బాలీవుడ్ నటుడే అయినప్పటికీ వివేక్ ఒబెరాయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ముఖ్యంగా రక్త చరిత్రలో పరిటాల రవి పాత్ర చాలా పేరు తీసుకొచ్చింది. వినయ విధేయ రామ ఎంత డిజాస్టర్ అయినా అందులో విలన్ గా ఇచ్చిన పెర్ఫార్మన్స్ మాస్ ని ఆకట్టుకుంది. అయితే వివేక్ చాలా కాలంగా పరిశ్రమకు దూరంగా ఉంటున్నాడు. మలయాళంలో లూసిఫర్, కన్నడలో రుస్తుం తర్వాత సౌత్ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదు. ఈ ఏడాది రోహిత్ శెట్టి వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్ లో మాత్రమే కనిపించాడు తప్పించి రెండేళ్లుగా బిగ్ స్క్రీన్ కి దూరంగా ఉన్నాడు. దానికి కారణాలేంటో తాజాగా వివరించాడు.అతని మాటల్లో అదేంటో చూద్దాం.
ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. హిట్లు అవార్డులు కొట్టినంత మాత్రాన ఛాన్సులు క్యూ కడతాయని గ్యారెంటీ లేదు. 2007లో ‘షూటౌట్ అట్ లోఖండ్’ వాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎక్కడ చూసినా గణపత్ పాట హోరెత్తిపోయింది. దెబ్బకు బిజీ అవుతా అనుకుంటే ఏడాదిన్నర ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఆఫర్ల కోసం మీడియేటర్ల మీద ఆధారపడటం ఇష్టం లేదు. అందుకే వ్యాపారం మీద దృష్టి పెట్టా. దాంట్లోనే బిజీ అయ్యా. 22 సంవత్సరాల కెరీర్ లో కేవలం 67 సినిమాలు మాత్రమే చేయడానికి కారణం ఇదే. ఆర్థికంగా బాగా సెటిలైపోయాను.
చూశారుగా వివేక్ మాటలు. ఫైనాన్సియల్ గా భద్రంగా ఉండాలంటే సినిమాల కంటే బిజినెస్ ఉత్తమమని భావించాడు. ఈయన తండ్రి సురేష్ ఒబెరాయ్ బాలీవుడ్ లో పేరున్న నటుడు. 1988లో చిరంజీవి మరణ మృదంగం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కానీ ఆ తర్వాత హిందీకే పరిమితమయ్యారు. యానిమల్ లో రన్బీర్ కపూర్ దాదాజీగా నటించింది ఈయనే. ఇప్పటికీ తండ్రి యాక్టివ్ గా వేషాలు వేస్తుంటే కొడుకు మాత్రం త్వరగా రిటైర్ కావడం ట్విస్ట్. వివేక్ ఒబెరాయ్ ఒప్పుకోవాలే కానీ ప్రస్తుతం విలన్ల కొరత తీవ్రంగా ఉన్న దక్షిణాది నుంచి బోలెడు అవకాశాలు సిద్ధంగా ఉన్నాయి. తనేమో ఆసక్తిగా లేడు మరి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…