ షోలు కొనకూడదని వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇదంతా నాగబాబుకి చేరడం వల్లే పుష్ప 2 కోసం సందేశమిచ్చారా లేక యధాలాపంగా అన్నది బహిరంగ రహస్యమే. ఎందుకంటే ఈ వారంలో పుష్ప 2 తప్ప ఇంకే తెలుగు రిలీజ్ లేదు కాబట్టి.
ఉదయం సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ అందరికి శుభాకాంక్షలు చెబుతూ పుష్ప 2 పోస్టర్ పెట్టాడు. మెగా, అల్లు మధ్య ఏవో విభేదాలున్నాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో అధిక శాతం ఆ ఫ్యామిలీ వాళ్ళు మౌనంగా ఉండటం సందేహాలను పెంచుతోంది కానీ అబ్బే అదేమీ లేదని ఆయా వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. సరే ఏదో ఒక రకంగా నాగబాబు అయితే సినిమాని సినిమాగా చూడమనే మెసేజ్ ఇచ్చారు కాబట్టి దీని ప్రభావం ఎంత మొత్తంలో ఉంటుందనేది చెప్పలేం కానీ కొంత వేడిని చల్లార్చడానికి ఉపయోగపడొచ్చు. కాకపోతే పుష్ప 2 పేరు ట్వీట్లో ఉంటే ప్రభావం ఎక్కువగా ఉండేది.
This post was last modified on December 4, 2024 7:32 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…