సంక్రాంతి ఎంతో దూరంలో లేదు. నలభై రోజుల్లో పండగ హడావిడి మొదలైపోతుంది. ఇప్పటిదాకా డాకు మహారాజ్ ప్రమోషన్లు మొదలుకాలేదు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేశారు. చిన్న టీజర్ తప్ప ఎలాంటి కంటెంట్ బయటికి రాలేదు. పోటీలో ఉన్న గేమ్ ఛేంజర్ నుంచి మూడు పాటలు, ఒక టీజర్ రాగా చివర్లో డేట్ లాక్ చేసుకున్న సంక్రాంతికి వస్తున్నాం నుంచి గోదారి గట్టు సాంగ్ ఆల్రెడీ ఛార్ట్ బస్టర్ అయిపోయింది. ఇంకోవైపు రామ్ చరణ్ టీమ్ సైలెంట్ అయిపోయింది. 21న యుఎస్ లో జరగబోయే ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన పోస్టర్లు తప్ప ఇంకే సౌండ్ చేయడం లేదు. ఎందుకనే కారణాలు చూద్దాం.
ప్రస్తుతం బయ్యర్ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప 2 హడావిడే కనిపిస్తోంది. కనీసం వారం దాకా ఈ వేడి చల్లారేలా లేదు. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఈ నేపథ్యంలో ఇంకెవరు అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నించినా అవి పూర్తి స్థాయిలో జనాలకు చేరేలా లేవు. పుష్ప ప్రీమియర్ రేట్ల గురించి ఒక పక్క, ఓపెనింగ్ ఎంతొస్తుందనే దాని మీద చర్చలు ఇంకో వైపు, ఏ ఏ రికార్డులు బద్దలవుతాయనే డిస్కషన్లు, ఇంకోపక్క ఇలా ఎక్కడ చూసినా అల్లు అర్జున్ జపమే కనిపిస్తోంది. ముందు రోజు రాత్రే బెనిఫిట్ షోలు ప్లాన్ చేయడంతో ఆన్ లైన్ రచ్చ ఇంకా ఎక్కువగా ఉంది.
అందుకే బాలయ్య, చరణ్ ఇద్దరూ ఇంకొద్ది రోజులు సైలెంట్ గా ఉండి డిసెంబర్ 10 నుంచి రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం. రెండు వేర్వేరు ప్రొడక్షన్ హౌసులు కావడంతో ప్రమోషన్లు పోటాపోటీగా ఉండబోతున్నాయి. ఆన్ స్టాపబుల్ 4 కోసం ఈసారి వీళిద్దరి కాంబోలో ఒక ఎపిసోడ్ ఉండొచ్చనే టాక్ ఉంది. దాదాపు ఖరారైనట్టేనని అంటున్నారు. ఒకవేళ నిజమైతే అదో బంపర్ బొనాంజా అవుతుంది. డిసెంబర్ 20 నుంచి క్రిస్మస్ రిలీజుల హల్చల్ ఉంటుంది కాబట్టి వీలైనంతగా గేమ్ చేంజర్, డాకు మహారాజ్ లు పబ్లిసిటీ మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే పుష్ప 2 సెట్ చేయబోయే రికార్డులు మాములుగా ఉండవుగా.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…